BJP MP Laxman: ఏపీలో జగన్, షర్మిల.. తెలంగాణలో కేటీఆర్, కవిత సీన్లు ఒక్కటే..!
- తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు రసవత్తరంగా ఉన్నాయి
- రెండు రాష్ట్రాల్లో ఒకేలా సీన్లు రిపీట్ అవుతున్నాయి
- అన్నలు వదిలిన బాణాలు.. అన్నల మీదికే
- ఢిల్లీలో బీజేపీ ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు రసవత్తరంగా మారాయని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. రెండు రాష్ట్రాల్లో ఒకేలా సీన్లు రిపీట్ అవుతున్నాయన్నారు. తండ్రులు సంపాదించిన ఆస్తుల పంపకాల్లో, రాజకీయ పదవుల్లో పంపకాల్లో తేడాలున్నాయని.. అన్నలు వదిలిన బాణాలు.. అన్నల మీదికే చెల్లెలు గురిపేడుతున్నారన్నారు. ఏపీలో జగన్ పై చెల్లి, షర్మిల బాణం ఎక్కు పెడితే, తెలంగాణలో కేటీఆర్ పై కవిత గురి పెట్టిందని విమర్శించారు. తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడాని, ప్రజల అవసరాల కంటే, కుటుంబ అవసరాలే కీలకం అన్నట్లు వ్యవహరిస్తున్నారని తెలిపారు. మొన్న వైఎస్సార్ కుటుంబం.. ఇపుడు కేసీఆర్ కుటుంబం.. అన్నల పైకి చెల్లెలను ఉసి గోల్పడంలో కాంగ్రెస్ కీలకంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ కు వ్యతిరేకత మొదలైందని.. రేవంత్ బీద అరుపులు అరుస్తున్నారని విమర్శించారు. ప్రజలలో ఉన్న వ్యతిరేకతను.. మళ్లించేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.
READ MORE: Sandeep Reddy : ఆ డైరెక్టర్ల బాటలో సందీప్ రెడ్డి..?
Also Read
- Virat Kohli: "నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు".. వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిపడేశాడుగా.!
- Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
- 5 Best Salads for Glowing Skin: సింపుల్గా తయారుచేసే ఈ 5 సలాడ్లు వాడండి.. మీ చర్మం గులాబీ రంగులో మెరిసిపోతుంది..!
- Gig Workers Strike: "పెరిగిన రేట్లకు తగ్గట్టు సర్వీస్ ఛార్జీలు పెంచండి".. మళ్లీ సమ్మె బాట పట్టిన గిగ్ వర్కర్లు..
టీఆర్ఎస్ పుట్టి మునిగిపోయిందని.. దేశంలో బీజేపీ వెలిగిపోతోందని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. “తెలంగాణలో బీజేపీ బలపడింది.. భవిష్యత్ లో అధికారంలోకి కూడా రానుంది. కవిత లేఖ రాసింది వాస్తవమే.. కవిత కేసీఆర్ ను కలిసే పరిస్థితి లేదా? కేసీఆర్ ప్రతిపాదిస్తున్న కేటీఆర్ ను సవాలు చేస్తున్నట్టుగానే కవిత సవాలు అర్థం అవుతోంది. కేటీఆర్ నాయకత్వాన్ని అంగీకరించను అని చెప్పకనే చెపుతోంది. అన్న ఆధిపత్యాన్ని సవాలు చేయడమే లేఖాస్త్రం. కవిత సామాజిక తెలంగాణ గురించి మాట్లాడటం.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగానే ఉంది. భారత దేశం ఆర్ధికంగా అత్యంత బలోపేతంగా నిలుస్తోంది. భారత దేశం 4 వ ఆర్థిక అతిపెద్ద దేశంగా గుర్తింపు పొందింది. భారత్ జపాన్ను అధిగమించింది. మోడీ నాయకత్వానికి తార్కాణం. వికసిత భారత్ కూడా కచ్చితంగా సిద్ధిస్తుంది.” అని వ్యాఖ్యానించారు.
READ MORE: JC Prabhakar Reddy: రాబోయే ఎలక్షన్లలో చాలా పోటీ ఉంటుంది.. ప్రజలే మాకు దేవుళ్లు!
తాజావార్తలు
-
‘DC’ : క్రిమినల్స్ లవ్ స్టోరీతో వస్తున్న లోకేష్ కనగరాజ్..‘DC’ ట్రైలర్ వైరల్
-
Pradeep :తల్లిదండ్రులకు తెలియకుండా పదేళ్ల పోరాటం.. ‘తిమ్మరాజుపల్లి టీవీ’ రాజప్ప రియల్ స్టోరీ ఇదే!
-
Virat Kohli: “నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు”.. వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిపడేశాడుగా.!
-
Green Invicta: గ్రీన్ ఇన్విక్టా ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ.45000 డిస్కౌంట్.. చౌక ధరకే సొంతం చేసుకోండి.. 60KM రేంజ్
-
Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..