Deputy CM Narayana Swamy: అది రైతుల యాత్ర కాదు.. కోటీశ్వరుల యాత్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Narayana Swamy: టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి తీవ్ర విమర్శలు చేశారు. కుప్పంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇప్పటివరకు 40వేల దొంగ ఓట్లతోనే చంద్రబాబు కుప్పంలో గెలుస్తూ వచ్చాడని ఆరోపించారు. బీసీల ఓట్లతో కుప్పంలో గెలిచి చంద్రబాబు వారికి చేసిందేమీ లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో వైసీపీ జెండా ఎగరాలని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి పిలుపునిచ్చారు. కుప్పం ప్రజలు నాన్ లోకల్ అయిన చంద్రబాబును ఈ దఫా ఓడించి లోకల్గా ఉంటున్న భరత్ను గెలిపించాలని వ్యాఖ్యానించారు. భరత్ గెలిస్తే వైసీపీ ప్రభుత్వంలో మంత్రి పదవి వస్తుందని నారాయణస్వామి తెలిపారు.
Read Also:Palmoil Farmers Meet Tummala: ఏలూరు జిల్లాలో పామాయిల్ రైతుల కష్టాలు
Also Read
- Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
- Off The Record : సర్వేపల్లి సవాల్: అక్కడ డ్యూటీ చేయాలంటేనే అధికారుల గుండెల్లో వణుకు!
- Off The Record : కూటమిలో చిచ్చు.. విజయవాడ సీట్ల పంచాయతీ తేలేదెప్పుడు?
- AP Weather: ఏపీలో విభిన్న వాతావరణం.. ఒకవైపు వడగాల్పులు.. మరోవైపు వర్ష సూచన.!
జగన్ పాలనలో కుప్పం ప్రజలు మేల్కొన్నారని.. అందుకే మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి పట్టం కట్టారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి వ్యాఖ్యానించారు. ఈనెల 22న సీఎం జగన్ కుప్పంలో పర్యటించనున్నారని.. ఆయన పర్యటనను ప్రజలందరూ జయప్రదం చేయాలని కోరారు. కుప్పంలో సీఎం జగన్ చేతుల మీదుగా వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం ప్రారంభం అవుతుందన్నారు. అంతేకాకుండా కుప్పం మున్సిపాలిటీలో రూ.66 కోట్లతో అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నట్లు నారాయణస్వామి తెలిపారు. ఈ మేరకు సీఎం జగన్ పర్యటన ఏర్పాట్లను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. హెలిప్యాడ్, బహిరంగ సభ స్థలాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అటు అమరావతి ప్రాంత వాసులు చేపట్టిన మహా పాదయాత్రపై డిప్యూటీ సీఎం నారాయణస్వామి విమర్శలు చేశారు. అది రైతుల పాదయాత్ర కాదని.. కోటీశ్వరుల యాత్ర అని ఎద్దేవా చేశారు.
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!