Byreddy Rajasekhar Reddy: సీమ సమస్యలు పరిష్కరించండి.. రాయలసీమ సమస్యలు పరిష్కరించకుంటే ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కావాల్సిందేనని స్పష్టం చేశారు బైరెడ్డి రాజశేఖర్రెడ్డి… రాయలసీమకు జరుగుతోన్న అన్యాయంపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. కర్ణాటక అప్పర్ భద్ర ప్రాజెక్టు రాయలసీమకు మరణ శాసనమే అని ఆందోళన వ్యక్తం చేశారు.. అప్పర్ భద్ర ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు ఎందుకు అడ్డుకోరు..? అని ప్రశ్నించారు.. అప్పర్ భద్ర ప్రాజెక్టు కర్ణాటకలో బళ్లారి, రాయచూరు, కొప్పల జిల్లాలకూ నష్టమే అన్నారు..…
CBI Summons YS Bhaskar Reddy: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వైఎస్ వివేకా హత్య కేసు బదిలీ అయిన తర్వాత.. దూకుడు పెంచిన సీబీఐ.. వరుసగా నిందితులను నోటీసులు జారీ చేస్తూ.. విచారణ జరుపుతోంది.. ఇక, ఈ కేసులో తాజాగా వైఎస్ భాస్కర్ రెడ్డికి నోటీసులు పంపింది సీబీఐ.. రేపు అనగా.. శనివారం…
Adimulapu Suresh: వచ్చే ఎన్నికల్లో పోటీపై.. పొత్తులపై ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే చర్చ హాట్ హాట్గా సాగుతోంది.. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వెళ్తాయా? లేక టీడీపీ, జనసేన మైత్రితో ముందుకు వెళ్తాయా? లెఫ్ట్ పార్టీలు ఎటువైపు.. అనే చర్చ సాగుతోంది.. అయితే, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం.. మరోసారి సింగిల్గానే బరిలోకి దిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.. సింహం సింగిల్ గానే వస్తుంది.. వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది అని వ్యాఖ్యానించారు మంత్రి ఆదిమూలపు సురేష్..…
జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ.. నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర తిరుపతి నియోజకవర్గంలో కొనసాగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు లోకేష్… అభివృద్ధిలో ఏపీ అగ్రస్థానంలో ఉండాలని ఎవరెవరు కోరుకుంటారో వారందరూ రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. రాజకీయాల్లో మొదట కావాల్సింది మంచి మనసు అని, 2014లోనే తాను పవన్ కల్యాణ్ లో మంచి మనసును చూశానని లోకేష్ చెప్పుకొచ్చారు.. కాగా, నారా…
Jr. NTR political Entry: జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై ఎప్పటి నుంచో చర్చ సాగుతూనే ఉంది.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాల్సిందేనంటూ కొందరు వ్యాఖ్యానిస్తుంటే.. మరికొందరు మాత్రం.. ఈ పరిణామం ఇష్టం లేదు అనేలా వ్యవహరిస్తూ వస్తున్నారు.. అయితే, విపక్షం మాత్రం.. నారా లోకేష్ రాజకీయ భవిష్యత్ కోసమే.. ఉద్దేశ్యపూర్వకంగా ఎన్టీఆర్ను చంద్రబాబు పక్కన పెడుతున్నారనే విమర్శలు చేశారు.. చంద్రబాబు అవసరానికి వాడుకొని వదిలేసే రకం అంటూ ఆరోపణలు గుప్పించారు.. కానీ, ఇప్పుడు జూనియర్…
Minister Kottu Satyanarayana: త్వరలో రాష్ట్రంలో 3 వేల చిన్న తరహా దేవాలయాల అభివృద్ధి చేస్తాం.. ఒక్కో దేవాలయ నిర్మాణానికి రూ. 10 లక్షలు మంజూరు చేస్తామని తెలిపారు దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ.. ఆ శాఖ అధికారులతో ఇవాళ సమీక్ష నిర్వహించిన మంత్రి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో వివాదంలో ఉన్న 4,700 ఎకరాలను సంబంధిత దేవస్థానాలకు చెందేలా జీవో తీసుకొస్తున్నాం అని వెల్లడించారు.. డీఐజీ స్థాయి అధికారులతో విజిలెన్స్ సెల్…
Jogi Ramesh: టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్పై మండిపడ్డారు మంత్రి జోగి రమేష్.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎం వైఎస్ జగన్ని చూస్తేనే నారా లోకేష్ కి ఫ్యాంటు తడిచి పోతుంది.. అలాంటి లోకేష్ చిటికేస్తే ఏదైనా జరుగుతుందని విర్రవీగుతున్నాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇక, మా పథకాలన్నీ ప్రజల దీవెనలు పొందాయి.. అందుకే ధైర్యంగా జనం దగ్గరకు వెళ్తున్నామన్న ఆయన.. మరి మేం ఫెయిల్ అయ్యింది ఎక్కడ? అని ప్రశ్నించారు. 2…
AP Tourism coffee table books: ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ రూపొందించిన ఏపీ టూరిజం కాఫీ టేబుల్ బుక్స్ను ఆవిష్కరించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. మార్చి 3, 4 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 నేపథ్యంలో ఏపీ టూరిజం, హ్యండీక్రాఫ్ట్స్, టెంపుల్స్, బీచ్లు, సోల్స్ స్పేస్, ఏ టూ జెడ్ టేబుల్ గైడ్ పై ప్రత్యేక పుస్తకాలను ప్రచురించింది ఏపీ ప్రభుత్వం.. ఇంగ్లీష్, జర్మన్, స్పానిష్, చైనీస్ బాషల్లో ఈ పుస్తకాలను…