Home
Andhra Pradesh News
Andhra Pradesh News News
-
Vijayawada: రౌడీషీటర్ మృతి కేసులో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి వచ్చిన సెల్ఫీ వీడియో
Vijayawada: విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో మరో రౌడీషీటర్ ఆత్మహత్య వ్యవహారం కలకలం రేపుతోంది. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఓ సెల్ఫీ వీడియోలో, రౌడీషీటర్ క్రాంతి కుమార్ తన ఆత్మహత్యకు కృష్ణలంక సీఐ నాగరాజు వేధింపులే కారణమని ఆరోపించినట్లు తెలుస్తోంది. మే 21న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఈ వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. సమాచారం ప్రకారం, క్రాంతి కుమార్ ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పోరిపోగు… -
AP Doctors: విధులకు గైర్హాజరైన 43 మoది డాక్టర్ల డిస్మిస్.. మరో 34 మంది రాజీనామా..
AP Doctors: ప్రభుత్వ వైద్య సేవలకు దూరంగా అనధికారికంగా విధులకు గైర్హాజరీలో ఉన్న 43 మంది వైద్యుల( సివిల్ అసిస్టెంట్ సర్జన్ )పై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కఠిన చర్యలకు ఉపక్రమించింది. గరిష్టంగా నాలుగేళ్ల నుంచి విధులకు రాకుండా ఉన్న వీరికి నిబంధనలు అనుసరించి సంజాయిషీ నోటీసుల జారీతోపాటు అభియోగాలు నమోదు చేసినప్పటికీ స్పందన లభించనందున విధుల నుంచి శాశ్వతంగా తప్పించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఈ… -
Minister Nimmala Ramanaidu: జగన్ పాలనపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర విమర్శలు.. మేనమామనని చెప్పి మోసం చేశారు..!
Minister Nimmala Ramanaidu: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. రాజమండ్రిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికీ ‘తల్లికి వందనం’ పథకం ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నామని మంత్రి తెలిపారు. అయితే, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇద్దరు పిల్లలకు మేనమామనని చెప్పి, ‘అమ్మఒడి’ పథకం… -
YS Jagan: డీఎస్సీ నియామకాలపై జగన్ సంచలన ఆరోపణలు.. సీబీఐ విచారణకు డిమాండ్
YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించిన డీఎస్సీ నియామకాలపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. మెగా డీఎస్సీగా ప్రచారం చేసిన నియామక ప్రక్రియ వాస్తవానికి “మెగా స్కామ్”గా మారిందని ఆరోపిస్తూ, ఈ వ్యవహారంపై స్వతంత్ర సీబీఐ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో స్పందించిన జగన్.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కుట్ర కారణంగా లక్షలాది మంది… -
Minister Narayana: అందువల్లే ఖర్చు ఎక్కువ.. అమరావతి నిర్మాణాలపై మంత్రి నారాయణ వివరణ
Minister Narayana: రాజధాని అమరావతిపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి పొంగూరు నారాయణ.. అమరావతిలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని కొండవీటి వాగు, పాలవాగు పనులను వేగవంతం చేశామని చెప్పారు. రాజధాని ప్రాంతంలో ఎక్కడా వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. అమరావతిలో ప్రస్తుతం 69 వంతెనల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని మంత్రి వెల్లడించారు.. గతంలో కొండవీటి వాగు వెడల్పు చాలా తక్కువగా ఉండేదని, ప్రస్తుతం దానిని… -
Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్లో కలకలం.. 22 మంది అధికారుల సస్పెన్షన్
Vizag Steel Plant: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో నాసిరకం రా మెటీరియల్ వినియోగానికి సంబంధించిన ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్లాంట్లో ఉత్పత్తి నాణ్యత ప్రమాణాలు దెబ్బతినడానికి నాసిరకం ముడి పదార్థాలే ప్రధాన కారణమని ప్రాథమిక అంచనాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో క్వాలిటీ పరీక్షల నిర్వహణలో అధికారులు రాజీపడ్డారనే ఆరోపణలపై యాజమాన్యం కీలక చర్యలు చేపట్టింది. ఒకేసారి 22 మంది అధికారులను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ చర్య స్టీల్ ప్లాంట్ వర్గాల్లో సంచలనంగా మారింది.… -
Off The Record: ఎంపీ అంబికాను లక్కు వెక్కిరిస్తోందా?
Off The Record: కాలం కలిసి రాకపోతే.. తాడే పామవుతుందని అంటారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీ నారాయణకు ఇది బాగా సూటవుతుందని అంటున్నారు. సరిగ్గా…రెండేళ్ళ క్రితం ఇదే కాలం కలిసొచ్చి…. అదృష్టం లాగిపెట్టి తన్నిన తన్నుడు దెబ్బకు డైరెక్ట్గా వెళ్ళి పార్లమెంట్లో పడ్డారాయన. కానీ… అదే లక్కు ఇప్పుడు వెక్కిరిస్తోందట. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పరిస్థితులు ఎంపీ సాబ్ని వెక్కిరిస్తున్నాయన్నది లోకల్ వాయిస్. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే… హిందూపురానికి చెందిన నాయకుడు… -
Minister Vasamsetti Subhash: కార్మికుల కోసం సర్కార్ కీలక నిర్ణయం.. అంతా ఒకే దగ్గర..!
Minister Vasamsetti Subhash: రాష్ట్రంలోని కార్మికుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలతో ప్రత్యేకంగా “లేబర్ అడ్డాలు” ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడించారు. ముఖ్యమంత్రి మానస పుత్రికగా ఈ కార్యక్రమాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఆధునిక సౌకర్యాలతో కార్మికులకు అవసరమైన అన్ని వసతులు కల్పించేలా ఈ లేబర్ అడ్డాలను రూపొందిస్తున్నామని తెలిపారు. మొదటి దశలో పైలెట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలో 25 లేబర్ అడ్డాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి… -
Kesineni Nani vs Kesineni Chinni: కేశినేని బ్రదర్స్ మధ్య మళ్లీ ముదిరిన వార్.. ఎంపీ చిన్నిపై ఈడీకి నాని ఫిర్యాదు
Kesineni Nani vs Kesineni Chinni: విజయవాడ రాజకీయాల్లో కేశినేని సోదరుల మధ్య విభేదాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. మాజీ ఎంపీ కేశినేని నాని తన సోదరుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)తో పాటు ఆయన కుటుంబ సభ్యులు, వ్యాపార భాగస్వాములపై మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కోరుతూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED)కు లేఖ రాశారు. తన ఫిర్యాదులో ఎంపీ చిన్ని, ఆయన భార్య జానకి లక్ష్మి, కుమారుడు వెంకట్… -
CM Chandrababu: విధ్వంసం నుంచి అభివృద్ధి దిశగా.. సంక్షేమం – అభివృద్ధే మా ప్రభుత్వ లక్ష్యం
CM Chandrababu: గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రం తీవ్ర విధ్వంసాన్ని చవిచూసిందని, వేలాది మందిపై అక్రమ కేసులు నమోదు చేశారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. తనపై కూడా అక్రమ కేసు పెట్టి జైలుకు పంపారని, జనసేన అధినేత పవన్ కల్యాణ్ను అడుగడుగునా ఇబ్బందులకు గురి చేశారని పేర్కొన్నారు. అయితే ఆ క్లిష్ట పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ప్రజలకు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల…
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!