ఏపీలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలును పర్యవేక్షించే దిశా కమిటీలో తనకు స్థానం కల్పించారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు వెల్లడించారు. దిశా కమిటీలో ‘ప్రముఖ సభ్యుడు’ (ఎమినెంట్ మెంబర్)గా తనను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నియమించిందని, ఈ మేరకు ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. ఈ కమిటీ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో పనిచేస్తుందని జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. రాష్ట్రంలో కేంద్ర పథకాల అమలు సరిగ్గా జరిగే విధంగా తన వంతు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు భార్య భువనేశ్వరిపై అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కొద్దిరోజులుగా టీడీపీ నేతలు ఆరోపిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో నందమూరి కుటుంబంతో పాటు తెలంగాణ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సహా పలువురు ప్రముఖులు చంద్రబాబుకు మద్దతుగా నిలిచారు. మరోవైపు భువనేశ్వరిపై వైసీపీ నేతల అనుచిత వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య దంపతులు గురువారం నాడు నిరసన దీక్ష చేపట్టనున్నారు. Read Also: చంద్రబాబుకు నమస్కారం చేసిన వైసీపీ…
ఆంధ్రప్రదేశ్లో ఏ ఎన్నికలు జరిగినా వార్ వన్ సైడే అంటూ ఇప్పటికే పలు సందర్భాల్లో వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేశారు.. ఇప్పటికే ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు, వాటికి జరిగిన బై పోల్ ఇలా అన్నింటిలోనూ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే పై చేయి.. ఇక, ఎమ్మెల్సీ స్థానాల్లోనూ ఆ పార్టీ హవాయే కొనసాగుతోందని చెప్పాలి.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ పరిశీలన ప్రక్రియ ఇవాళ పూర్తి అయ్యింది.. 11 ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం…
ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరదలు పోటెత్తాయి. ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలలో వరదలు ప్రజా జీవనాన్ని అతలాకుతలం చేశాయి. దీంతో భారీ స్థాయిలో వరద నష్టం వాటిల్లింది. భారీ వర్షాలు, వరదల కారణంగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ప్రస్తుతం వరద కొంచెం తగ్గుముఖం పట్టడంతో అధికారులు వరద నష్టాన్ని అంచనా వేస్తున్నారు. వరదల వల్ల మొత్తం రూ. 6,054 కోట్ల నష్టం వాటిల్లిందని ప్రభుత్వం అంచనా వేసింది. Read Also: ఈ…
అమరావతినే రాజధానిగా కొనసాగించాలని… రైతులు ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ తీసుకున్న.. మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని… ఏపీ రాజధానిగా అమరావతిని మాత్రమే చేయాలన్నది వారి డిమాండ్. అయితే.. రైతుల ఉద్యమానికి… ప్రతి పక్షాలు అన్ని ఇప్పటికే మద్దతు తెలిపాయి. ఇక తాజాగా జనసేన పార్టీ కీలక ప్రకటన చేసింది. ఈ నెల 26వ తేదీన రాజధాని రైతుల పాదయాత్రలో జనసేన ముఖ్య నేతలు పాల్గొననున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటన చేసింది.…
గుంటూరు జిల్లాలో వైసీపీ కార్యకర్తలు రౌడీల తరహాలో రెచ్చిపోయారంటూ టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ తీవ్రంగా మండిపడ్డారు. టీడీపీ కార్యకర్త సైదాను అత్యంత దారుణంగా కొట్టారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు నారా లోకేష్ సోషల్ మీడియా ద్వారా ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఓ వ్యక్తిని రోడ్డు డివైడర్పై పడేసి కొందరు తీవ్రంగా కొట్టడం ఆ వీడియోలో కనిపిస్తోంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అరాచకాలలో ఆఫ్ఘనిస్థాన్ను మించిపోయిందని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.…
ఏపీలో ఇవాళ కరోనా కేసులు కాస్త పెరిగాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 31,987 శాంపిల్స్ పరీక్షించగా.. 264 కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.. ఒకరు కరోనా తో మృతి చెందారు. ఇక, ఇదే సమయంలో 247 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. తాజా టెస్ట్లు కలుపుకుని ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కోవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్య 3,02,55,667కు చేరుకున్నాయి..…
వాహనదారులకు ఏపీ ప్రభుత్వం బ్యాడ్ న్యూస్ అందించింది. బుధవారం సినిమాటోగ్రఫీ బిల్లుతో పాటు వాహన పన్నుల చట్ట సవరణ బిల్లును మంత్రి పేర్ని నాని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ మేరకు కొత్త వాహనాల లైఫ్ ట్యాక్స్, పాత వాహనాల గ్రీన్ ట్యాక్స్ పెంచుతూ చట్ట సవరణ చేశారు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు, అధిక కర్బనాలను విడుదల చేసే వాహనాలను నివారించేందుకు ఈ సవరణ బిల్లును ప్రవేశపెట్టినట్లు మంత్రి పేర్ని నాని వెల్లడించారు. అందుకే గ్రీన్ ట్యాక్స్ పేరిట పన్నులు…
ఏపీలో భారీ వర్షాల కారణంగా టమోటాల ధరలకు రెక్కలు వచ్చాయి. ఇప్పటికే పెట్రోల్ ధరలు వంద దాటిపోగా ఇప్పుడు టమోటాల ధరలు కూడా వంద దాటిపోయాయి. ఆసియాలోనే అతిపెద్ద టమోటా మార్కెట్ అయిన మదనపల్లిలో కిలో టమోటా ధర ఏకంగా రూ. 130 పలుకుతున్నది. వి.కోట మార్కెట్లో 10 కేజీల టమోటాలు రూ.1500 పలుకుతున్నాయి. భారీ వర్షాలు కురవడంతో పంట పాడైపోవడంతో ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. వర్షాలు తగ్గి, వరద ఉధృతి పూర్తిగా తగ్గి మళ్లీ కొత్త…
అన్నమయ్య ప్రాజెక్టును రీ డిజైన్ చేయాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. అన్నమయ్య ప్రాజెక్టు 2.85 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసేలా డిజైన్ చేయాలి, కానీ 2.17 లక్షల క్యూసెక్కులు మాత్రమే విడుదల చేసేలా అప్పుడు డిజైన్ చేశారని సీఎం పేర్కొన్నారు. కాని దురదృష్టవశాత్తూ ఇప్పుడు 3.2 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చిందని… 2017లో అన్నమయ్య ప్రాజెక్టుపై నివేదిక కూడా ఇచ్చారు, ప్రాజెక్టును మెరుగుపరచమన్నారని గుర్తు చేశారు. గత ప్రభుత్వం విధానాల కారణంగా…