RBI Report: దేశంలో అప్పుల భారం ఉన్న టాప్ టెన్ రాష్ట్రాల్లో ఏపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో అప్పుల్లో ఉన్న రాష్ట్రాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ ప్రత్యేక నివేదిక విడుదల చేసింది. ఈ నివేదికలో ఆయా రాష్ట్రాల అప్పుల వివరాలను ప్రకటించింది. దేశంలో అప్పుల భారం ఎక్కువగా ఉన్న టాప్ టెన్ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 15వ ఆర్థిక సంఘం నిర్దారించిన రుణ, ఆర్థిక లోటు పరిమితులను ఆంధ్రప్రదేశ్ దాటేసిందని ఆర్బీఐ వివరించింది. బడ్జెటేతర రుణాల కోసం దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వనంత అధికంగా జీఎస్డీపీలో 9 శాతం బ్యాంక్ గ్యారంటీలను ఏపీ రాష్ట్రం ఇచ్చినట్లు ఆర్బీఐ వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన తొలి నెలరోజుల్లోనే స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ, చేబదులు అవకాశాలను ఏపీ పూర్తిగా వాడేసినట్టు తెలిపింది.
ఈ స్థాయిలో అప్పులు తీసుకున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఈ జాబితాలో ఏపీ తర్వాతి స్థానాల్లో తెలంగాణ, మణిపూర్, నాగాలాండ్ ఉన్నట్టు ప్రకటించింది. అయితే బహిరంగ మార్కెట్లో రుణాలు తీసుకునే ఫెసిలిటీ తెలంగాణలో లేదని… ఆంధ్రప్రదేశ్కే ఉందని ఆర్బీఐ ప్రకటించింది. ఈ ఫెసిలిటీ ఉపయోగించుకుని ఏపీ రూ.4వేల కోట్ల రుణం తీసుకుందని పేర్కొంది. బహిరంగ మార్కెట్లో రుణాలు తీసుకునే అవకాశం తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని తెలిపింది. కాగా జాతీయ సగటుతో పోల్చుకుంటే ఏపీ, మహారాష్ట్ర, తెలంగాణ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ద్రవ్యోల్బణం 8 శాతం దాటిందని ఆర్బీఐ వివరించింది. 2021-22 బడ్జెట్ ప్రకారం ఏపీ ఆదాయంలో 14 శాతం వడ్డీలకు వెళ్లిపోతుందని తెలిపింది.
Also Read
- Daggubati Purandeswari: 2024 ఫార్ములానే స్థానిక ఎన్నికల్లోనూ.. పురందరేశ్వరి కీలక వ్యాఖ్యలు
- Konaseema Fishermen: 23 రోజుల తర్వాత శుభవార్త.. గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు క్షేమం
- YS Jagan: 'సీఎంగా ఏం చేస్తున్నా' అని చంద్రబాబు ప్రశ్నించుకోవాలి.. వైఎస్ జగన్ ఫైర్!
- YS Jagan: వర్షాలు లేక సంక్షోభం వస్తే.. సీఎం చంద్రబాబు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు!
అటు 2022-23 ఆర్ధిక సంవత్సరంలో ఏపీ ప్రభుత్వం ప్రకటించిన ఉచిత పథకాలకు ఖర్చు చేసే మొత్తం రూ.27,541 కోట్లు అని.. ఇది జీఎస్డీపీలో 2.1 శాతానికి సమానం అని ఆర్బీఐ తెలిపింది. ఉచిత పథకాలకు పంజాబ్ తర్వాత అత్యధిక ఖర్చు చేస్తున్న రాష్ట్రం ఏపీనే అని పేర్కొంది. మొత్తం ఆదాయంలో 14.1 శాతం, సొంత ఆదాయంలో 30.3 శాతం ఉచిత పథకాలకు ఏపీ ప్రభుత్వం ఖర్చు చేస్తోందని వివరించింది.
తాజావార్తలు
-
Komaram Bheem District : ఆసిఫాబాద్లో వరద బీభత్సం.. బైకిస్టులకు తృటిలో తప్పిన ప్రమాదం..
-
Sugar Price Fall: చక్కెర ధరలపై కేంద్రం మాస్టర్ ప్లాన్.. సామాన్యులకు గుడ్ న్యూస్..
-
Ranabaali: ఇప్పుడు రష్మిక – విజయ్ వంతు.. ఈ వారంలోనే ‘రణబాలి’ బిగ్ సర్ప్రైజ్? అసలు ట్విస్ట్ ఇదే!
-
Operation Sindoor: భారత్ హిట్ లిస్టులో పాకిస్తాన్ ‘‘స్కార్దు’’.. చైనాకు కూడా హెచ్చరికేనా..?
-
Food Facts : పప్పులో తెల్లటి నురుగు.. మురికేనా.? అసలు నిజం ఇదే.!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..