Visakhapatnam: రెవెన్యూ అధికారులపై భూ కబ్జాదారుల దాడి..
- విశాఖలో భూకబ్జాదారుల ఆగడాలు..
- ప్రభుత్వ భూమిని ఖాళీ చేయించేందుకు ప్రయత్నం..
- రెవెన్యూ అధికారులపై దాడికి యత్నించిన భూకబ్జాదారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Visakhapatnam: విశాఖపట్నం జిల్లాలో భూ కబ్జాదారుల ఆగడాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. పెందుర్తి మండలం చింతగట్ల ప్రాంతంలో ప్రభుత్వ భూమిని ఖాళీ చేయించేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులపై ఆక్రమణదారులు దాడికి యత్నించారు. సర్వే నంబర్ 57/1, 57/2లో ఉన్న ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను తొలగించేందుకు రెవెన్యూ సిబ్బంది జేసీబీతో అక్కడికి చేరుకున్నారు. అయితే, భూమి ఖాళీ చేయడాన్ని అడ్డుకునేందుకు భూ కబ్జాదారులు రెవెన్యూ సిబ్బందిపై రాళ్లు, కర్రలతో దాడి చేసేందుకు ప్రయత్నించారు.
Read Also: Sankranti Rush: కొనసాగుతున్న సంక్రాంతి రద్దీ.. బస్సులు, రైల్వే స్టేషన్లలో కిక్కిరిసిన జనం
Also Read
- Vizag, Vijayawada Metro Projects: విశాఖ, విజయవాడ మెట్రోరైల్పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు..
- South Coast Railway Zone: విశాఖ రైల్వే జోన్పై కేంద్రం సర్ప్రైజ్ గెజిట్..
- Weather Updates in Regional Languages: రైతులకు గుడ్న్యూస్.. ఇక ప్రాంతీయ భాషల్లోనే వాతావరణ సమాచారం..
- Vizag Stock Market Scam: ఫ్యామిలీ మొత్తం కంత్రీ..! స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో రూ.6.5 కోట్లు నొక్కేశారు..
ఇక, ఈ ఘటనలో ఆక్రమణదారులు జేసీబీతో ధ్వంసం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దాడి భయంతో రెవెన్యూ సిబ్బంది అక్కడి నుంచి పరుగులు తీయాల్సి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మార్వో ఆదేశాల మేరకు దాడికి పాల్పడిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణలో ఎలాంటి రాజీ ఉండదని అధికారులు స్పష్టం చేశారు. ఈ సంఘటన ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
తాజావార్తలు
-
GT vs RR : గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం.. పాయింట్ల పట్టికలో టాప్కు..!
-
Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
-
Suriya: సూర్య ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ అప్పుడే!
-
PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్పై మోడీ ట్వీట్
-
Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం