YSR Congress Party: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధితో పని చేస్తున్నారా? అనేది పెద్ద ప్రశ్న అంటూ సోషల్ మీడియా వేదికగా YSR కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో పోలవరం ప్రాజెక్టును ప్రాధాన్యంగా తీసుకున్న సందర్భాలు చాలా తక్కువని, రాష్ట్ర విభజన సందర్భంగా 2014లో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించిందని తెలిపింది. 100% ఖర్చును కేంద్రమే భరించాల్సి ఉందని విభజన చట్టంలో హామీ ఇచ్చింది. ఈ క్రమంలో…
Ambati Rambabu: గుంటూరు స్టాండింగ్ కమిటీ ఎన్నికలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ పాలకవర్గాలను తెలుగుదేశం పార్టీ (టీడీపీ) లాక్కుంటోందని ఆరోపించారు. గుంటూరులో స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ నాయకులు గెలవడంపై స్పందించిన అంబటి రాంబాబు ఈ విజయాన్ని కుట్రలతో సాధించారని విమర్శించారు. గుంటూరులో 57 డివిజన్లలో వైసీపీకి 46 మంది కార్పొరేటర్లు ఉన్నప్పటికీ, టీడీపీ స్టాండింగ్ కమిటీని చేజిక్కించుకుందని ఆయన ఆరోపించారు. ‘మా కార్పొరేటర్లను లాక్కొని, కొందరితో క్రాస్…
AP Elections: తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక అనూహ్య పరిణామాలతో వాయిదా పడింది. సోమవారం ఉదయం 11 గంటలకు షెడ్యూల్ ప్రకారం ఎన్నిక జరగాల్సి ఉన్నప్పటికీ, 50 మంది సభ్యులలో కేవలం 22 మంది మాత్రమే హాజరయ్యారు. ఎన్నికలు నిర్వహించడానికి కనీస కోరం (50%) లేకపోవడంతో ఎన్నికల అధికారి, జేసీ శుభం బన్సల్ ఎన్నికను రేపటికి వాయిదా వేశారు. తిరుపతి రాజకీయాలు గత కొన్ని రోజులుగా తీవ్ర ఉత్కంఠకు గురయ్యాయి. ఆదివారం రాత్రి కొన్ని అనూహ్య పరిణామాలు…
YSRCP: విజయవాడలో ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిని కలిసిన వైసీపీ నేతలు తిరుపతి మున్సిపల్ ఎన్నికలలో టీడీపీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ, తిరుపతిలో ఎన్నికలు జరగకుండా టీడీపీ నేతలు భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ నేతలు ప్రజలను భయపెట్టి, ప్రలోభాలు చూపించి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు. ఎన్నికల సమయంలో పోలీసులు నిర్వాకం వహిస్తున్నారని, టీడీపీ నాయకులు బహిరంగంగా దాడులకు పాల్పడుతుంటే.. పోలీసులేమీ…
ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మంత్రి నారా లోకేష్ ఇంఛార్జి మంత్రులతో సమావేశం నిర్వహించారు. ఏపీలో జరిగే రెండు గ్రాడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీల ఎన్నికల్లో కార్యాచరణపై లోకేష్ మంత్రులతో చర్చించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం దావోస్ పర్యటనపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం పెట్టుబడులు తీసుకురాలేదని కూటమి ప్రభుత్వం అవాస్తవాలు ప్రచారం చేస్తుందని ఆరోపించారు.
ఏపీ సీఎం చంద్రబాబు మూడు రోజుల పర్యటన కోసం దావోస్ బయల్దేరారు. ఈ క్రమంలో.. ముఖ్యమంత్రికి సీఎస్, అధికారులు విషెస్ చెప్పారు. 'సీఎం సర్.. ఆల్ ది బెస్ట్' అంటూ విష్ చేశారు.
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ పై టీడీపీ అధిష్టానం సీరియస్ గా ఉంది. పార్టీ టికెట్ ఇవ్వడంతో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన కొలికపూడి.. తన చర్యలతో పార్టీనే ఇరకాటంలోకి నెడుతున్నారు. గతంలో సీఎం చంద్రబాబు కొలికపూడికి వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.. దీంతో రేపు మరోసారి క్రమశిక్షణా కమిటీ ముందు హాజరుకావాలని టీడీపీ అధిష్టానం ఆదేశించింది.
Balakrishna: సీనియర్ ఎన్టీఆర్ వర్దంతిలో భాగంగా నందమూరి కుటుంబ సభ్యులతో కలిసి ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చారు నందమూరి బాలకృష్ణ. అక్కడ ఆయన నివాళులు అర్పించిన తర్వాత మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నందమూరి తారక రామారావు అనే పేరు తెలుగువారికి కేవలం ఒక వ్యక్తి పేరు కాదు, అది ఒక చరిత్ర అని అన్నారు. నటనలో పరకాయ ప్రవేశం చేసి పాత్రను జీవంగా మలిచిన నటదిగ్గజం ఎన్టీఆర్. ఆయన నటనకు, కృషికి, అంకితభావానికి…
మంత్రి కొలుసు పార్థసారథి వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ వ్యవహార శైలి మార్చుకోవడం లేదని పార్టీలో అందరూ మారుతున్నారని తెలిపారు. సంక్రాంతి కేవలం కూటమి నాయకులకే అని వైసీపీ నేతలంటున్నారు.. సంక్రాంతి ఎవరికో అవగాహన లేకుండా, క్షేత్రస్థాయిలో అంశాలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు.