Nirmala Sitharaman: మూడేళ్ళలో ఏపీ అప్పులు ఎన్నికోట్లంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ ప్రభుత్వం అప్పులపైనే ఆధారపడుతోందని విపక్షాలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకూ ఎంత అప్పు చేసిందో తెలుసా? కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఏపీ అప్పులపై కీలక ప్రకటన చేశారు. 2020-21 ఆర్ధిక సంవత్సరానికి గాను ఆంధ్ర ప్రదేశ్ తీసుకున్న రుణం మెత్తం 3 లక్షల 7 వేల 671 కోట్ల రూపాయలు అని ఆర్థికమంత్రి తెలిపారు.
2021-22 ఆర్ధిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రుణం మెత్తం 3 లక్షల 60 వేల 333 కోట్ల రూపాయలు. 2021-22 లో అదనంగా తీసుకున్న రుణం సుమారు 53 వేల కోట్ల రూపాయలు అని ఆమె వెల్లడించారు. 2022-23 ఆర్ధిక సంవత్సరానికి ఆంధ్ర ప్రదేశ్ రుణం మొత్తం 3 లక్షల 98 వేల 903 కోట్ల రూపాయలుగా ఆమె వివరించారు. 2022-23 సంవత్సరంలో ఏపీ ప్రభుత్వం వివిధ అవసరాల కోసం అదనంగా తీసుకున్న రుణం 38 వేల కోట్ల రూపాయలుగా ఆమె తెలియచేశారు.
Also Read
- NRI: అంతిమ శ్వాస భారత్లోనే... అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
CM Jagan Review: ఆదాయం తెచ్చే శాఖలపై జగన్ సమీక్ష
ఏపీలో అప్పులపై ఆర్థిక నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీలో చంద్రబాబు హయాం నుంచి ఇప్పటివరకూ అప్పులు పెరుగుతూనే వున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ ఆంధ్రప్రదేశ్ అప్పులు రూ.3.80 లక్షల కోట్లుగా ఇటీవల వెల్లడించారు. అయితే, తమ ప్రభుత్వం కేంద్ర నిబంధనలకు లోబడే అప్పులు చేసిందని ఆయన స్పష్టం చేశారు.. ఏపీలో అప్పులు పెరిగినమాట నిజమే.
కానీ, కోవిడ్, ఇతర పరిస్థితుల వల్లే అప్పు పెరిగిందన్నారు. రాష్ట్ర విభజన నాటికి 1.34 లక్షల కోట్లుగా అప్పు ఉంటే ఏపీలో ద్రవ్యలోటు చాలా తక్కువని దువ్వూరి కృష్ణ వివరించారు. చంద్రబాబు హయాంలో ఏటా 19.4 శాతం అప్పులు ఉంటే.. ఇప్పుడు 15.77 శాతం మాత్రమే అప్పులు ఉన్నాయని వెల్లడించారు.. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రూ.39 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని ఈ సందర్భంగా వెల్లడించారు దువ్వూరి కృష్ణ. టీడీపీ ప్రభుత్వం గతంలో నిబంధనలకు లోబడకుండా అప్పులు చేసిందంటున్నారు వైసీపీ నేతలు.
తాజావార్తలు
-
Bank Fraud: భారీ బ్యాంకు మోసం.. రూ.3.66 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీలను అటాచ్ చేసిన ఈడీ.!
-
సమంతకు ముందే.. గర్భంతో నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ప్రసవాన్నే సినిమాలో చూపించారు!
-
QR Code Mandatory on Medicines: ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం.. ఇకపై అసలైన, నకిలీ మందులను క్షణాల్లో గుర్తించొచ్చు!
-
Raja Shivaji OTT: బాక్సాఫీస్ రికార్డులు బద్దలుకొట్టిన ‘రాజా శివాజీ’.. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్
-
Yash Dayal: యశ్ దయాల్ ‘కమ్బ్యాక్’.. ‘పోక్సో’ కేసుల నుంచి విముక్తి!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!