Debt Burden on Indian States: భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) వంటి అంతర్జాతీయ సంస్థలు ప్రశంసిస్తున్నాయి. అయితే ఈ వృద్ధి మధ్యలోనే అనేక రాష్ట్రాలు తీవ్రమైన అప్పుల భారంతో కుంగిపోతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన 2025 ఆర్థిక సంవత్సర గణాంకాలు ఈ ఆందోళనకర నిజాలను వెలుగులోకి తీసుకొచ్చాయి. RBI డేటా ప్రకారం, దేశంలోని కొన్ని పెద్ద రాష్ట్రాలు తమ…
YS Jagan: సీఎం చంద్రబాబుపై వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు అవుతోంది.. ఈ కాలంలో ప్రజలకు ఒక్క మంచి పని కూడా జరగలేదని ఆరోపించారు.
TTD Adulteration Ghee Case: ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన కల్తీ నెయ్యి కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ ముగిసింది. ఈ మేరకు అధికారులు నెల్లూరు ఏసీబీ కోర్టులో ఛార్జిషీట్ను దాఖలు చేశారు. సుమారు 15 నెలల పాటు 12 రాష్ట్రాల్లో సాగిన ఈ విచారణతో కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కల్తీ నెయ్యి వ్యవహారం బయటపడిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు విచారణ కోసం సిట్ను నియమించింది. అనంతరం సుప్రీంకోర్టు ఆదేశాల…
CS Vijayanand: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వపరంగా వివిధ ముఖ్య కూడళ్ళు, ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండే ప్రాంతాలు తదితర చోట్ల ఏర్పాటు చేసిన 14వేల సీసీటీవీ కెమెరాలు అన్నీ సక్రమంగా పని చేసేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ అధికారులను ఆదేశించారు.
Vijayawada: విజయవాడ ఇంద్రకిలాద్రి కనకదుర్గమ్మ ఆలయం పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆలయం సమీపంలోని పార్కింగ్ ప్రాంతంలో భక్తులపై పార్కింగ్ కాంట్రాక్ట్ కు చెందిన ఏజెల్ సెక్యూరిటీ సిబ్బంది దాడులకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
Visakhapatnam: విశాఖపట్నం జిల్లాలో భూ కబ్జాదారుల ఆగడాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. పెందుర్తి మండలం చింతగట్ల ప్రాంతంలో ప్రభుత్వ భూమిని ఖాళీ చేయించేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులపై ఆక్రమణదారులు దాడికి యత్నించారు.
Minister BC Janardhan Reddy: రాయలసీమ అభివృద్ధి అంశంపై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఖరిని ఏపీ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. జగన్ రాయలసీమ ప్రజలపై కపట ప్రేమ చూపిస్తున్నారు అంటూ మండిపడ్డారు. గతంలో కర్నూలు పర్యటనకు వచ్చిన జగన్.. కుందూ నదిని వెడల్పు చేస్తానని హామీ ఇచ్చి, ఆ పనులను తన అనుచరులకు కేటాయించుకుని రాజకీయ లబ్ధి పొందారని మంత్రి ఆరోపించారు. అవుకు టన్నెల్ పనులను కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తే..…