డ్రగ్స్ విషయంలో ఏపీలో రాజకీయ, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. డ్రగ్స్ను అధికార పార్టీ నేతలే సరఫరా చేయిస్తున్నానరని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తుంటే.. రాష్ట్ర ప్రతిష్టను మంటగలిపేందుకే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయని అధికార పార్టీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా రైల్వేకోడూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేశారు. చంద్రబాబుకు చిన్నమెదడు చిట్లినట్లు ఉందని.. ఆయనకు మతిపోయిందని కొరముట్ల శ్రీనివాసులు ఆరోపించారు. చంద్రబాబు డ్రగ్స్ వాడుతున్నాడనే అనుమానం ఉందని……
బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు సవాల్ విసిరారు ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డి… కడపలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సోము వీర్రాజు ఆరోపణలపై స్పందించారు.. విభజన చట్టంలో స్పెషల్ స్టేటస్, పోర్టు వంటి హామీలు అమలు చేస్తే మద్దతు ఇస్తామన్న ఆయన.. కానీ, సోము వీర్రాజు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.. బీజేపీ విభజన హామీలు అమలు చేయలేదని అర్థమైందని ఎద్దేవా చేసిన శ్రీకాంత్ రెడ్డి.. తాను ఇసుక వ్యాపారం చేస్తున్నానని సోము వీర్రాజు అంటున్నారు……
ఈనెల 23న తెలంగాణ చీఫ్ ఇంజినీర్ మురళీధర్ కేఆర్ఎంబీ ఛైర్మన్కు ఓ లేఖ రాశారు. ఆ లేఖలో నందికొండ ప్రాజెక్టు గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా నాగార్జున సాగర్ ఎడమ కాల్వ పరిధిపై కీలక అంశాలను పేర్కొన్నారు. 1952లో అప్పటి ఆంధ్ర రాష్ట్రం, హైదరాబాద్ రాష్ట్రం ఉమ్మడిగా తయారు చేసిన నందికొండ ప్రాజెక్టు నివేదికను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని… ఈ మేరకు ప్రాజెక్టు నివేదిక రిపోర్టును బేఖాతరు చేసి నాగార్జున సాగర్ ఎడమ కాలువను…
అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండగానే ఏపీ, తెలంగాణలో పొలిటికల్ సెగలు.. పొగలు కక్కుతున్నాయి. ఇలాంటి సమయంలో టీఆర్ఎస్ ప్లీనరీ నుంచి కీలక కామెంట్స్ చేశారు గులాబీ దళపతి, సీఎం కేసీఆర్. ఏపీ పిలుస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఇంతకీ కేసీఆర్ను ఏపీ నుంచి ఎవరు పిలిచారు? ప్లీనరీలో చేసిన కామెంట్స్ వెనక ఇంకేదైనా రాజకీయ ఎత్తుగడ ఉందా? పొలిటికల్ సర్కిళ్లలో జరుగుతున్న చర్చ ఏంటి? లెట్స్ వాచ్..! ఏపీ పిలుస్తోందన్న కేసీఆర్ మాటల వెనక చాణక్యం?…
ఆంధ్రప్రదేశ్లో ఇవాళ్టి నుంచి రేషన్ దిగుమతి, పంపిణీ నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది రేషన్ డీలర్ల సంఘం. 2020 పీఎంజీకేవై కమీషన్ బకాయిలు తక్షణమే చెల్లించాలని అలాగే… డీడీ నగదు వాపసు, ధరల వ్యత్యాస సర్క్యులర్లను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. డీలర్ల నుంచి ఐసీడీఎస్కు మళ్ళించిన కందిపప్పుకు సంబంధించిన బకాయిలను తక్షణమే చెల్లించాలని కోరారు డీలర్లు.2020 మార్చి 29 నుంచి ఇప్పటి వరకు ఏపీ పౌరసరఫరాల కార్పొరేషన్ నుంచి డీలర్లకు రావాల్సిన కమీషన్ బకాయిలు చెల్లించాలన్నారు.…
టీడీపీవి డర్టీ పాలిటిక్స్.. దాడుల ఫొటోలు చూపిస్తూ సానుభూతి పొందాలని చూస్తున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబుపై మండిపడ్డారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. టీడీపీ ఆఫీసుపై దాడులు ఎందుకు జరిగాయో, రాష్ట్రపతికి చంద్రబాబు వివరిస్తే మంచిదని సూచించిన ఆయన.. కుట్రలో భాగంగానే రాష్ట్రంపై పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారానికి దిగారని.. ప్రజాభిమానం ఉన్న సీఎంపై దుర్భాషలాడి ప్రజలు రెచ్చిపోయేలా చేసి, రాష్ట్రంలో అలజడి సృష్టించాలన్నది టీడీపీ ప్రయత్నం అని ఆరోపించారు. 2019 నుంచి వరుసగా పార్లమెంట్, అసెంబ్లీ, మున్సిపల్,…
‘నాకొంచెం తిక్కుంది.. దానికో లెక్కుంద’ని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘గబ్బర్ సింగ్’ మూవీలో పవర్ ఫుల్ డైలాగ్ చెబుతాడు. దీనికి ఆయన అభిమానులంతా చప్పళ్లు.. కేరింతలతో ఆదరించారు. ఈ సినిమాలో కన్పించినట్లుగానే పవర్ స్టార్ రాజకీయాల్లోనూ దూకుడుగానే వెళుతున్నారు. సినిమాల్లో బీజీగా ఉంటూ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన దారుణ పరాభవం నుంచి గుణపాఠాలు నేర్చుకొని పార్టీని తనదైన శైలిలో ముందుకు తీసుకెళుతుండటం ఆసక్తిని రేపుతోంది. జనసేన…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉక్కసారి కాకరేపిన టీడీపీ నేత పట్టాభిరామ్.. ఇప్పుడు ఎక్కడున్నారు? అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.. సీఎం వైఎస్ జగన్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పట్టాభి ఇంటితో పాటు, టీడీపీ కార్యాలయాలపై కూడా దాడులు జరిగాయి.. ఇక, సీఎంను వ్యక్తిగతంగా దూషించిన పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేయగా.. బెయిల్పై ఆయన విడుదలయ్యారు.. అయితే, పట్టాభి ఇప్పుడు మాల్దీవ్స్కు వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది. Read Also : యూపీలో కాంగ్రెస్కు షాక్.. పార్టీకి ఇద్దరు కీలక…
ఏపీలో ఇవాళ మళ్లీ కరోనా కేసులు భారీ తగ్గాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 27, 641 శాంపిల్స్ పరీక్షించగా.. 295 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో ఏడుగురు కోవిడ్ బాధితులు మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో 560 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 2,92,92,896 కు చేరుకోగా… మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,63,872 కు పెరిగింది.. ఇక, 20,44,692…
బద్వేల్ వైసీపీ ఎమ్మెల్యే మరణంతో ఏపీలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ స్థానంలో వైసీపీ తరుఫున దివంగత బద్వేల్ మాజీ ఎమ్మెల్యే సతీమణి బరిలో ఉన్నారు. బద్వేల్ నియోజకవర్గం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో ఉండటంతో ఇక్కడ వైసీపీకి గెలుపు నల్లేరు మీద నడకే అన్న చందంగా మారింది. ఓటమిని ముందుగానే గుర్తించిన టీడీపీ, జనసేన పార్టీలు ముందుగానే ఇక్కడ పోటీ నుంచి తప్పుకున్నాయి. అనుహ్యంగా బీజేపీ, కాంగ్రెస్ రేసులో నిలువడంతో ఎన్నిక అనివార్యమైంది.…