Andhra University: ఆంధ్రా యూనివర్సిటీలో విద్యార్థులు-అధికారులు మధ్య చర్చలు సఫలం అయ్యారు.. దీంతో, నిరసనను విరమించారు ఏయూ విద్యార్థులు.. విద్యార్థుల హామీలు నెరవేరుస్తామని హామీ ఇచ్చారు ఆంధ్రా యూనివర్సిటీ వీసీ.. జిల్లా అధికారుల బృందం.. దసరా సెలవులులోగా విద్యార్థుల డిమాండ్లను పూర్తి చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు.. ఇక, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం త్రీమెన్ కమిటీ నియమించింది ప్రభుత్వం.. DMHO, KGH సూపరింటెండెంట్, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ ఈ కమిటీలో సభ్యులుగా ఉండనున్నారు.. మరోవైపు, ఆంధ్రా…
Perni Nani: నందమూరి బాలకృష్ణ, కామినేనిపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని.. అసెంబ్లీ వేదికగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై బాలకృష్ణ, కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.. కైకలూరు ప్రజల కష్టాలు పట్టని ఎమ్మెల్యే కామినేని అని.. జనం తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నా కామినేనికి పట్టదు. కైకలూరులో దళితులపై జనసేన నేతలు కత్తులతో దాడి చేస్తే మాట్లాడలేదు.. ప్రజల కష్టాల గురించి…
Pawan Kalyan Suffering With Viral Fever: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారు.. ఫీవర్తోనే ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు.. ఇతర కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు.. అయితే, గత నాలుగు రోజులుగా వైద్యం చేయించుకుంటున్నా.. జ్వరం తీవ్రత తగ్గలేదు.. దగ్గు ఎక్కువగా ఉండటంతో ఇబ్బంది పడుతున్నారు పవన్ కల్యాణ్.. వైద్యుల సూచనల మేరకు హైదరాబాద్ లో వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు. అందుకోసం ఈ రోజు మంగళగిరి నుంచి హైదరాబాద్ వెళ్తనున్నారు…
Students Protest: విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ బంద్ ఉద్రిక్తతలకు దారి తీసింది.. ఏయూ వీసీ రాజీనామా డిమాండ్ తో రెండో రోజు విద్యార్థులు ఆందోళనకు దిగారు.. ఎగ్జామ్స్, క్లాస్ లు బహిష్కరించారు.. క్యాంపస్ లో ర్యాలీలు నిర్వహించారు.. ఏయూ హాస్టల్లో ఓ విద్యార్థి సకాలంలో చికిత్స అందక మృతిచెందిన నేపథ్యంలో.. అధికారులు సరిగ్గా స్పందించకపోవడంతోనే ఆ విద్యార్థి మృతిచెందాడంటూ ఆందోళన కొనసాగిస్తున్నారు.. తమ సమస్యలు పట్టించుకోని వీసీ రాజశేఖర్ వెంటనే రాజీనామా చేయాలంటూ ఆయన చాంబర్లోకి దూసుకువెళ్లారు.…
Nuzvidu: జిల్లాల విభజన సమయంలో మూడు జిల్లాలుగా రూపాంతరం చెందింది ఉమ్మడి కృష్ణా జల్లా.. వాటిల్లో మొత్తం 16 నియోజకవర్గాలు ఉన్నాయి మూడు పార్లమెంట్ సెగ్మెంట్లు కూడా ఉన్నాయి. విజయవాడ పార్లమెంటును ఎన్టీఆర్ జిల్లాగా, మచిలీపట్నం పార్లమెంటును కృష్ణా జిల్లాగా మార్చారు. ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఉన్న కైకలూరు, నూజివీడు నియోజకవర్గాలను ఏలూరు జిల్లాలో కలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు, మైలవరం, విజయవాడలోని మూడు నియోజకవర్గాలు ఉన్నాయి. కృష్ణా జిల్లాలో గన్నవరం, పెనమలూరు, పామర్రు,…
Heavy Rains: ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల వర్షాలు కురుస్తాయని తెలిపింది. అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉంది. వాయుగుండం ఈనెల 27న ఉత్తర కోస్తా తీరాన్ని తాకే ఛాన్స్ ఉంది. దీని ప్రభావంతో రాబోయే ఐదు రోజుల్లో ఏపీలోని వివిధ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈరోజు నుంచి ఈనెల 29వరకు ఆంధ్రప్రదేశ్లో అతి…
Rithu Sahu Case: బెంగాల్ విద్యార్థిని రీతు సాహు మృతి కేసు విశాఖ పోలీసులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.. కేవలం పోలీసులకే కాదు, విచారణ కమిటీ అధికారులు, కాలేజీ యాజమాన్యం, హాస్టల్ నిర్వాహకులు పాత్రపై నిగ్గు తేల్చాలి.. మొదట పోలీసులు, తర్వాత హైకోర్టు, ఇప్పుడు సీబీఐకి విద్యార్థిని కేసు అప్పగించాలంటూ ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశం జారీ చేసింది. అది 2023 జూలై 14న హాస్టల్ భవనం పైనుంచి పడి మృతి చెందిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా…