ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో 11 మంది ఐపీఎస్ అధికారులకు పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక, 2006 బ్యాచ్కు చెందిన డీఐజీలకు ఐజీలుగా ప్రమోషన్ ఇస్తున్నట్లు ప్రకటించింది. కొల్లి రఘురామరెడ్డి, సర్వోశ్రేష్ట త్రిపాఠి, అశోక్ కుమార్, విజయ్ కుమార్, హరికృష్ణ, ఎం. రవి ప్రకాష్, రాజశేఖర్, కేవీ మోహన్రావు, రామకృష్ణకు ఐజీలుగా పదోన్నతి కల్పిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. లిక్కర్ అమ్మకాల వివరాలను ఆన్ లైన్ లో నుంచి తప్పించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
2024 ఎలక్షన్ తర్వాత మళ్ళీ పాత పెద్దారెడ్డిని చూస్తారు మళ్ళీ ఫ్యాక్షన్ చేస్తాను అంటూ ఎమ్మెల్యే కేతిరెడ్డి చెప్పారు. కొందరు నాపై సోషల్ మీడియాతో ఏదో మాట్లాడుతున్నాడు వాళ్ళకి 2024 ఎలక్షన్ తర్వాత చూపిస్తా..
గుడివాడలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యేను కలిసేందుకు వచ్చిన అంగన్వాడి వర్కర్స్ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ పోలీసులకు, అంగన్వాడీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కాగా ఎమ్మెల్యే కొడాలని నాని కలిసి తమ సమస్యలను పరిష్కరించాల్సిందిగా వినతి పత్రం ఇచ్చేందుకు బుధవారం అంగన్వాడీ వర్కర్స్ గుడివాడ క్యాంపు కార్యాలయానికి బయలుదేరారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని మధ్య దారిలో ఆపేశారు. Also Read: Karanam Dharmasri: వచ్చే ఎన్నికల్లో సీఎం ఎక్కడి నుంచి పోటీ చేయమన్నా…
ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ.. మార్పుల విషయంలో నాకు ఎటువంటి పిలుపు రాలేదు.. చోడవరం షుగర్ ఫ్యాక్టరీ ప్రారంభం కాబట్టి రైతుల పేమెంట్లు చెల్లింపుల కోసమే సీఎంవోకు వచ్చాను అని ఆయన తెలిపారు.
అమరావతి: ప్రభుత్వ జీఓలను ఆన్లైన్లో అప్లోడ్ చేయకపోవడంపై దాఖలపై పిటిషన్పై బుధవారం ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. పటిషనర్ల వాదన విన్న న్యాయస్థానంలో దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించింది. ఈ మేరకు విచారించిన కోర్టు జీవోలను RTI ద్వారా పొందవచ్చు కదా అని పటిషనర్ తరపు న్యాయవాదిని ప్రశ్నించగా.. జీవోలు విడుదలయినట్లు కూడా తెలియడం లేదని, అటువంటప్పుడు ఆర్టీఐ ద్వారా తీసుకోవడం సాధ్యం కాదని పిటిషనర్ల తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. జి.వోలను ఆన్లైన్లో పెట్టకపోవడం…
ఎన్నికల సమయంలో టికెట్ల కోసం ఆందోళన సహజం అని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. టికెట్ల కోసం డిమాండ్ లేక పోతే ఎత్తిపోయిన పార్టీ అంటారు.. మా ప్రభుత్వం వచ్చాక అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాము.. పార్టీ నేతల్లో ఏమైనా అసంతృప్తి వుంటే పిలిచి మాట్లాడతాం.. ఆ మాత్రం పోటీ, ఆందోళనలు లేకపోతే పార్టీ ఉన్నట్లు ఎలా తెలుస్తుందని ఆయన చెప్పారు.
ద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు మాట్లాడుతూ.. ఇటివల నేను పార్టీ మారుతున్నానంటూ చేస్తున్న ప్రచారంలో నిజం లేదు.. నాపై జరుగుతున్న దుష్ప్రచారంపై జిల్లా లోని పార్టీ పెద్దల దృష్టికి తీసుకు వెళ్ళా.. నన్ను వ్యక్తిగతంగా నా కులాన్ని సైతం దూషించారు.. జిల్లా పార్టీ పెద్దల నుంచి నాకు సరైన మద్దతు లభించకపోవటం నా దురదృష్టం.. ఒక ఎమ్మెల్యే అయి ఉండి సొంత వాళ్లే కించపరిచినా ఎవరూ ఓదార్చలేదు అని ఆయన పేర్కొన్నారు.
జగన్ లాంటి పరిపాలన వ్యవస్థ ఏర్పాటు చేసేవాన్ని వదిలేసి చంద్రబాబు లాంటి దుర్మార్గున్ని తెచ్చుకొని కొరివితో తల గోక్కుంటామా అని ప్రజలే అంటున్నారు.. ప్రశాంత్ కిషోర్ సొంత పార్టీ పెట్టాలని ఆశ ఉంది.. బీజేపీని ఓడించడానికి దేశంలోని నాయకుల అందరిని అనుసంధానం చేశాడు.. అది బెడీసీ కొట్టింది అని మంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శలు గుప్పించారు.