ఏపీలో కొత్త జిల్లాలు అమల్లోకి వచ్చాయి. అయితే సంక్షేమ పథకాలు పొందడానికి ఆధార్ కార్డులను అధికారులు ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆధార్ కార్డులో పాత జిల్లా పేర్ల స్థానంలో కొత్త జిల్లా పేర్లను చేర్చే విషయంపై అధీకృత సంస్థతో చర్చిస్తున్నామని ఏపీ సీసీఎల్ఏ కార్యదర్శి బాబు వివరించారు. ఆధార్ కార్డులో చిరునామా మార్పుపై మంగళవారం సమావేశం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఆధార్ కార్డులో మార్పు చేర్పులకు సంబంధించి పలు అంశాలపై సమావేశంలో చర్చించినట్లు పేర్కొన్నారు. మండలం,…
అమరావతిలోని తుళ్లూరు మండలం రాయపూడిలో మంగళవారం సాయంత్రం పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఓ వాహనాన్ని పోలీసులు ఆపారు. అయితే తాను ఎంపీ నందిగం సురేష్ బంధువును అని.. తన వాహనాన్నే ఆపుతారా అంటూ సుధీర్ అనే వ్యక్తి పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. వెంటనే ఎంపీ సురేష్కు అతడు ఫోన్ చేసి విషయం చెప్పాడు. దీంతో వాహన తనిఖీలు చేస్తున్న కానిస్టేబుల్ను తన ఇంటికి వచ్చి కలవాలని ఎంపీ సురేష్ ఆదేశాలు ఆరీ చేశారు.…
ఈనెల 21న ఏపీ సీఎం జగన్ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన షెడ్యూల్ను సీఎంవో కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. తాడేపల్లి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరనున్న సీఎం జగన్ ఉదయం 10:50 గంటలకు బలభద్రపురంలోని గ్రాసిం పరిశ్రమ ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. ఉదయం 11:05 గంటలకు పరిశ్రమ ప్లాంట్కు చేరుకుని 15 నిమిషాలపాటు పరిశ్రమను పరిశీలించనున్నారు. ఉదయం 11:25 గంటలకు పరిశ్రమను ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12:25 గంటలకు తిరిగి హెలిప్యాడ్కు చేరుకుని…
★ నేడు ఏలూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన.. ఆగిరిపల్లి మండలం నెక్కలం గొల్లగూడెంలో పర్యటించనున్న చంద్రబాబు.. అడవినెక్కలం అంబేద్కర్ నగర్ నుంచి నెక్కలం గొల్లగూడెం వరకు పాదయాత్ర.. అనంతరం రచ్చబండ కార్యక్రమం.. ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్న చంద్రబాబు.. గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనం చేయనున్న బాబు ★ నేడు విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ VCICపై కేంద్రం సమీక్ష.. హాజరుకానున్న కేంద్ర పరిశ్రమల శాఖ సహాయమంత్రి సోమ్ ప్రకాష్ ★ తిరుపతి: పుంగనూరు అంజుమన్ షాది మహల్లో…
ఏపీ సీఎం జగన్ మంత్రుల్ని జిల్లాలకు ఇన్ ఛార్జిలుగా నియమించాక.. జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్ల జాబితాను మంగళవారం ప్రకటించింది ఈ మేరకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మంగళవారం మీడియా ముఖంగా వెల్లడించారు. మంత్రులుగా అవకాశం ఇవ్వలేని వారికి జిల్లా అధ్యక్షులుగా నియమించారు. కొందరు మాజీ మంత్రులకు జిల్లా అధ్యక్షుల బాధ్యతలు అప్పగించారు. చోటు కల్పించ లేని ఆశావహులకూ జిల్లా అధ్యక్ష బాధ్యతల అప్పగించడం ద్వారా వారిలోని అసమ్మతిని తగ్గించే ప్రయత్నం చేసింది పార్టీ. 11…
