విశాఖలో డ్రగ్స్ చాపకింద నీరులా పాకుతుంది. అయితే, తాజాగా విశాఖపట్నంలో మరోసారి మత్తు ఇంజక్షన్లు కలకలం రేపాయి. వారం రోజులు గడవక ముందే అదే ప్రాంతంలో ఏడు వేల మత్తు ఇంజెక్షన్లు పట్టుబడ్డాయి. గంజాయి మత్తు ఇంజక్షన్లకు కేంద్రంగా మారుతోంది.
Anil Kumar Yadav: సోషల్ మీడియా ప్రభావం పెరిగిన తర్వాత వైరల్ ఏదో.. రియల్ ఏదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.. తాజాగా, మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్పై కూడా రకరకాల కథనాలు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి.. దీనిపై ఘాటుగా స్పందించారు అనిల్.. సోషల్ మీడియాలోని ఓ వార్తా సంస్థ పేరుతో వచ్చిన అసత్య వార్తపై ధ్వజమెత్తిన మాజీ మంత్రి.. ఎవరో కొంతమంది ఫేక్ గాళ్ళు.. ఫేక్ వార్తలతో అసత్య ప్రచారాలకు దిగినంత…
బీఆర్ఎస్కు బిగ్ రిలీఫ్.. ఈసీ నిర్ణయంతో..! కేంద్ర ఎన్నికల కమిషన్ బీఆర్ఎస్ పార్టీకి బిగ్ రిలీఫ్ ఇచ్చే న్యూస్ చెప్పింది.. గతంలో చాలాసార్లు బీఆర్ఎస్ను కొన్ని గుర్తులు దెబ్బకొట్టాయి.. కారును పోలిన గుర్తులు బ్యాలెట్లో ఉండడంతో.. చెప్పుకోదగిన స్థాయిలో వాటికి ఓట్లు వచ్చాయి.. అదే సమయంలో బీఆర్ఎస్కు తగ్గిపోయాయి.. దాని మూలంగానే కొన్ని నియోజకవర్గాల్లో ఫలితాలు తారుమారయ్యాయి.. అయితే, దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తూ వచ్చారు ఆ పార్టీ నేతలు.. ఇన్నాళ్లకు వారికి ఈసీ…
Vishnuvardhan Reddy: మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి బహిరంగ సవాల్ విసిరారు బీజేపీ నేత విష్ణువర్ధన్రెడ్డి.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రేపు గన్నవరం బస్టాండ్ దగ్గరకు వస్తే బహిరంగ చర్చకు సిద్ధం కావాలన్నారు.. ప్రజా చార్జిషీట్పై చర్చకు సిద్ధమా అంటూ చాలెంజ్ చేశారు.. మాజీమంత్రి కొడాలి నాని వచ్చినా.. కట్టకట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు వచ్చినా నేను రెడీ అన్నారు. తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చామని.. కనీసం గుడివాడలోనైన పూర్తయ్యాయని…
Ramakrishna: ఆంధ్రప్రదేశ్లో గత కొంత కాలంగా ఎన్నికల పొత్తులపై హాట్ హాట్గా చర్చ సాగుతోంది.. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వెళ్తాయా? లేదా టీడీపీ, జనసేన మాత్రమే ఎన్నికలు వెళ్తాయా అనే విషయం తెలియాల్సి ఉంది.. ఇక, బీజేపీని దూరంగా పెడితే తాము కూడా పొత్తుకు సై అంటున్నాయి కమ్యూనిస్టు పార్టీలు.. పొత్తులపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన పార్టీలతో మేం కలిసి పనిచేస్తున్నాం.. మేం అందరం కలిసి…
గవర్నమెంట్ స్కూళ్లలోని టెన్త్ చదివి టాపర్లుగా నిలిచిన విద్యార్థులు శుభవార్త చెప్పారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. నియోజకవర్గాల్లోని టాపర్లకూ ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.. గవర్నమెంట్ స్కూళ్లలో టెన్త్లో టాప్ విద్యార్థులకు ప్రోత్సాహకాలు విస్తరించారు.. రాష్ట్ర, జిల్లా స్థాయి టాపర్లకే కాకుండా నియోజకవర్గాల వారీ టాపర్లకు కూడా ప్రోత్సాహకాలు అందించాలని నిర్ణయించారు
MP Margani Bharat: రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్పై కేసు నమోదు చేశారు దెందులూరు పోలీసులు.. దెందులూరు జాతీయ రహదారిపై ఈనెల 12వ తేదీన టూ వీలర్ వాహనాన్ని ఎంపీ భరత్ బంధువుల కారు ఢీకొట్టింది.. ఈ ప్రమాదంలో సింగవృక్షం నరసయ్య అనే వ్యక్తి మృతి చెందాడు.. అయితే, ప్రమాదానికి కారణమైన కారులో ఎంపీ మార్గాని భరత్ ఉన్నారని అనుమానిస్తున్నారు మృతుని బంధువులు.. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు మృతుని కుమారుడు కిరణ్ బాబు.. దీంతో..…
AP Crime: ప్రకాశం జిల్లాలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని దారుణ హత్యకు గురైంది.. వెలిగండ్ల మండలం జిల్లెళ్లపాడు క్రాస్ రోడ్ వద్ద సాఫ్ట్వేర్ ఇంజినీర్ రాధను దారుణంగా హత్య చేశారు గుర్తుతెలియని వ్యక్తులు.. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న రాధ.. ఇటీవలే తన సొంత గ్రామానికి వెళ్లింది.. అయితే, నిన్న సాయంత్రం నుండి కనిపించకుండా పోయింది.. దీంతో.. తెలిసినవారి ఇల్లు, బంధువుల ఇళ్లలో వెతికిన కుటుంబసభ్యులు.. ఎంతకీ ఆచూకీ దొరకకపోవడంతో.. చివరకు పోలీసులను ఆశ్రయించారు.. తమ కూతురు…
Heat Wave Alert: ఎండలు మండిపోతున్నాయి.. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.. ఇదే సమయంలో.. వడగాల్పులు విరుచుకుపడుతున్నాయి.. దీంతో, అత్యవసరం అయితేనే బయటకు రావాలని హెచ్చరిస్తున్నారు వాతావరణ నిపుణులు.. నేడు ఆంధ్రప్రదేశ్లోని మన్యం జిల్లా కొమరాడ, వైఎస్ఆర్ జిల్లా చాపాడు, వీరపనాయునిపల్లె, కమలాపురం, వల్లూరు, ముద్దనూరు, ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు మండల్లాలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని.. మిగిలిన చోట్ల కూడా ఎండ ప్రభావం అధికంగా ఉంటుందని.. ఎండ తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని.. ప్రయాణాల్లో ఉన్నవారు తప్పనిసరిగా జాగ్రత్తలు…