Debt Burden on Indian States: అప్పుల ఊబిలో రాష్ట్రాలు.. ఏపీ సహా టాప్ 10 స్టేట్స్ ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Debt Burden on Indian States: భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) వంటి అంతర్జాతీయ సంస్థలు ప్రశంసిస్తున్నాయి. అయితే ఈ వృద్ధి మధ్యలోనే అనేక రాష్ట్రాలు తీవ్రమైన అప్పుల భారంతో కుంగిపోతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన 2025 ఆర్థిక సంవత్సర గణాంకాలు ఈ ఆందోళనకర నిజాలను వెలుగులోకి తీసుకొచ్చాయి. RBI డేటా ప్రకారం, దేశంలోని కొన్ని పెద్ద రాష్ట్రాలు తమ పన్ను మరియు పన్నుయేతర ఆదాయంలో 40 శాతం వరకు కేవలం రుణాలపై వడ్డీ చెల్లింపులకే ఖర్చు చేస్తున్నాయి. దీనివల్ల అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, విద్య వంటి కీలక రంగాలకు సరిపడా నిధులు కేటాయించలేని పరిస్థితి ఏర్పడుతోంది.
Also Read
- AP Government: వడ్డెర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్.. 16 జిల్లాల్లో 32 చోట్ల క్వారీ భూములు.. 50% రాయితీ
- CM Chandrababu: Gen Zపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..
- AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ప్రభుత్వం అలర్ట్! జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు..!
- AP Collectors Conference: కలెక్టర్లకు సీఎం చంద్రబాబు కొత్త టార్గెట్.. గంట ప్రిపరేషన్ కాదు, 2 నిమిషాల్లో క్లియర్ రిపోర్ట్!
అప్పుల భారంతో అత్యధిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న రాష్ట్రాల జాబితాలో పశ్చిమ బెంగాల్ మొదటి స్థానంలో నిలిచింది. 2025 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం సుమారు రూ.1.09 లక్షల కోట్ల ఆదాయం పొందగా, అందులో రూ.45,000 కోట్లకు పైగా వడ్డీ చెల్లింపులకే వెచ్చించాల్సి వచ్చింది. అంటే మొత్తం ఆదాయంలో దాదాపు 42 శాతం వడ్డీకే వెళ్లిపోయింది. ఇక, రెండో స్థానంలో ఉన్న పంజాబ్ తన ఆదాయంలో 34 శాతం వడ్డీ చెల్లింపులకే ఖర్చు చేసింది. రూ.70,000 కోట్ల ఆదాయంలో సుమారు రూ.24,000 కోట్లు వడ్డీగా చెల్లించింది. ఆ తర్వాత బీహార్ మూడో స్థానంలో నిలిచింది. రాష్ట్రం సంపాదించిన రూ.62,000 కోట్ల ఆదాయంలో సుమారు రూ.21,000 కోట్లు వడ్డీ చెల్లింపులకు వెళ్లాయి.. ఇది మొత్తం ఆదాయంలో 33 శాతం.
ఇక, నాలుగో స్థానంలో ఉన్న కేరళ 2025 ఆర్థిక సంవత్సరంలో రూ.1.03 లక్షల కోట్ల ఆదాయం పొందగా, దాదాపు 28 శాతం అంటే సుమారు రూ.29,000 కోట్లు వడ్డీ చెల్లింపులకే ఖర్చు చేసింది. ఆ తర్వాత ఐదో స్థానంలో ఉన్న తమిళనాడు, అధిక పన్ను ఆదాయం ఉన్న రాష్ట్రాల్లో ఒకటైనా, అప్పుల భారంతోనే కొనసాగుతోంది. రాష్ట్రం తన ఆదాయంలో సుమారు 28 శాతం లేదా రూ.62,000 కోట్లు వడ్డీగా చెల్లించింది.
ఆంధ్రప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాలు
టాప్ 10 అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాల జాబితాలో హర్యానా, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ కూడా ఉన్నాయి. హర్యానా తన రూ.94,000 కోట్ల ఆదాయంలో దాదాపు 27 శాతం అంటే.. రూ.25,000 కోట్లు వడ్డీ చెల్లింపులకే ఖర్చు చేసింది. రాజస్థాన్ రూ.1.48 లక్షల కోట్ల ఆదాయంలో సుమారు రూ.38,000 కోట్లు వడ్డీగా చెల్లించి ఏడవ స్థానంలో నిలిచింది. ఇక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా తీవ్ర అప్పుల ఒత్తిడిని ఎదుర్కొంటోంది. 2025 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం సుమారు రూ.1.2 లక్షల కోట్ల ఆదాయం పొందగా, అందులో దాదాపు రూ.29,000 కోట్లు వడ్డీ చెల్లింపులకే వెచ్చించాల్సి వచ్చింది.
మరోవైపు, మధ్యప్రదేశ్ తొమ్మిదో స్థానంలో నిలిచింది. రాష్ట్రం FY2025లో రూ.1.23 ట్రిలియన్ల ఆదాయం పొందగా, అందులో సుమారు రూ.27,000 కోట్లు లేదా 22 శాతం వడ్డీ చెల్లింపులకే వెళ్లాయి. పదో స్థానంలో ఉన్న కర్ణాటక రూ.2.03 ట్రిలియన్ల ఆదాయం పొందినా, దాదాపు 19 శాతం అంటే రూ.39,000 కోట్లు వడ్డీ చెల్లింపులకే ఖర్చు చేసింది అని ఆర్బీఐ గణాంకాలు చెబుతున్నాయి.. అయితే, రాష్ట్రాల ఆదాయంలో ఇంత పెద్ద మొత్తంలో వడ్డీ చెల్లింపులు జరగడం వల్ల కొత్త రహదారులు, పాఠశాలలు, ఆసుపత్రులు, సంక్షేమ పథకాలు వంటి అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల కొరత ఏర్పడుతోంది. ఆర్థిక క్రమశిక్షణ, ఆదాయ వనరుల విస్తరణ మరియు ఖర్చుల నియంత్రణ లేకపోతే ఈ అప్పుల భారం భవిష్యత్తులో మరింత తీవ్రమయ్యే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తాజావార్తలు
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Kiren Rijiju: “ఆ విషయంలో తగ్గేదేలే”.. చైనాకు కిరణ్ రిజిజు స్ట్రాంగ్ వార్నింగ్!
-
BRICS 2026: “ఒకరి విజయానికి మరొకరం సహకరిద్దాం”.. మోడీ-జిన్పింగ్ భేటీకి ముందు చైనా కీలక సందేశం..
-
BMW i7 Facelift: సింగిల్ ఛార్జ్తో 728KM రేంజ్.. BMW i7 Facelift లాంచ్.. 31.3 ఇంచుల 8K థియేటర్ స్క్రీన్!
-
Ravi Teja : ఇరుముడి సూపర్హిట్తో రెమ్యునరేషన్ పెంచేసిన రవితేజ ?
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?