AP High Court: వైసీపీ నేత శ్రీహరి కేసులో చట్టప్రకారం నడుచుకోవాలి.. పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP High Court: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి (మీడియా) పూడి శ్రీహరి కేసులో కీలక ఆదేశాలు జారీ చేసింది. సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో నమోదైన కేసులపై విచారణ జరుపుతున్న సందర్భంగా, శ్రీహరి విషయంలో చట్టప్రకారం నడుచుకోవాలని గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులను హైకోర్టు స్పష్టంగా ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ యడవల్లి లక్ష్మణరావు శుక్రవారం ఉత్తర్వులు వెలువరించారు. బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 35(3) ప్రకారం శ్రీహరికి నోటీసులు జారీ చేసి, ఆయన నుంచి వివరణ తీసుకోవాలని పోలీసులకు సూచించారు. ఇప్పటికే శ్రీహరిని మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచిన నేపథ్యంలో, తదుపరి చర్యలు కూడా చట్టబద్ధంగా ఉండాలని కోర్టు పేర్కొంది.
ఇక, ఈ కేసుకు సంబంధించి విచారణను మే 5వ తేదీకి వాయిదా వేసింది. గుంటూరు, కొత్తపేట పోలీస్ స్టేషన్లలో నమోదు చేసిన కేసులపై కూడా కోర్టు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. తనపై నల్లపాడు, కొత్తపేట పోలీస్ స్టేషన్లలో నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ శ్రీహరి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. కుప్పం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో కూడా సెక్షన్ 35(3) ప్రకారం నడుచుకోవాలని అక్కడి కోర్టు ఇప్పటికే ఆదేశించిందని ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
Also Read
- CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
- Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
- Dokka Seethamma Mid-Day Meal : స్మార్ట్ కిచెన్స్పై క్లారిటీ.. వంట కార్మికులకు గుడ్ న్యూస్.!
- CM Chandrababu : చిన్నారులే భవిష్యత్ సంపద.. ఉమ్మడి కుటుంబాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
అదేవిధంగా, కుప్పం కేసులో బయటకు వచ్చిన వెంటనే కొత్తపేట పోలీసులు శ్రీహరిని మళ్లీ అరెస్ట్ చేశారని న్యాయవాది తెలిపారు. శ్రీహరిపై నమోదు చేసిన సెక్షన్లు ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడే నేరాలకు సంబంధించినవని కూడా కోర్టుకు వివరించారు. ఇక పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ, పిటిషనర్ దర్యాప్తుకు సహకరించడం లేదని కోర్టుకు తెలిపారు. ఇరువైపుల వాదనలు విన్న అనంతరం, శ్రీహరి విషయంలో చట్టపరమైన విధానాలను కచ్చితంగా అనుసరించాలని హైకోర్టు నల్లపాడు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు తదుపరి పరిణామాలు మే 5న జరగనున్న విచారణలో స్పష్టతకు వచ్చే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
RaviTeja : మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్
-
Suriya : కరుప్పు బ్లాక్ బస్టర్ జోష్..నెక్ట్స్ సినిమాలో పాట పడబోతున్న సూర్య
-
Mustard Oil Ban in US: భారత్లో హెల్దీ.. అమెరికాలో నిషేధం.. ఆవ నూనెపై నిజాలు ఇవే..!
-
Harshad Chopra: 43 ఏళ్ల వయసులోనూ ఎందుకు పెళ్లి చేసుకోలేదు?.. ప్రముఖ టీవీ నటుడు ఎమోషనల్ కామెంట్స్
-
Team India: టీమిండియాకు ఒక్క పరుగు షాక్.. ఇదేం మొదటిసారి కాదు!
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!