Shashi Tharoor: “కాంగ్రెస్ పుండుపై కారం”.. పుతిన్ డిన్నర్పై శశి థరూర్ కీలక వ్యాఖ్యలు..
- పుతిన్ డిన్నర్పై శశి థరూర్ ట్వీట్..
- కాంగ్రెస్లో చర్చనీయాంశంగా మారిన వ్యవహారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shashi Tharoor: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గౌరవార్థం రాష్ట్రపతి భవన్లో విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ను ఆహ్వానించారు. శనివారం ఈ విందుపై థరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో పుతిన్తో డిన్నర్ జరిగిందని చెప్పారు. ఇదిలా ఉంటే, ఈ స్టేట్ డిన్నర్కు లోక్సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు ఆహ్వానం అందకపోవడం చర్చనీయాంశం అయింది. వీరిద్దర్ని ఆహ్వానించకుండా శశిథరూర్ను పిలవడంపై కాంగ్రెస్ అగ్గి మీద గుగ్గిలం అవుతోంది.
Read Also: Tata Harrier.ev: నెక్సాన్.evని దాటి, దుమ్మురేపుతున్న టాటా హారియర్.ev సేల్స్..
Also Read
- Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
- Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
- Karnataka: కర్ణాటక కాంగ్రెస్లో షాక్.. అవినీతి ఆరోపణలు.. కీలక మంత్రి రాజీనామా..
- Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
శనివారం సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిర్వహించిన విందులో పాల్గొన్న థరూర్, రష్యా ప్రతినిధి బృందంతో తన సంభాషణల్ని ఆస్వాదించినట్లు ఎక్స్లో ట్వీట్ చేశారు. “నిన్న రాత్రి అధ్యక్షుడు పుతిన్ కోసం @rashtrapatibhvn విందుకు హాజరయ్యాను. ఆహ్లాదకరమైన, ఆకర్షణీయమైన వాతావరణం నెలకొంది. హాజరైన చాలా మందితో, ముఖ్యంగా రష్యన్ ప్రతినిధి బృందంలోని సహచరులతో నా సంభాషణలను ఆస్వాదించాను!” అని ఆయన పోస్ట్ చేశారు.
అయితే, ఇప్పటికే పుతిన్ డిన్నర్ కాంగ్రెస్లో విభేదాలను బయటకు తీసుకువచ్చింది. గత కొంత కాలంగా శశి థరూర్ బీజేపీ ప్రభుత్వ పనితీరు, ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇది కాంగ్రెస్ పెద్దలకు నచ్చడం లేదు. తాజాగా, ఈ డిన్నర్కు రాహుల్, ఖర్గేలను ఆహ్వానించకపోగా, శశి థరూర్ను ఆహ్వానించడం రచ్చకు దారితీసింది. కాంగ్రెస్ నేత పవన్ ఖేరా మాట్లాడుతూ.. ఈ ఆట అర్థం కావడం లేదా అని థరూర్ను ప్రశ్నించారు. పుతిన్ భారత్లో ల్యాండ్ కావడానికి ముందు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం విదేశీ ప్రతినిధుల్ని, ప్రతిపక్ష నేతలను కలవకుండా కట్టడి చేస్తున్నారని ఆరోపించారు.
Attended the @rashtrapatibhvn banquet for President Putin last night. A warm and engaging atmosphere reigned. Enjoyed my conversations with many of the attendees, especially my dining companions from the Russian delegation! @RusEmbIndia pic.twitter.com/frP2TYZKXr
— Shashi Tharoor (@ShashiTharoor) December 6, 2025
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!