AP Crime: మారిపోయిన భూ యజమాని పేరు.. ఎమ్మార్వో ఎదుటే బాధితుడి ఆత్మహత్యాయత్నం..
- బీఎన్ కండ్రిగ ఎమ్మార్వో ఆఫీసులో కలకలం..
- ఎమ్మార్వో సమక్షంలోనే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం..
- ఐదెకరాల భూమిపై విషయంలో ఘటన..
AP Crime: తమ పేరుపై ఉండాల్సిన భూమి.. తమ ప్రమేయం లేకుండానే మరో వ్యక్తి పేరు మీదకు మారిపోవడంతో.. బాధితుడు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన తిరుపతి జిల్లాలో జరిగింది.. బీఎన్ కండ్రిగ ఎమ్మార్వో ఆఫీసులో పల్లమాలకు చెందిన పాండు అనే వ్యక్తి ఎంఆర్వో సమక్షంలోనే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. తమ ఐదెకరాల భూమిపై గొడవలు జరుగుతున్నాయని, ప్రస్తుతం దీనిపై కోర్టులో కేసులు నడుస్తున్నాయన్నారు. అయితే, ఈ నెల 8వ తేదీ వరకు తన తల్లి వదప్పగారి అనసూయమ్మ పేరు మీద ఉన్న భూమి.. ఇప్పుడు బి.రవీంద్రబాబు పేరు మీదకు ఎలా మారిందంటూ ప్రశ్నించారు. ఆ సమయంలో ఎమ్మార్వో అక్కడే ఉండడంతో ఆయన సమక్షంలోనే తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు.. వెంటనే స్థానికులు అడ్డుకున్నారు.. తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య శరణ్యం అన్నాడు.. అయితే, అధికారులు ఈ విషయంపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి న్యాయం చేస్తామన్నారు. ఈ ఘటనతో ఒక్కసారిగా బీఎన్ కండ్రిగ ఎమ్మార్వో కార్యాలయం దగ్గర తీవ్ర కలకలం రేగింది..
Read Also: Etela Rajender: ఇది అబద్ధమైతే నేను రాజకీయల నుంచి తప్పుకుంటా.. ఈటల సంచలన వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
SRH vs DC Playing XI: ఇరుజట్లకూ గాయాల టెన్షన్.. కమిన్స్, అక్షర్ పటేల్ ఆడతారా.?
-
New Shoes Dispute: కొత్త షూస్ విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవ.. తమ్ముడిని హత్య చేసిన అన్న
-
Iran-US Talks: అమెరికాతో చర్చలపై మోజ్తాబా సంచలన నిర్ణయం! సర్వత్రా ఉత్కంఠ
-
Biker OTT: ఓటీటీలోకి శర్వానంద్ ‘బైకర్’..!
-
TGSRTC Strike: మరో 24 గంటల్లో ఆర్టీసీ సమ్మె.. చర్చలు ఫలిస్తాయా.?
ట్రెండింగ్
-
Apple CEO: టిమ్ కుక్ రాజీనామా.. కొత్త సీఈఓగా జాన్ టెర్నస్ బాధ్యతలు.!
-
Masala Vada Recipe: బండి మీద అమ్మేలా కరకరలాడే ‘మసాలా వడలు’.. ఈ చిట్కాలతో చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.!
-
Body Odor: చెమట వాసనతో ఇబ్బంది.? డియోడ్రెంట్ కాదు.. ఈ ఒక్క ‘పటిక’ చాలు.!
-
Ajith Kumar: బెల్జియం రేసు పోడియంపై రెపరెపలాడిన భారత జెండా.. హీరో అజిత్ సెలెబ్రేషన్స్ మాములుగా లేవుగా..!
-
ఇంట్లోనే థియేటర్ ఫీలింగ్.. Dolby Atmos సౌండ్, REGZA టెక్నాలజీతో కొత్త Toshiba Z670SP MiniLED 4K టీవీలు లాంచ్..!