టీడీపీ పార్టీ కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో టీడీపీ అధినేత చంద్రబాబు చిట్ చాట్ చేశారు. జగన్ పాలనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వంపై ఈ స్థాయి ప్రజా వ్యతిరేకత లేదు చరిత్రలో చూడలేదు. ప్రభుత్వాలు విఫలం అవ్వడం వేరు.. పాలనపై ఈ స్థాయి అసంతృప్తి వేరు. టీడీపీ అత్యధిక సీట్లు గెలుచుకున్న 1994లో కూడా అంతకు ముందున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత లేదన్నారు చంద్రబాబు. జగన్ ప్రభుత్వ విధానాలతో ప్రజల జీవన ప్రమాణాలు దారుణంగా దెబ్బతిన్నాయి.…
విశాఖ పర్యటనలో సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. అనకాపల్లి, విశాఖ పార్లమెంట్ అధ్యక్షులను మారుస్తున్నట్లు ఆయన తెలిపారు. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీకి అవకాశం కల్పిస్తున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. ఎయిర్ పోర్టులో నేరుగా ఈ విషయాన్ని అవంతి, ధర్మశ్రీకి జగన్ చెప్పారు. ఇటీవల కేబినెట్లో స్థానం లభిస్తుందని ధర్మశ్రీ, రెండోసారి అవకాశం లభిస్తుందని అవంతి శ్రీనివాస్ భావించారు. కానీ ఆ అవకాశం దక్కకపోవడంతో వారిద్దరి సేవలను విశాఖ, అనకాపల్లి పార్లమెంట్…
ఏపీలో పదో తరగతి పరీక్షలు ఈనెల 27 నుంచి మే 9 వరకు జరగనున్నాయి. ఈ మేరకు పదో తరగతి పరీక్షల హాల్ టిక్కెట్లను సిద్ధం చేశామని ప్రభుత్వ పరీక్షల సంచాలకుడు దేవానందరెడ్డి వెల్లడించారు. హాల్టిక్కెట్లను bse.ap.gov.in వెబ్సైట్లో పెట్టామని.. అన్ని స్కూళ్ల ప్రధానోపాధ్యాయులు వీటిని డౌన్లోడ్ చేసి వాటిపై సంతకాలు చేసి విద్యార్థులకు అందజేయాలని ఆయన కోరారు. విద్యార్థుల ఫోటోలు సరిగ్గా లేకపోతే సరైనవి అంటించి వాటిపై సంతకాలు చేసి ఇవ్వాలన్నారు. ఈ వివరాలను ప్రభుత్వ…
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్పై టీడీపీ ఎమ్మెల్యే, సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ గవర్నర్ ఉత్సవ విగ్రహంలా మారారని ఆరోపించారు. వచ్చిన ప్రతి ఫైలుపై గవర్నర్ గుడ్డిగా సంతకం పెట్టేస్తున్నారని.. ఇది సరికాదని గోరంట్ల బుచ్చయ్య చౌదరి హితవు పలికారు. కాగ్ నివేదికలు గవర్నర్ వద్దకు వెళ్తే.. వాటి గురించి ప్రభుత్వాన్ని ఆయన ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. శ్రీలంక పరిస్థితులు ఏపీలోనూ కనిపిస్తున్నాయని విమర్శించారు. మరోవైపు ఏపీని వైసీపీ…
ఏపీలో మంత్రివర్గంలో శాఖలు మారుస్తారని జరుగుతున్న ప్రచారంపై మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు. మంత్రివర్గంలో శాఖలు మారుస్తారన్న సమాచారం తమకు లేదని వివరణ ఇచ్చారు. తనకు అప్పగించిన మున్సిపల్ శాఖ బాధ్యతలు స్వీకరించినట్లు తెలిపారు. మున్సిపల్ శాఖ అధికారులతో సమీక్షలు కూడా ప్రారంభించామని ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. విద్యాశాఖ మంత్రిగా బొత్స సత్యనారాయణ త్వరలో బాధ్యతలు స్వీకరిస్తారన్నారు. వారి కుటుంబంలో జరుగుతున్న వివాహ పనుల్లో బిజీగా ఉండటం వల్ల కొంత జాప్యం జరిగిందన్నారు. ప్రకాశం జిల్లాలో సీఎం…