మంత్రి బొత్స వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన నిర్మాత శోభు యార్లగడ్డ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో సినిమా టిక్కెట్ రేట్లపై మంత్రి బొత్స ఇచ్చిన వ్యాఖ్యలకు ప్రముఖ నిర్మాత శోభు యార్లగడ్డ కౌంటర్ ఇచ్చారు. ప్రతి వస్తువుకు ఎమ్మార్పీ ఉంటుందని.. అలాగే సినిమా టిక్కెట్లకు కూడా ఎమ్మార్పీ అవసరమని.. ఇష్టం వచ్చినట్లు టిక్కెట్ రేట్లను పెంచుకుంటామంటే ఎలా అని మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలపై నిర్మాత శోభు యార్లగడ్డ స్పందిస్తూ… ఎమ్మార్పీ అనేది ఓ వస్తువు ఉత్పత్తిదారులు నిర్ణయిస్తారని స్పష్టం చేశారు. అంతే తప్ప.. ఎమ్మార్పీ ధరలు ప్రభుత్వం నిర్ణయించదని చురకలు అంటించారు. హీరో నాని చేసిన వ్యాఖ్యలకు తాను పూర్తిగా మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు.
Read Also: సినిమా టిక్కెట్ల ధరలు సరే.. నిత్యావసరాల ధరల పరిస్థితేంటి?: టీడీపీ ఎమ్మెల్యే
Also Read
సినిమా టిక్కెట్ల ద్వారా గరిష్టంగా ట్యాక్స్ లభించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తే… 100 శాతం టిక్కెట్ల అమ్మకాలను కంప్యూటరైజ్డ్ చేయాలని నిర్మాత శోభుయార్లగడ్డ హితవు పలికారు. మార్కెట్ను బట్టి సినిమా టిక్కెట్ ధర నిర్ణయించాలన్నారు. సినిమా టిక్కెట్ల వ్యవహారం నేపథ్యంలో ఏపీలో 50 థియేటర్లు మూతపడ్డాయని శోభు యార్లగడ్డ అన్నారు. దీని ప్రభావం రాబోయే చిత్రాల విడుదలపైనే కాకుండా.. దీర్ఘకాలంలో ఎగ్జిబిటర్ వ్యవస్థపైనా, తెలుగు సినీ పరిశ్రమపైనా తీవ్రస్థాయిలో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కాగా ‘బాహుబలి’ సినిమాకు శోభు యార్లగడ్డ నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
Maximum Retail Price ( MRP) (unless it is an essential commodity) is decided by the producers/manufacturers of packaged goods not the government. Just saying !
— Shobu Yarlagadda (@Shobu_) December 23, 2021
తాజావార్తలు
-
Ravi Teja: ఇరుముడి జోష్లోనూ రవితేజ కొత్త సినిమాపై సస్పెన్స్! అసలేమైంది?
-
Ananthika Sanilkumar: ‘ఎల్లమ్మ’లో హీరోయిన్ ఫిక్స్.. డీఎస్పీకి జోడీ ఎవరో తెలుసా?
-
Cricket Record: 47 ఏళ్లకు అరంగేట్రం.. 51 ఏళ్ల వయసులో ప్రపంచ రికార్డు.. క్రికెట్లో 96 ఏళ్ల రికార్డు బద్దలు..
-
Kangana Ranaut: కంగనా, రామ్దేవ్ వివాదానికి రాఖీతో ముగింపు.. మిఠాయిలతో మళ్లీ అన్నాచెల్లెళ్ల బంధం!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!