ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నా.. అప్పుడే పొత్తులపై చర్చలు మొదలయ్యాయి… జనసేన ఆవిర్భావి దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభ వేదికగా పొత్తులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటన చేయగా.. ఇప్పుడు.. పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఇక, బీజేపీ నేతలు కూడా పలు సందర్భాల్లో పొత్తుల విషయంపై మాట్లాడుతూనే ఉండగా… మరోవైపు.. చరిత్రలో పొత్తులు లేకుండా గెలిచిన చరిత్ర అసలు టీడీపీకి ఉందా? అని…
వరుసగా అన్ని చార్జీలు పెరిగిపోయాయంటూ ప్రభుత్వంపై నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోన్న టీడీపీ… వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాదుడే బాదుడు పేరుతో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.. అయితే, టీడీపీ అధినేత చంద్రబాబు యాత్రపై సెటైర్లు వేశారు మంత్రి సీదిరి అప్పలరాజు.. చంద్రబాబు చేస్తున్న యాత్ర చంద్రబాబుకి బాదుడే బాదుడు యాత్ర అవుతుందన్న ఆయన.. శవాల వద్దకే చంద్రబాబు యాత్ర అని పేరు పెట్టుకోవాలని.. ఎందుకంటే చంద్రబాబు శవ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. Read Also: Nadendla Manohar: ఓట్లు…
ఓట్లు చీలకూడదు.. జగన్ ప్రభుత్వాన్ని ఓడించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సూచించినట్టు తెలిపారు ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్… పవన్ కళ్యాణ్ సభకు వెళ్లొద్దని ప్రభుత్వం చెబుతోందని ఆరోపించిన ఆయన.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే 1,019 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని.. రైతులను ఆదుకుంటూ పర్యటనలు చేస్తున్న పవన్ కల్యాణ్ను రాజకీయ కోణంలో చూస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలు ఉన్నాయని పవన కల్యాణ్ రైతుల కోసం రావడం లేదు.. భరోసా ఇచ్చేందుకు వస్తున్నారన్న…
వైసీపీ సర్కార్కు వ్యతిరేకంగా కొత్త నినాదం అందుకున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. అన్నవరంలో తుని, ప్రత్తిపాడు టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్విట్ జగన్.. సేవ్ ఆంధ్రప్రదేశ్.. ఇదే మన నినాదం అన్నారు.. క్విట్ ఇండియా ఉద్యమం లాగే ఈ ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు. కుటుంబ సభ్యులను కూడా బజారుకి ఈడుస్తున్నారని మండిపడ్డ చంద్రబాబు.. కౌరవ సభను.. గౌరవ సభ చేసిన తర్వాతనే…
అమరావతిని రాజధానిగా చేస్తాం.. విశాఖను అభివృద్ధి చేస్తామంటూ గురువారం రోజు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన విషయం తెలిసిందే.. అయితే, చంద్రబాబు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు… ఇవాళ విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబుకి అమరావతి మీదే ప్రేమ.. విశాఖకు పరిపాలన రాజధాని చంద్రబాబు వద్దంటే.. ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు ఎందుకు మాట్లాడడం లేదు? అంటూ మండిపడ్డారు. విశాఖలో టీడీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేసి.. మళ్లీ ఎన్నికలకు…
ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా భర్త సెల్వమణి ఓ వివాదంలో చిక్కుకున్నారు.. తమిళ సినీ పరిశ్రమలో ఉన్న వ్యక్తిగా తమిళ సినీ పరిశ్రమ తరఫున ఆయన మాట్లాడడం వివాదానికి కారణమైంది.. ఇతర రాష్ట్రాల్లో షూటింగులు జరగడంతో తమిళనాడు ప్రభుత్వానికి రెవెన్యూ తగ్గుతోందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు తమిళ రాజకీయాలతో పాటు ఏపీ రాజకీయాల్లోనూ హాట్ టాపిక్గా మారిపోయాయి… అయితే, సెల్వమణిపై మండిపడుతోంది తెలుగుదేశం పార్టీ.. సెల్వమణి వ్యాఖ్యలపై మంత్రి రోజా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. Read…
ఏపీలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడూస్తూనే ఉంది.. ఓవైపు కార్యక్రమాలతో ప్రజల్లోకి దూసుకెళ్లేందుకు అధికార వైసీపీ ప్రయత్నాలు చేస్తుంటే.. ఇంకో వైపు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. పెరిగిన ధరలపై బాదుడే బాదుడు పేరుతో ఉద్యమం చేస్తోంది తెలుగుదేశం పార్టీ.. ఈ నేపథ్యంలో రెండు పార్టీలకు చెందిన నేతల మధ్య ఆరోపణలు, విమర్శల పర్వం కొనసాగుతూంది.. అయితే, కుళ్లు, కుతంత్రాలతో టీడీపీపై దుష్ప్రచారం చేస్తూ మాట్లాడడం వల్ల జగన్కు, వైసీపీ నేతలకు ఆత్మ సంతృప్తి…
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు.. జిల్లాల పర్యటనలో భాగంగా.. ఇవాళ తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాల్లో పర్యటించనున్నారు.. తూర్పు గోదావరి జిల్లా తాళ్లరేవులో బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొననున్నారు చంద్రబాబు. ఇక, సాయంత్రం తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో ఆయన పర్యటన కొనసాగనుంది.. Read Also: Kedarnath: తెరచుకున్న కేదార్నాథ్.. భక్తుల పులకింత.. చంద్రబాబు పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి.. * అన్నవరంలో ఉదయం 10 గంటలకు తూర్పు గోదావరి జిల్లాకి చెందిన ముఖ్య…
ఆన్లైన్లో సినిమా టికెట్లను విక్రయించేందుకు సిద్ధమైంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అయితే, దీనికి కొన్ని అడ్డంకులు వచ్చాయి.. దీంతో, ఆన్లైన్ టికెటింగ్ విధానం అమలు చేస్తారా? అనే అనుమానాలు కలిగినా.. ఇప్పుడా ఆ సస్పెన్స్ కు తెరపడినట్టు అయ్యింది.. ప్రభుత్వ సినిమా టికెట్ల విధానానికి ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆన్ లైన్ సినిమా టికెట్ల అంశంపై మల్టిప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్…
విద్యాలయాల్లో ర్యాగింగ్ భూతం పంజా విసురుతూనే ఉంది… ర్యాగింగ్పై నిషేధం ఉన్నా.. అక్కడక్కడ జరుగుతోన్న ఘటనలు కలవరపెడుతున్నాయి.. తాజాగా, కర్నూలు ట్రిపుల్ ఐటీలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది.. హాస్టల్ క్యాంపస్లో బీటెక్ ఫస్టియర్ విద్యార్థిని నమస్తే పెట్టలేదని ఫైనల్ ఇయర్ విద్యార్థి దాడి చేశారని ఆరోపణలు చేస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి.. అయితే, క్యాంపస్ లో ఎలాంటి ర్యాగింగ్ జరగలేదని స్పష్టం చేస్తున్నారు ట్రిపుల్ ఐఐటీ అధికారులు.. హాస్టల్ దగ్గర ఓ జూనియర్ విద్యార్థినికి, సీనియర్…