Debt Burden on Indian States: అప్పుల ఊబిలో రాష్ట్రాలు.. ఏపీ సహా టాప్ 10 స్టేట్స్ ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Debt Burden on Indian States: భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) వంటి అంతర్జాతీయ సంస్థలు ప్రశంసిస్తున్నాయి. అయితే ఈ వృద్ధి మధ్యలోనే అనేక రాష్ట్రాలు తీవ్రమైన అప్పుల భారంతో కుంగిపోతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన 2025 ఆర్థిక సంవత్సర గణాంకాలు ఈ ఆందోళనకర నిజాలను వెలుగులోకి తీసుకొచ్చాయి. RBI డేటా ప్రకారం, దేశంలోని కొన్ని పెద్ద రాష్ట్రాలు తమ పన్ను మరియు పన్నుయేతర ఆదాయంలో 40 శాతం వరకు కేవలం రుణాలపై వడ్డీ చెల్లింపులకే ఖర్చు చేస్తున్నాయి. దీనివల్ల అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, విద్య వంటి కీలక రంగాలకు సరిపడా నిధులు కేటాయించలేని పరిస్థితి ఏర్పడుతోంది.
Also Read
అప్పుల భారంతో అత్యధిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న రాష్ట్రాల జాబితాలో పశ్చిమ బెంగాల్ మొదటి స్థానంలో నిలిచింది. 2025 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం సుమారు రూ.1.09 లక్షల కోట్ల ఆదాయం పొందగా, అందులో రూ.45,000 కోట్లకు పైగా వడ్డీ చెల్లింపులకే వెచ్చించాల్సి వచ్చింది. అంటే మొత్తం ఆదాయంలో దాదాపు 42 శాతం వడ్డీకే వెళ్లిపోయింది. ఇక, రెండో స్థానంలో ఉన్న పంజాబ్ తన ఆదాయంలో 34 శాతం వడ్డీ చెల్లింపులకే ఖర్చు చేసింది. రూ.70,000 కోట్ల ఆదాయంలో సుమారు రూ.24,000 కోట్లు వడ్డీగా చెల్లించింది. ఆ తర్వాత బీహార్ మూడో స్థానంలో నిలిచింది. రాష్ట్రం సంపాదించిన రూ.62,000 కోట్ల ఆదాయంలో సుమారు రూ.21,000 కోట్లు వడ్డీ చెల్లింపులకు వెళ్లాయి.. ఇది మొత్తం ఆదాయంలో 33 శాతం.
ఇక, నాలుగో స్థానంలో ఉన్న కేరళ 2025 ఆర్థిక సంవత్సరంలో రూ.1.03 లక్షల కోట్ల ఆదాయం పొందగా, దాదాపు 28 శాతం అంటే సుమారు రూ.29,000 కోట్లు వడ్డీ చెల్లింపులకే ఖర్చు చేసింది. ఆ తర్వాత ఐదో స్థానంలో ఉన్న తమిళనాడు, అధిక పన్ను ఆదాయం ఉన్న రాష్ట్రాల్లో ఒకటైనా, అప్పుల భారంతోనే కొనసాగుతోంది. రాష్ట్రం తన ఆదాయంలో సుమారు 28 శాతం లేదా రూ.62,000 కోట్లు వడ్డీగా చెల్లించింది.
ఆంధ్రప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాలు
టాప్ 10 అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాల జాబితాలో హర్యానా, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ కూడా ఉన్నాయి. హర్యానా తన రూ.94,000 కోట్ల ఆదాయంలో దాదాపు 27 శాతం అంటే.. రూ.25,000 కోట్లు వడ్డీ చెల్లింపులకే ఖర్చు చేసింది. రాజస్థాన్ రూ.1.48 లక్షల కోట్ల ఆదాయంలో సుమారు రూ.38,000 కోట్లు వడ్డీగా చెల్లించి ఏడవ స్థానంలో నిలిచింది. ఇక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా తీవ్ర అప్పుల ఒత్తిడిని ఎదుర్కొంటోంది. 2025 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం సుమారు రూ.1.2 లక్షల కోట్ల ఆదాయం పొందగా, అందులో దాదాపు రూ.29,000 కోట్లు వడ్డీ చెల్లింపులకే వెచ్చించాల్సి వచ్చింది.
మరోవైపు, మధ్యప్రదేశ్ తొమ్మిదో స్థానంలో నిలిచింది. రాష్ట్రం FY2025లో రూ.1.23 ట్రిలియన్ల ఆదాయం పొందగా, అందులో సుమారు రూ.27,000 కోట్లు లేదా 22 శాతం వడ్డీ చెల్లింపులకే వెళ్లాయి. పదో స్థానంలో ఉన్న కర్ణాటక రూ.2.03 ట్రిలియన్ల ఆదాయం పొందినా, దాదాపు 19 శాతం అంటే రూ.39,000 కోట్లు వడ్డీ చెల్లింపులకే ఖర్చు చేసింది అని ఆర్బీఐ గణాంకాలు చెబుతున్నాయి.. అయితే, రాష్ట్రాల ఆదాయంలో ఇంత పెద్ద మొత్తంలో వడ్డీ చెల్లింపులు జరగడం వల్ల కొత్త రహదారులు, పాఠశాలలు, ఆసుపత్రులు, సంక్షేమ పథకాలు వంటి అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల కొరత ఏర్పడుతోంది. ఆర్థిక క్రమశిక్షణ, ఆదాయ వనరుల విస్తరణ మరియు ఖర్చుల నియంత్రణ లేకపోతే ఈ అప్పుల భారం భవిష్యత్తులో మరింత తీవ్రమయ్యే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తాజావార్తలు
-
Keralam: తమిళనాడు పోయి.. కేరళం వచ్చే.. కేసీ వర్సెస్ సతీశన్ పంచాయితీ తెగేనా?
-
Vijay: పాపం విజయ్… రచ్చ గెలిచి ఇంట గెల్వలేకపోయాడా??
-
Nimmala Ramanaidu : 2027 జూన్ కి పోలవరం ప్రాజెక్టు పూర్తి
-
Sreemukhi : ముచ్చటగా మూడో ఇల్లు కొనేసిన శ్రీముఖి
-
Madatha Kaja Recipe : స్వీట్ షాప్ స్టైల్లో జ్యూసీ మడత కాజాలు ఇంట్లోనే సులభంగా ఇలా తయారు చేసుకోండిలా.!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?