మహాత్మా గాంధీ మార్గంలోనే నడుస్తామని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. నేడు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయన ఘన నివాళులు ఆర్పించారు. ఈ తరుణంలోనే.. మహాత్మా గాంధీ జయంతి శుభాకాంక్షలు ట్విట్టర్ వేదికగా చెప్పారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్తో పాటు ఆంధ్ర ప్రదేశ్ లోఆరు చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. నెల్లూరు నగరంలోని ఉస్మాన్ సాహెబ్ పేటలో ఉన్న జిల్లా పౌరహక్కుల సంఘం నేత ఎల్లంకి వెంకటేశ్వర్లు ఇంట్లో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు ఈరోజు తెల్లవారుజామున నుంచి సోదాలు చేపట్టారు.
ఇప్పుడు అంతా డిజిటైజ్ అయిపోయింది.. తప్పు చేయడం కుదరదు అని రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు తెలిపారు. ఉద్యోగుల సమస్యలు సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరిస్తాం.. ప్రభుత్వానికి ఉన్న మరి కొద్ది కాలంలో చేయగలిగినంత నేను మంత్రిగా చేస్తాను.. నిర్ణయాలు వెంట వెంటనే తీసుకుంటే ఉద్యోగులకు ఎలాంటి కష్టాలుండవు అని ఆయన అన్నారు.
చంద్రబాబు అరెస్ట్ను ఖండించిన తెలంగాణ మంత్రి హరీష్ వ్యాఖ్యలపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అల్లుళ్ళ వల్ల మామలకు గిల్లుళ్ళు తప్పవు అంటూ ఎద్దేవా చేశాడు. తెలంగాణ సీఎం కేసీఆర్ కు హరీశ్ రావు అల్లుడు.. ఎన్టీఆర్ కు చంద్రబాబు అల్లుడు.. మామను చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడు.. హరీశ్ రావు కూడా ఇలాంటి ప్రయత్నమే చేస్తున్నాడు అని ఆరోపించారు.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అవినీతి జరిగింది అనే విషయం అందరికీ తెలిసిందే అని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. అక్రమాలు జరగలేదని ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు టీడీపీ నేతలు హడావిడి చేస్తూన్నారు.. టీడీపీ నేతలు విక్రమ సింహపురి విశ్వవిద్యాలయానికి వెళ్లి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కు వెళ్లి అభాసు పాలయ్యారు
ఏపీలో స్కూల్స్, కాలేజీలకు జగన్ సర్కార్ దసరా సెలవులను ఖరారు చేసింది. ఏపీలో 13 రోజులు సెలవులు ఇచ్చాయి. అక్టోబరు 13వ తారీఖు నుంచి దసరా సెలవులను ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అక్టోబర్ 25 వరకు ఈ సెలవులు ఉంటాయి.
చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ రేపు ( అక్టోబర్ 2 ) నారా భువనేశ్వరి నిరహార దీక్షకు దిగుతున్నారు. ఇక, అదే రోజు జైల్లోనే చంద్రబాబు సైతం నిరాహార దీక్ష చేయనున్నట్లు టీడీపీ నేతలు పేర్కొన్నారు.