Ram Gopal Varma: ప్రముఖ సినీ దర్శకుడు ఆర్జీవీ అలియాస్ రామ్ గోపాల్ వర్మకు మరో షాక్ తగిలింది.. ఆర్జీవీతో పాటు ఓ టీవీ ఛానల్ యాంకర్పై రాజమండ్రి త్రీ టౌన్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. హిందూ ఇతిహాసాలు – దేవుళ్లు, ఇండియన్ ఆర్మీని, ఆంధ్రులను సోషల్ మీడియాలో ఒక ఛానల్ ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మ దూషించినట్లు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు. రాజమండ్రి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది.. ఆర్జీవీతో పాటు సదరు యాంకర్పై క్రైమ్ నెం 487/2025, U/s 196 (1), 197(1) 353, 354,299 R/w (3) Bns Act, కింద కేసు నమోదు చేశారు పోలీసులు.
Read Also: Devisri Prasad: ‘ఎల్లమ్మ’ లో దేవిశ్రీప్రసాద్ జోడిగా స్టార్ బ్యూటీ ఫిక్స్!
రాజమండ్రికి చెందిన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, న్యాయవాది మేడా శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. ఓ మహిళా యాంకర్ వివాదాస్పద ప్రశ్నలను రామ్ గోపాల్ వర్మ కోసం ఉద్దేశపూర్వకంగా అడిగారని ఫిర్యాదులో మేడా శ్రీనివాస్ పేర్కొన్నారు. విద్వేషాలు రెచ్చగొట్టే రామ్ గోపాల్ వర్మ వీడియోలు వెనుక విదేశీ టెర్రరిస్టులు ఉండొచ్చని ఫిర్యాదులో పేర్కొన్నారు. రామ్ గోపాల్ వర్మ తదితరులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజమండ్రి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.. దీంతో, రాజమండ్రి త్రీ టౌన్ పోలీసులు ఆర్జీవీతో పాటు ఆ యాంకర్పై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు.. కాగా, ఇప్పటికే ఏపీ, తెలంగాణ సహా పలు ప్రాంతాల్లో వివిధ సందర్భాల్లో.. వివిధ అంశాలపై ఆర్జీవీపై కేసులు ఎదుర్కొన్న విషయం విదితమే..