Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Cm Ys Jagan Meet Hm Amit Shah In Delhi Over Ap State Issues

CM YS Jagan Meet Amit Shah: ఢిల్లీలో సీఎం జగన్‌ మకాం.. అమిత్‌షాతో గంట పాటు చర్చలు

Published Date :October 6, 2023 , 11:06 pm
By Sudhakar Ravula
CM YS Jagan Meet Amit Shah: ఢిల్లీలో సీఎం జగన్‌ మకాం.. అమిత్‌షాతో గంట పాటు చర్చలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

CM YS Jagan Meet Amit Shah: ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌.. సమావేశాలు.. భేటీలతో బిజీబిజీగా గడుపుతున్నారు.. ఇవాళ్టితో ఆయన పర్యటన ముగియనుండగా.. రేపు తిరిగి రాష్ట్రానికి చేరుకోనున్నారు.. అయితే, హస్తిన పర్యటనలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు సీఎం జగన్‌.. సుమారు గంట పాటు ఇద్దరి మధ్య ముఖాముఖి చర్చలు సాగాయి.. ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులు హీట్‌ పుట్టిస్తున్న తరుణంలో జరిగిన ఈ భేటీకి ప్రధాన్యత ఏర్పడగా.. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను షా దృష్టికి తీసుకెళ్లారు సీఎం జగన్‌..

అమిత్‌షాతో సీఎం జగన్‌ చర్చించిన అంశాలను ఓసారి పరిశీలిస్తే..

Also Read

  • IPL 2026: అనూహ్య రీతిలో మెరిసిన భారత క్రికెట్ భవిష్యత్తు ఆశాకిరణాలు.. బీసీసీఐ దృష్టిలో ఈ 5 గురు..
  • Assam Elections Exit poll 2026: అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్.. కాంగ్రెస్ గల్లంతు..
  • EPFO: ఉద్యోగులకు భారీ శుభవార్త.. ఈపీఎఫ్ఓ నుంచి కీలక అప్‌డేట్.. ఇక సులువుగా..
  • West Bengal Election Exit poll 2026: బెంగాల్‌లో మమత అడ్రస్ గల్లంతు.. కాషాయానిదే గెలుపు..

1. కృష్ణాజలాల అంశంపై అభ్యంతరం వ్యక్తంచేసిన సీఎం జగన్‌.. తదుపరి చర్యలు తీసుకోకుండా నిలిపేయాలని కోరారు..

2. KWDT-II యొక్క నిర్ణయాన్ని సవాల్‌చేస్తూ సుప్రీంకోర్టులో 5 SLPలు ఇప్పటికే పెండింగ్‌లో ఉన్నాయని హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం. గతంలో ఇదే అంశంపై రెండు సార్లు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లానని వివరించారు.. 17.08.2021న, తర్వాత 25-06-2022న తీసుకురావడం జరిగిందని పేర్కొన్నారు.

3. KWDT-IIకి విధివిధానాలు (ToR) జారీకి 4.10.2023న కేంద్ర మంత్రివర్గం ఆమోదం ఏపీ ప్రజల ప్రయోజనాలకు విఘాతం కలిగే అవకాశం ఉందని అభ్యంతరం వ్యక్తంచేసిన సీఎం. విధివిధానాలను బేసిన్‌లోని కర్ణాటక, మహారాష్ట్రలకు కాకుండా కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు పరిమితం చేయడం అశాస్త్రీయమన్న సీఎం. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని, తదుపరి చర్యలు తీసుకోకుండా సంబంధిత వ్యక్తులను ఆదేశించవలసిందిగా విజ్ఞప్తి చేశారు సీఎం జగన్‌.

4. పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదలపై అమిత్‌షాతో చర్చించారు సీఎం జగన్‌.. ప్రాజెక్టు పూర్తి నిర్మాణం వ్యయంపై తాజా అంచనాలకు ఆమోదం తెలపాల్సి ఉందని, దీనిపై ప్రత్యేక దృష్టిసారించాలని అభ్యర్థించారు.. 2017-18 ధరల సూచీ ప్రకారం పోలవరం ప్రాజెక్టు వ్యయం 55,548.87 కోట్లుగా ఇప్పటికే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు.. 5. పోలవరం ప్రాజెక్టు పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు డబ్బు విడుదలచేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన గతంలో పలుమార్లుచేసిన విజ్క్షప్తి మేరకు రూ.12,911.15 కోట్ల విడుదలకు ఆమోదం లభించిందని, అయితే దీన్ని పునఃపరిశీలించి తాజాగా అంచనాలను రూపొందించామన్న సీఎం. లైడార్‌ సర్వేప్రకారం అదనంగా 36 ఆవాసాల్లో ముంపు కుటుంబాలను రక్షిత ప్రాంతాలకు తరలించాల్సి ఉందని, పోలవరం తొలిదశను పూర్తిచేయడానికి ఇంకా రూ.17,144.06 కోట్లు అవసరమవుతాయని ఆమేరకు నిధులు విడుదలచేయాలని అభ్యర్థించారు. 6. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంకోసం రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులనుంచి ఖర్చుచేసిన రూ.1,355 కోట్లను రీయింబర్స్‌ చేయాలని కూడా కేంద్ర హోంశాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amit Shah
  • Andhra Pradesh
  • AP State Issues
  • CM YS Jagan
  • Delhi

తాజావార్తలు

  • Anand Deverakonda: ఈ కథ చెప్పినప్పుడు.. నా కథ నాకే చెప్పాడా అనిపించింది!

  • IPL 2026: అనూహ్య రీతిలో మెరిసిన భారత క్రికెట్ భవిష్యత్తు ఆశాకిరణాలు.. బీసీసీఐ దృష్టిలో ఈ 5 గురు..

  • Assam Elections Exit poll 2026: అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్.. కాంగ్రెస్ గల్లంతు..

  • EPFO: ఉద్యోగులకు భారీ శుభవార్త.. ఈపీఎఫ్ఓ నుంచి కీలక అప్‌డేట్.. ఇక సులువుగా..

  • West Bengal Election Exit poll 2026: బెంగాల్‌లో మమత అడ్రస్ గల్లంతు.. కాషాయానిదే గెలుపు..

ట్రెండింగ్‌

  • Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?

  • Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్‌లో బంధువులు!

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions