CM Chandrababu : దళితుల కోసం మంచి స్కీంను తీసుకొస్తాం..
- దళితుల కోసం యుద్ధం చేసిన యోధుడు అంబేద్కర్
- మన అందరికి హక్కులున్నాయంటే దానికి కారణం ఆయనే
- 2003లో ఎస్సీ కమిషన్ ఏర్పాటు చేశాం
- చదువుకోవాలనే ఆశ ఉండే పిల్లలందరిని చదివిస్తాం
- అమరావతికి దేశంలోని మంచి కాలేజీలు వస్తున్నాయి
- పొన్నెకల్లులో సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు
దళితుల కోసం యుద్ధం చేసిన యోధుడు అంబేద్కర్ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లులో అంబేద్కర్ జయంతి కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఈ రోజు మన అందరికి హక్కులున్నాయంటే దానికి కారణం అంబేద్కర్ అన్నారు.. 2003లో ఎస్సీ కమిషన్ ఏర్పాటు చేశామని.. చదువుకోవాలనే ఆశ ఉండే పిల్లలందరినీ చదివిస్తామని హామీ ఇచ్చారు. తొందర్లోనే మంచి స్కీంను తీసుకొస్తామని తెలిపారు. అమరావతికి దేశంలోని మంచి కాలేజీలు వస్తున్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో 21 లక్షల పేద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు ఉన్నాయని గుర్తు చేశారు. మీ ఇంటిపైనే సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
Also Read
- Karoline Leavitt: వైట్హౌస్కు దూరం కాబోతున్న ట్రంప్ ప్రతినిధి కరోలిన్ లీవిట్.. కారణమిదే!
- Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
- Varanasi: మెక్సికోను షేక్ చేసిన రాజమౌళి వీడియో మెసేజ్.. ‘వారణాసి’ వరల్డ్ గ్లింప్స్కు అదిరిపోయే రెస్పాన్స్!
- Delhi: లక్ష్మీనగర్లో భారీ అగ్నిప్రమాదం.. నాలుగు ఇళ్లు దగ్ధం
అదనపు కరెంట్ను డిపార్ట్మెంట్కు ఇస్తే యూనిట్కు 2.09 పైసలు చెల్లిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. సొంతూరిలోనే బంగారు భవిష్యత్తు ఉందని పిల్లలు భావిస్తున్నారన్నారు. “పేదలకు అండగా ఉంటానని అందరికీ హామీ ఇస్తున్నా. కుల వివక్షకు వ్యతిరేకంగా అంబేద్కర్ పోరాడారు. రాజ్యాంగంలో హక్కులను అంబేద్కర్ పొందుపరిచారు. దళితులకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది. దళితుడిని లోక్సభ స్పీకర్ గా చేసిన పార్టీ టీడీపీ. దళితుల హక్కులు కాపాడాలని ఆదేశాలు ఇచ్చాం. ప్రతిష్టాత్మక వర్సిటీలు అమరావతికి తరలివస్తున్నాయి. సబ్ ప్లాన్ ద్వారా దళితుల అభివృద్ధికి కృషి చేస్తాం. రెసిడెన్షియల్ స్కూళ్లలో మెరుగైన భోజనం, నాణ్యమైన విద్యను అందిస్తాం.
దళితులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. దళితులకు 8 లక్షల ఎకరాలను టీడీపీ ప్రభుత్వం పంపిణీ చేసింది. అంబేద్కర్ విదేశీ విద్యాదీవెనను మళ్లీ ప్రారంభిస్తాం.” అని సీఎం చంద్రబాబు అన్నారు.
READ MORE: Rahul Gandhi: రాజస్థాన్ పర్యటనలో రాహుల్గాంధీకి వింత అనుభవం.. కార్యకర్త ఏం అడిగాంటే..!
తాజావార్తలు
-
Karoline Leavitt: వైట్హౌస్కు దూరం కాబోతున్న ట్రంప్ ప్రతినిధి కరోలిన్ లీవిట్.. కారణమిదే!
-
Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
-
Cheapest Saree Markets: మగువలకు గుడ్ న్యూస్.. రూ.150 కే పట్టు చీరలు.. దేశంలోనే అత్యంత చౌకైన మార్కెట్లు ఇవే!
-
Varanasi: మెక్సికోను షేక్ చేసిన రాజమౌళి వీడియో మెసేజ్.. ‘వారణాసి’ వరల్డ్ గ్లింప్స్కు అదిరిపోయే రెస్పాన్స్!
-
Delhi: లక్ష్మీనగర్లో భారీ అగ్నిప్రమాదం.. నాలుగు ఇళ్లు దగ్ధం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!