Nirmala Sitharaman: మూడేళ్ళలో ఏపీ అప్పులు ఎన్నికోట్లంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ ప్రభుత్వం అప్పులపైనే ఆధారపడుతోందని విపక్షాలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకూ ఎంత అప్పు చేసిందో తెలుసా? కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఏపీ అప్పులపై కీలక ప్రకటన చేశారు. 2020-21 ఆర్ధిక సంవత్సరానికి గాను ఆంధ్ర ప్రదేశ్ తీసుకున్న రుణం మెత్తం 3 లక్షల 7 వేల 671 కోట్ల రూపాయలు అని ఆర్థికమంత్రి తెలిపారు.
2021-22 ఆర్ధిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రుణం మెత్తం 3 లక్షల 60 వేల 333 కోట్ల రూపాయలు. 2021-22 లో అదనంగా తీసుకున్న రుణం సుమారు 53 వేల కోట్ల రూపాయలు అని ఆమె వెల్లడించారు. 2022-23 ఆర్ధిక సంవత్సరానికి ఆంధ్ర ప్రదేశ్ రుణం మొత్తం 3 లక్షల 98 వేల 903 కోట్ల రూపాయలుగా ఆమె వివరించారు. 2022-23 సంవత్సరంలో ఏపీ ప్రభుత్వం వివిధ అవసరాల కోసం అదనంగా తీసుకున్న రుణం 38 వేల కోట్ల రూపాయలుగా ఆమె తెలియచేశారు.
Also Read
- AP IAS Transfers 2026: 22 మంది IAS అధికారుల బదిలీలు.. కీలక శాఖల్లో మార్పులు.. ఆమ్రపాలికి నో పోస్టింగ్..
- Medico Priyanka: మెడికో ప్రియాంక పరిస్థితి విషమం.. మద్యం మత్తులో కారుతో తొక్కించిన ఉన్మాదులు..
- OTR : టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావుకు గడ్డుకాలమా? పార్టీలో తగ్గిన ప్రాధాన్యతపై చర్చ
- OTR : మంత్రి పార్థసారధిపై మైనింగ్ ఆరోపణలు.. నూజువీడులో రాజకీయ రగడ
CM Jagan Review: ఆదాయం తెచ్చే శాఖలపై జగన్ సమీక్ష
ఏపీలో అప్పులపై ఆర్థిక నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీలో చంద్రబాబు హయాం నుంచి ఇప్పటివరకూ అప్పులు పెరుగుతూనే వున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ ఆంధ్రప్రదేశ్ అప్పులు రూ.3.80 లక్షల కోట్లుగా ఇటీవల వెల్లడించారు. అయితే, తమ ప్రభుత్వం కేంద్ర నిబంధనలకు లోబడే అప్పులు చేసిందని ఆయన స్పష్టం చేశారు.. ఏపీలో అప్పులు పెరిగినమాట నిజమే.
కానీ, కోవిడ్, ఇతర పరిస్థితుల వల్లే అప్పు పెరిగిందన్నారు. రాష్ట్ర విభజన నాటికి 1.34 లక్షల కోట్లుగా అప్పు ఉంటే ఏపీలో ద్రవ్యలోటు చాలా తక్కువని దువ్వూరి కృష్ణ వివరించారు. చంద్రబాబు హయాంలో ఏటా 19.4 శాతం అప్పులు ఉంటే.. ఇప్పుడు 15.77 శాతం మాత్రమే అప్పులు ఉన్నాయని వెల్లడించారు.. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రూ.39 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని ఈ సందర్భంగా వెల్లడించారు దువ్వూరి కృష్ణ. టీడీపీ ప్రభుత్వం గతంలో నిబంధనలకు లోబడకుండా అప్పులు చేసిందంటున్నారు వైసీపీ నేతలు.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!