TTD Adulteration Ghee Case: కల్తీ నెయ్యి కేసులో ముగిసిన సిట్ విచారణ.. వెలుగులోకి సంచలన అంశాలు..!
- కల్తీ నెయ్యి కేసులో ముగిసిన సిట్ విచారణ..
- నెల్లూరు ACB కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేసిన అధికారులు..
- 15 నెలలు పాటు 12 రాష్ట్రాల్లో సాగిన సిట్ విచారణ..
- కల్తీ నెయ్యి కేసు విచారణకి సిట్ నియమించిన రాష్ట్ర ప్రభుత్వం...
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TTD Adulteration Ghee Case: ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన కల్తీ నెయ్యి కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ ముగిసింది. ఈ మేరకు అధికారులు నెల్లూరు ఏసీబీ కోర్టులో ఛార్జిషీట్ను దాఖలు చేశారు. సుమారు 15 నెలల పాటు 12 రాష్ట్రాల్లో సాగిన ఈ విచారణతో కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కల్తీ నెయ్యి వ్యవహారం బయటపడిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు విచారణ కోసం సిట్ను నియమించింది. అనంతరం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం సీబీఐ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది.
Read Also: Karnataka: పిల్లలు లేరన్న కోపంతో భార్యను చంపిన భర్త.. హార్ట్ ఎటాక్గా చిత్రీకరించి చివరికీ..
Also Read
- Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ 'నో ఛాన్స్'.!
- Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
- US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
- Ishan Kishan: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో పేలిన పాకెట్ డైనమెట్.. నెం.1 బ్యాటర్గా ఇషాన్ కిషన్.!
ప్రారంభంలో ఈ కేసు మూలాలు తమిళనాడులో ఉన్నట్టుగా దర్యాప్తు బృందాలు భావించాయి. అయితే విచారణలో కీలక మలుపు తిరగడంతో బోలోబాబా ఆర్గానిక్ డైరీ డైరెక్టర్లు పొమిల్ జైన్, విపిన్ జైన్లు ఈ స్కాంలో ప్రధాన సూత్రధారులుగా గుర్తించారు. ఈ కల్తీ నెయ్యి నెట్వర్క్లో ఆంధ్రప్రదేశ్తో పాటు ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా సహా మొత్తం 12 రాష్ట్రాలకు చెందిన సంస్థలు, వ్యక్తులు భాగస్వాములుగా ఉన్నట్టు అధికారులు తేల్చారు. కేసు విచారణలో సీబీఐకి చెందిన డీఎస్పీలు, సీఐలతో పాటు రాష్ట్రానికి చెందిన సుమారు 30 మంది అధికారులు పాల్గొన్నారు. దర్యాప్తులో భాగంగా దాఖలు చేసిన తొలి ఛార్జిషీట్లో 24 మందిని నిందితులుగా పేర్కొన్నట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా, ఈ వ్యవహారంలో మరో 12 మంది పాత్ర కూడా ఉన్నట్టు కోర్టుకు స్పష్టంగా వివరించారు. కల్తీ నెయ్యి ద్వారా ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లిన ఈ కేసులో మరింత లోతైన విచారణ కొనసాగుతుందని, అవసరమైతే అదనపు ఛార్జిషీట్లు కూడా దాఖలు చేసే అవకాశం ఉందని దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!