ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం. ఇద్దరు సీఎంలతో... కేంద్ర జల శక్తి శాఖ మంత్రి అధ్యక్షతన మీటింగ్ అనగానే... రెండు రాష్ట్రాల్లో ఒకటే ఉత్కంఠ. అందునా.... బనకచర్ల సెంట్రిక్గా...పొలిటికల్ పంచ్లు హాట్ హాట్గా పేలుతున్న వేళ ఆ ప్రాజెక్ట్ విషయంలో కీలక నిర్ణయాలు ఉంటాయా?
అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా సుపరిపాలనలో తొలి ఏడాది కార్యక్రమం నిర్వహిస్తోంది టీడీపీ. నెల రోజుల పాటు ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గంలో పర్యటించాలన్నది ప్రోగ్రామ్ లక్ష్యం.
బొత్స సత్యనారాయణ.. ఉత్తరాంధ్రలో కీలక నేత.. అక్కడ వైసీపీకి పెద్ద దిక్కు. ఉమ్మడి రాష్ట్రంలోను, విడిపోయాక కూడా పవర్ పాలిటిక్స్లో యాక్టివ్గా ఉన్నారాయన. ప్రస్తుతం వైసీపీలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపగలిగిన కొద్దిమంది నేతల్లో ఆయన కూడా ఒకరు.
Rk Roja: చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పై స్థానిక పోలీస్ స్టేషన్ లో మాజీ మంత్రి ఆర్కే రోజా ఫిర్యాదు చేసింది. తనపై అసభ్య పదజాలంతో దూషిస్తూ, అగౌరవంగా మాట్లాడిన ఎమ్మెల్యేపై చట్టపరమైన చర్యలు తీసుకుని శిక్షించాలని కోరింది.
Machilipatnam: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ మంత్రి పేర్ని నాని మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండటంతో.. రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు, శ్రేణులు నిరసనలకు పిలుపునిచ్చారు.
Ambati Rambabu: ఢిల్లీలో పోలవరం, బనకచర్ల ప్రాజెక్టులపై ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చిస్తారని చెప్పారు.. కొన్ని నిర్ణయాలు వస్తాయని అందరూ ఎదురు చూశారు.. ఈ సమావేశంలో అసలు ఏ ధమైన చర్చ జరగలేదు అని వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు.
CM Chandrababu: తెలంగాణ రాష్ట్రంతో గొడప పడే అవసరం లేదని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అలాగే, హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది నేనే.. అమరావతిని కూడా హైదరాబాద్ స్థాయిలో అభివృధ్ధి చేసే బాధ్యత నాది అన్నారు. ఇక, గోదావరి నీళ్లు వాళ్ళు వాడుకుంటారు, మనం వాడుకుంటాం.
గట్టిగా కళ్లు మూసుకుంటే మూడేళ్లలో చంద్రబాబు ఎగిరిపోతాడు అని వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై కూడా సీఎం కౌంటర్ ఇచ్చారు. క్లైమోర్ మైన్సే నన్ను ఏం చేయలేదు.. జగన్ లాంటి వాళ్లు నన్ను ఏం చేయలేరు అని ధీమా వ్యక్తం చేశారు. తిట్లు, శాపనార్ధాలు నాకు తాకవు అని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.