Debt Burden on Indian States: అప్పుల ఊబిలో రాష్ట్రాలు.. ఏపీ సహా టాప్ 10 స్టేట్స్ ఇవే..
Debt Burden on Indian States: భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) వంటి అంతర్జాతీయ సంస్థలు ప్రశంసిస్తున్నాయి. అయితే ఈ వృద్ధి మధ్యలోనే అనేక రాష్ట్రాలు తీవ్రమైన అప్పుల భారంతో కుంగిపోతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన 2025 ఆర్థిక సంవత్సర గణాంకాలు ఈ ఆందోళనకర నిజాలను వెలుగులోకి తీసుకొచ్చాయి. RBI డేటా ప్రకారం, దేశంలోని కొన్ని పెద్ద రాష్ట్రాలు తమ పన్ను మరియు పన్నుయేతర ఆదాయంలో 40 శాతం వరకు కేవలం రుణాలపై వడ్డీ చెల్లింపులకే ఖర్చు చేస్తున్నాయి. దీనివల్ల అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, విద్య వంటి కీలక రంగాలకు సరిపడా నిధులు కేటాయించలేని పరిస్థితి ఏర్పడుతోంది.
Also Read
- YS Jagan: గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ప్రభుత్వ మద్దతు తగ్గుతోంది.. జగన్ ఆవేదన..
- CM Chandrababu: నేను దక్షిణాది రాష్ట్రాల వైపే మాట్లాడుతున్నా.. అందుకే ప్రధాని మోడీకి పూర్తి మద్దతు..
- AP Ministers Singapore Tour: సింగపూర్ చేరుకున్న ఏపీ మంత్రుల బృందం.. 7 రోజుల టూర్..
- Andhra Pradesh: వ్యవసాయ విద్యుత్ సరఫరా వ్యవస్థలో కీలక మార్పులు.. కొత్త కార్పొరేషన్ ఏర్పాటు..
అప్పుల భారంతో అత్యధిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న రాష్ట్రాల జాబితాలో పశ్చిమ బెంగాల్ మొదటి స్థానంలో నిలిచింది. 2025 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం సుమారు రూ.1.09 లక్షల కోట్ల ఆదాయం పొందగా, అందులో రూ.45,000 కోట్లకు పైగా వడ్డీ చెల్లింపులకే వెచ్చించాల్సి వచ్చింది. అంటే మొత్తం ఆదాయంలో దాదాపు 42 శాతం వడ్డీకే వెళ్లిపోయింది. ఇక, రెండో స్థానంలో ఉన్న పంజాబ్ తన ఆదాయంలో 34 శాతం వడ్డీ చెల్లింపులకే ఖర్చు చేసింది. రూ.70,000 కోట్ల ఆదాయంలో సుమారు రూ.24,000 కోట్లు వడ్డీగా చెల్లించింది. ఆ తర్వాత బీహార్ మూడో స్థానంలో నిలిచింది. రాష్ట్రం సంపాదించిన రూ.62,000 కోట్ల ఆదాయంలో సుమారు రూ.21,000 కోట్లు వడ్డీ చెల్లింపులకు వెళ్లాయి.. ఇది మొత్తం ఆదాయంలో 33 శాతం.
ఇక, నాలుగో స్థానంలో ఉన్న కేరళ 2025 ఆర్థిక సంవత్సరంలో రూ.1.03 లక్షల కోట్ల ఆదాయం పొందగా, దాదాపు 28 శాతం అంటే సుమారు రూ.29,000 కోట్లు వడ్డీ చెల్లింపులకే ఖర్చు చేసింది. ఆ తర్వాత ఐదో స్థానంలో ఉన్న తమిళనాడు, అధిక పన్ను ఆదాయం ఉన్న రాష్ట్రాల్లో ఒకటైనా, అప్పుల భారంతోనే కొనసాగుతోంది. రాష్ట్రం తన ఆదాయంలో సుమారు 28 శాతం లేదా రూ.62,000 కోట్లు వడ్డీగా చెల్లించింది.
ఆంధ్రప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాలు
టాప్ 10 అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాల జాబితాలో హర్యానా, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ కూడా ఉన్నాయి. హర్యానా తన రూ.94,000 కోట్ల ఆదాయంలో దాదాపు 27 శాతం అంటే.. రూ.25,000 కోట్లు వడ్డీ చెల్లింపులకే ఖర్చు చేసింది. రాజస్థాన్ రూ.1.48 లక్షల కోట్ల ఆదాయంలో సుమారు రూ.38,000 కోట్లు వడ్డీగా చెల్లించి ఏడవ స్థానంలో నిలిచింది. ఇక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా తీవ్ర అప్పుల ఒత్తిడిని ఎదుర్కొంటోంది. 2025 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం సుమారు రూ.1.2 లక్షల కోట్ల ఆదాయం పొందగా, అందులో దాదాపు రూ.29,000 కోట్లు వడ్డీ చెల్లింపులకే వెచ్చించాల్సి వచ్చింది.
మరోవైపు, మధ్యప్రదేశ్ తొమ్మిదో స్థానంలో నిలిచింది. రాష్ట్రం FY2025లో రూ.1.23 ట్రిలియన్ల ఆదాయం పొందగా, అందులో సుమారు రూ.27,000 కోట్లు లేదా 22 శాతం వడ్డీ చెల్లింపులకే వెళ్లాయి. పదో స్థానంలో ఉన్న కర్ణాటక రూ.2.03 ట్రిలియన్ల ఆదాయం పొందినా, దాదాపు 19 శాతం అంటే రూ.39,000 కోట్లు వడ్డీ చెల్లింపులకే ఖర్చు చేసింది అని ఆర్బీఐ గణాంకాలు చెబుతున్నాయి.. అయితే, రాష్ట్రాల ఆదాయంలో ఇంత పెద్ద మొత్తంలో వడ్డీ చెల్లింపులు జరగడం వల్ల కొత్త రహదారులు, పాఠశాలలు, ఆసుపత్రులు, సంక్షేమ పథకాలు వంటి అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల కొరత ఏర్పడుతోంది. ఆర్థిక క్రమశిక్షణ, ఆదాయ వనరుల విస్తరణ మరియు ఖర్చుల నియంత్రణ లేకపోతే ఈ అప్పుల భారం భవిష్యత్తులో మరింత తీవ్రమయ్యే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తాజావార్తలు
-
Rajnikanth173 : సస్పెన్స్ వీడింది.. రజనీకాంత్ను డైరెక్ట్ చేయబోయే దర్శకుడు ఎవరంటే ?
-
Ravindra Jadeja: ఆమె చెప్పిందే నిజమైంది.. ఈ అవార్డు నా ప్రియమైన మంత్రికి అంకితం!
-
Chidambaram: పోలింగ్ ప్రారంభంలోనే ఓటేసిన పి.చిదంబరం
-
Star Directors : బ్రేక్ తీసుకుంటోన్న స్టార్ డైరెక్టర్స్.. కారణాలు ఏంటో?
-
Michael Jackson Biopic: ఇండియాలో ‘మైఖేల్’ మేనియా.. లక్ష దాటిన టికెట్ల అమ్మకాలు
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?