CM Chandrababu: తెలంగాణతో గొడవ పడే అవసరం లేదు.. ఏపీ సీఎం కీలక వ్యాఖ్యలు!
- తెలంగాణతో గొడవ పడే అవసరం లేదు..
- నీళ్ల విషయంలో ఇచ్చిపుచ్చుకునే ధోరణి అవలంభిస్తాం..
- గోదావరి నీళ్లు వాళ్లు వాడుకుంటున్నారు, మనం వాడుకుంటాం: సీఎం చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: తెలంగాణ రాష్ట్రంతో గొడప పడే అవసరం లేదని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అలాగే, హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది నేనే.. అమరావతిని కూడా హైదరాబాద్ స్థాయిలో అభివృధ్ధి చేసే బాధ్యత నాది అన్నారు. ఇక, గోదావరి నీళ్లు వాళ్ళు వాడుకుంటారు, మనం వాడుకుంటాం.. ప్రధాని మోడీ కూడా నదుల అనుసంధానం చేయాలనుకుంటున్నారు అని గుర్తు చేశారు. వేదవతి ప్రాజెక్టు పూర్తి చేస్తాం.. హంద్రీనీవా నీరు చిత్తూరు వరకు వెళ్ళాలి.. ఇపుడు కుప్పం వరకు వెళ్తాయి.. వచ్చే ఏడాది చిత్తూరు వరకు తీసుకువెళ్తామన్నారు. 2021లో పొలవరాన్ని గోదావరిలో ముంచేశారు అని సీఎం చంద్రబాబు ఆరోపించారు.
Read Also: Dasoju Sravan: రాష్ట్రంలో రోజుకు 8 రేప్లు..? ఎమ్మెల్సీ సంచలన ఆరోపణలు..
Also Read
- Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
- Nadendla Manohar: స్థానిక ఎన్నికల్లో కొత్త వ్యూహం.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..
- OTR: పోలవరం క్రెడిట్ రేస్లోకి ఏపీ బీజేపీ.? ముఖ్య నేతలంతా ర్యాలీగా ప్రాజెక్ట్ సైట్కు.!
- OTR: కాపు ఓట్ బ్యాంక్ వైసీపీకి దూరమైందా.? లెక్కలు ఏం చెబుతున్నాయంటే.?
ఇక, ప్రజల ఆలోచనలు, కోరికలు ఎక్కువగా ఉన్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. గల్లా పెట్టె ఖాళీగా ఉంది.. ఇవన్నీ చేయడానికి సమయం కావాలి.. మళ్లీ భూతం వస్తే ఎలా అని భయపడుతున్నారు.. భూతాన్ని భూస్థాపితం చేసే బాధ్యత నాది.. కులం కూడు పెడుతుందా.. మతం ఒక విశ్వాసం అని చెప్పుకొచ్చారు. హిందువులు మల్లీకార్జున స్వామిని, ముస్లింలు ఖురాన్, క్రైస్థవులు యేసును ప్రార్ధిస్తారు అని పేర్కొన్నారు. కొంతమంది రాక్షసులు నా యజ్ఞాన్ని భగ్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అని మండిపడ్డారు. రాష్ట్రం అభివృద్ధి కోసం నేను ఒక్కడే పరిగెత్తితే లాభం లేదు.. మా నాయకులను కూడా పరిగెత్తిస్తున్నాను.. రాయలసీమను కొందరు కేవలం ఓట్ల కోసం వాడుకున్నారు.. ఒక నాయకునికి రాయలసీమ అంటే రక్తం, రాజకీయం.. మరి నాకు రాయలసీమ అంటే నీళ్లు, మీ భవిష్యత్తు అని చంద్రబాబు వెల్లడించారు.
Read Also: Tollywood: పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు.. అంతా గజిబిజి గందరగోళం
అలాగే, రైతులకు శుభవార్త.. కేంద్రం రైతు భరోసా ఇచ్చిన రోజునే మనవాటా అదే రోజున వేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆగస్టు నాటికి అందరు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో పాటు ఆగష్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నాం.. ఆగష్టు 15 నుంచి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 700 సేవలు అందుబాటులోకి తీసుకొస్తాం.. సెల్ ఫోన్ ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ సేవలు అందుబాటులోకి రాననున్నాయి. దీంతో పాటు ఆగస్టు 20లోగా స్కూళ్లకు 16, 500 టీచర్లను పంపే బాధ్యత నాది.. గతంలో ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయలేదు అని చంద్రబాబు నాయుడు తెలియజేశారు.
తాజావార్తలు
-
OTR: గద్వాలలో ప్రోటోకాల్ వార్.. ఎమ్మెల్యే vs కార్పొరేషన్ చైర్పర్సన్!
-
Off The Record: నామినేటెడ్ పదవుల భర్తీ పెండింగ్ లో పడటానికి కారకుడు ఎవరు..?
-
OTR: వరంగల్ ఎయిర్ పోర్ట్ పై కాంగ్రెస్, బీజేపీ క్రెడిట్ వార్..
-
Hormuz Strait Crisis: త్వరలో హార్మూజ్ తెరవకపోతే సంక్షోభమే.. IEA చీఫ్ ఆందోళన
-
PV Sindhu: జపాన్ ఓపెన్లో పీవీ సింధు చరిత్ర.. 16 ఏళ్ల తర్వాత సెమీస్లోకి దూసుకెళ్లిన రెండో భారత మహిళా షట్లర్
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?