Four Sisters Get Government Jobs: ఆ తల్లికి వందనం.. నలుగురు కూతుళ్లు ప్రభుత్వ ఉద్యోగులే..
- నలుగురు కూతుళ్లను ప్రభుత్వ ఉద్యోగులను చేసి ఓ తల్లి..
- కట్టుకున్నవాడు కన్నుమూసినా.. కూతుళ్ల కోసం ఒంటరి పోరాటం..
- తల్లి కష్టంలో పాలుపంచుకుంటూనే ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన కూతుళ్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Four Sisters Get Government Jobs: కూతురు పుట్టిందంటే చాలు.. కుంపటిగా భావించే రోజులు.. అంతేకాదు.. పదో తరగతికి వచ్చిందంటే.. పెళ్లి చేసి బరువు దించుకోవాలని చూసేవాళ్లు ఉన్నారు.. ఇంకా కొందరైతే.. ఇంటరో.. లేదా డిగ్రీ వరకు చదించి.. ఇక చాలమ్మ.. చదివింది అంటారు.. కానీ, ఆంధ్రప్రదేశ్లో ఓ తల్లి అందరికీ ఆదర్శంగా నిలిచారు.. తమకు కున్న నలుగురు కూతుళ్లను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దదారు.. చేసేది వ్యవసాయమే.. కష్టపడి నలుగురిని చదివించారు.. ఇక, వారి కష్టాన్ని ఏ మాత్రం వమ్ము చేయకుండా.. ఆ నలుగురు పిల్లలు ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించి సగర్వంగా నిలిచారు.. దీంతో, ఆ తల్లి ఆనందానికి అవదలు లేకుండా పోయాయి..
Also Read
- CM Chandrababu: కుప్పంలో పారిశ్రామిక విప్లవానికి శ్రీకారం.. రూ.9,322 కోట్ల పెట్టుబడులతో 27 పరిశ్రమలు.!
- CM Chandrababu Kuppam Tour: కుప్పంలో సీఎం బిజీ షెడ్యూల్.. 23 వేల ఉద్యోగాల లక్ష్యంగా భారీ పరిశ్రమలకు శ్రీకారం
- Narayanaswamy: నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు.. ప్రజల విశ్వాసం పొందాలంటే సీబీఐ విచారణే మార్గం..!
- MLA Thomas: నన్ను గెలకొద్దు.. గెలికితే ఏ రాత్రో హార్ట్ ఎటాక్ వచ్చి పోతావ్.. మాజీ డిప్యూటీ సీఎంపై తీవ్ర వ్యాఖ్యలు
చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం వేపమాకులపల్లెకు చెందిన సీతప్పగారి మునివెంకటప్ప, గౌరమ్మ దపంతులకు నలుగురు కుమార్తెలు.. వీరిది సాధారణ వ్యవసాయ కుటుంబమే అయినా.. అందరు తల్లిదండ్రుల ఆలోచన కంటే భిన్నంగా.. వారి చదువులకే ప్రాధాన్యత ఇచ్చారు.. పెట్టుబడులైనా దక్కని వ్యవసాయన్నే నమ్ముకున్న ఆ దంపతులు.. రాజీ పడకుండా పిల్లల్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలనుకున్నారు.. కానీ, విధి విచిత్రమైనది.. 2007లో మునివెంకటప్పను తీసుకొల్లింది.. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ముని వెంకటప్ప ప్రాణాలు విడిచాడు.. పిల్లలు ఇంకా చిన్నవాళ్లే.. చదువులు కూడా పూర్తి చేయలేదు… దీంతో, దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయింది ఆ తల్లి.. కానీ, పిల్లల చదువుల కోసం మనోధైర్యాన్ని కూడగట్టుకుంది.. ఇక, ఆ తల్లి కష్టాన్ని దగ్గర నుంచి చూసిన నలుగురు కుమార్తెలు. వీణాకుమారి, వాణి, వనజాక్షి, శిరీష.. వీలైనప్పుడు తల్లికి సాయం అందిస్తూనే.. చదువులపై ఫోకస్ పెట్టారు..
Read Also: CM Chandrababu: చంద్రబాబు సీరియస్ వార్నింగ్..! నిజంగానే వారిపై చర్యలు ఉంటాయా..?
మరోవైపు, చదువులు పూర్తి చేసి.. ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు అక్కాచెల్లెళ్లు.. తమ కష్టాలను లెక్కచేయకుండా.. ఓవైపు బ్యాంకు ఉద్యోగాలు, పోలీస్, టీచరు, ఇతర పోటీ పరీక్షలు.. ఇలా ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటూ వచ్చారు.. వారి కష్టం ఫలించి.. అక్కాచెల్లెళ్లలో పెద్దదైన వీణాకుమారి 2014లో కానిస్టేబుల్ ఉద్యోగం సాధించగా.. 2016 డీఎస్సీలో రెండో కూతురు వాణి ఎస్జీటీగా ఉద్యోగం పొందింది.. రెండేళ్ల వ్యవధిలో ఇద్దరు కూతుళ్లు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంతో ఆ తల్లి మనస్సు కొంత వరకు కుదుటపడింది.. ఏ ఉద్యోగంలో ఉన్న కూతుళ్లకు.. ఆ ఉద్యోగంలోనే ఉన్న అబ్బాయిలతో పెళ్లిళ్లు చేసింది.. మిగతా ఇద్దరు కూతుళ్లు కూడా ఆ తల్లి కలలను నిజం చేస్తూ.. ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టారు.. గత నెలలో విడుదలైన పోలీస్ ఉద్యోగాల ఫలితాల్లో మూడో కూతురు వనజాక్షి కానిస్టేబుల్గా, తాజాగా వెలువడిన ఏపీ మెగా డీఎస్సీ ఫలితాల్లో నాల్గో కూతురు శిరీష సెకండరీ గ్రేడ్ టీచరుగా ఎంపికయ్యారు. దీంతో.. ఆ తల్లి ఆనందానికి అవదులు లేకుండా పోయాయి.. ఓ వైపు కట్టుకున్నవాడు కన్నుమూసినా.. పట్టువదలకుండా.. పిల్లలను చదివించి.. అందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చి దిద్ది అందరికీ ఆదర్శంగా నిలిచింది గౌరమ్మ.. అంతేకాదు.. ఆడ బిడ్డలకు కూడా ఆ నలుగురు కూతుళ్లు ఆదర్శంగా నిలిచారని చెప్పాలి…
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!