Ganta Srinivas rao: గంటాలో సడెన్ మార్పుకు కారణం అదేనా?
పార్టీ ఏదైనా.. నియోజకవర్గం ఏదైనా.. గెలుపుపై గ్యారంటీ ఉన్న రాజకీయ నేత ఎవరైనా ఉన్నారా అంటే అది గంటా శ్రీనివాసరావు మాత్రమే. ఎన్నికల్లో ఆయన ఏ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసినా.. ఏ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసినా గెలుపు సొంతం చేసుకుంటారు. వైసీపీ ప్రభంజనం సృష్టించిన 2019 ఎన్నికల్లోనూ టీడీపీ తరఫున విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన గంటా శ్రీనివాసరావు విజయం సాధించారు. అయితే 2019 ఎన్నికల తర్వాత గంటా సైలెంట్ అయ్యారు. పార్టీ మారాలని ప్రయత్నాలు చేసినా వర్కవుట్ కాలేదు. చివరకు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినా స్పీకర్ ఆమోదించలేదు.
అప్పటి నుంచి గంటా శ్రీనివాసరావు టీడీపీలో కొనసాగుతున్నా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. అసెంబ్లీ వేదికగా చంద్రబాబు తనపై, తన భార్య పైనా వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారని కన్నీరు పెట్టిన సందర్భంలో పార్టీకి సంబంధం లేని వారు సైతం స్పందించారు. కానీ గంటా మాత్రం ఎక్కడా తన వాయిస్ వినిపించలేదు. దీంతో ఆయన వచ్చే ఎన్నికల్లో పార్టీ మారతారన్న ఊహాగానాలు కూడా వచ్చాయి. కొత్త పార్టీ పెడతారనే ప్రచారం కూడా జరిగింది. తాజాగా ఆ ప్రచారానికి బ్రేక్ పడింది. ఉన్నట్టుండి టీడీపీ అధినేత చంద్రబాబుపై పొగడ్తల వర్షం కురిపించారు. ఏపీ మళ్లీ బాగుపడాలంటే చంద్రబాబు సీఎం కావాలని గంటా ఆకాంక్షించారు.
Also Read
- Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
- Governor Abdul Nazeer: ఏపీ గవర్నర్కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..
- CM Chandrababu: ఎన్టీఆర్ జిల్లా ప్రజా ప్రతినిధులతో చంద్రబాబు ప్రత్యేక భేటీ.. సమన్వయంతో పని చేయండి.. ఆత్మ విమర్శ అవసరం..
- Tirumala Adulterated Ghee Case: తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం.. ముగిసిన ఏక సభ్య కమిషన్ విచారణ..
Ganta Srinivasa Rao: ఏపీ బాగుండాలంటే చంద్రబాబు మళ్లీ సీఎం కావాలి
అయితే గంటాలో సడెన్ మార్పుకు కారణం ఇటీవల చంద్రబాబు చేసిన ప్రకటనే కారణమని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. పార్టీ కోసం పనిచేసే వారికి మాత్రమే టికెట్లు ఇస్తామని.. పార్టీకి కష్టకాలంలో అండదండలు అందించిన వారికే ప్రాధాన్యం ఇస్తామని చంద్రబాబు ప్రకటించడంతో గంటా శ్రీనివాసరావు మేల్కొన్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం వైసీపీ గేట్లు మూసుకుపోవడంతో బీజేపీ, జనసేన లాంటి పార్టీల్లో చేరటం కంటే.. టీడీపీలోనే కొనసాగి తన ప్రాధాన్యం పెంచుకోవడం బెటరని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
తాజావార్తలు
-
Kalvakuntla Kavitha: గుంట నక్కల మధ్య బందీ అయిన మనిషి కేసీఆర్.. కవిత సంచలన వ్యాఖ్యలు
-
Cancer Awareness: మీ శరీరంలో ఈ లక్షణాలు ఉన్నాయా? అయితే అది క్యాన్సర్ కావచ్చు.. చెక్ చేసుకోండి!
-
Darling Re-Release: బాక్సాఫీస్ వద్ద ‘డార్లింగ్’ సరికొత్త రికార్డు!
-
Kavitha New Party Launch: కవిత కొత్త పార్టీ పేరు ప్రకటన.. బీఆర్ఎస్కు బిగ్ షాక్..
-
Nithiin : నితిన్ సరసన ‘మిరాయ్’ బ్యూటీ..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!