అనంతపురం జిల్లాలో రాత్రి నుంచి కుండపోతగా వర్షం కురుస్తోంది. జిల్లా కేంద్రమైన అనంతపురంలో రాత్రి నుంచి వర్షం కురుస్తున్నది. అనంతపురంతో పాటుగా కదిరి, పుట్టపర్తిలో కూడా భారీగా వర్షం కురుస్తున్నది. జిల్లాలోని చిత్రావతి, బుక్కపట్నం చెరువుకు భారీగా వరదనీరు చేరుతున్నది. చెరుపులు పూర్తిస్తాయిలో నిండిపోవడంతో అటువైపు ఎవరూ వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. చిత్రావతికి భారీగా వరదనీరు చేరడంతో పుట్టపర్తి బ్రిడ్జిపైన ప్రవహిస్తోంది. Read: స్మార్ట్ పోలీసింగ్లో ఏపీకీ నెంబర్ వన్ ర్యాంకు దీంతో పుట్టపర్తి-కర్ణాటక నాగేపల్లికి…
అనంతపురంలో కొడికొండ చెక్పోస్టు వద్ద టీడీపీ కార్యకర్తలు నారాలోకేష్ను కలిశారు. ఈ సందర్భంగా నారాలోకేష్ వారితో కాసేపు మచ్చటించారు. మనం పోరాటం చేయటమే ముఖ్యమని, ప్రజల మనవైపే ఉన్నారని లోకేష్ అన్నారు. చింతపండు మొదలుకొని నూనె, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు. ప్రజలు అన్ని గమనిస్తు న్నారని, త్వరలోనే వైసీపీకి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజు వస్తుందన్నారు. ప్రజలతో కలిసి ఉంటూ, ప్రజలకు అండగా నిలబడాలన్నారు. ధరలపై పోరాటం చేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రజలు మన…
రాష్ట్ర వ్యాప్తంగా 435 ఎయిడెడ్ హైస్కూళ్ళు ఉన్నాయని, వీటిలో 350 స్కూళ్ళల్లో విద్యార్థుల సంఖ్య వందలోపే ఉన్నారని ఉన్నత విద్యా శాఖ, స్పెషల్ చీఫ్ సెక్రటరీసతీష్ చంద్ర అన్నారు. అలాంటి స్కూ ళ్లకు ప్రభుత్వం ఎందుకు ఎయిడ్ ఇవ్వాలని ఆయన ప్రశ్నిం చారు. అవసరమైతే ఎయిడెడ్ స్కూళ్ళలోని పిల్లలకు ఇబ్బంది కలుగ కుండా కొత్తగా పాఠశాల ఏర్పాటు చేస్తామని సతీష్ చంద్ర పేర్కొ న్నారు. ఈ సందర్భంగా అనంతపురం SSBN కాలేజ్ ఘటనపై ఆయన స్పందించారు. అనంతపురం…
అనంతపురంజిల్లా పెనుకొండలో నగర పంచాయితీ ఎన్నికల రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. టీడీపీ తరఫున కౌన్సిలర్ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వీరి వెంట మాజీ ఎమ్మెల్యే పార్థసారథి తరలివచ్చి ప్రతి కౌన్సిలర్ అభ్యర్థికి తానే అన్నీ చూసుకుంటూ దగ్గరుండి నామినేషన్ లు వేయించారు. ఈ సందర్భంగా పార్థసారధి మాట్లాడుతూ పెనుకొండ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఓడిపోతామనే పక్క జిల్లాల నుంచి కేవలం ఎమ్మెల్యేలను పిలిపించుకుని అధికారం తో గెలవాలని చూస్తుందన్నారు. ఇప్పటికే వాలంటరీ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ…
ఏపీ ప్రభుత్వం ఎయిడెడ్ పాఠశాలల నిర్వహణ పట్ల వ్యవహరిస్తున్న తీరుకి నిరసనగా విద్యార్ధులు ఆందోళన బాట పట్టారు. ఎయిడెడ్ పాఠశాలల పైన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు. అనంతపురం నగరంలోని గిల్దాఫ్ ఎయిడెడ్ బాలికల పాఠశాలలో విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. స్కూల్ యాజమాన్యం బలవంతంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సంతకాలు చేయించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ అంతా పేద విద్యార్థులు పల్లెల నుంచి వచ్చి చదువుకుంటున్నామని,…
అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని కొట్నూర్ వద్ద వర్షపు నీరు ఇళ్ళ లోకి చేరి చేనేత కుటుంబాలు రోడ్డుపాలయ్యాయి. నేషనల్ హైవే కాంట్రాక్టర్ అక్కడ ఉన్న కాలువను మట్టితో కప్పేయడం తో వర్షపు నీరంతా ఇళ్లల్లోకి చేరి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. వర్షం పడిందంటే ఉపాధి కోల్పోయి పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని కోడూరు గ్రామానికి చెందిన కార్మికులు వాపోతున్నారు. తమ ఇంటి పక్కనే నేషనల్ హైవే పనులు జరుగుతుండడంతో ఉన్న ఇరిగేషన్ కాలువను మట్టితో…
ఆ జిల్లా టీడీపీలో ఎప్పుడు ఏ గొడవ జరిగినా.. అధిష్ఠానం పేరుతో ఒక లెటర్ వస్తుంది. అందులో ఊరు పేరు.. మ్యాటర్ ఉంటుంది. ఎందుకు పంపిస్తున్నారు.. ఎవరికి పంపిస్తున్నారో వివరాలు కనిపించవు. కానీ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతాయి. ఇంతకీ ఆ లేఖల ఆంతర్యం ఏంటి? ఇప్పటికే అనంతలో జేసీ వర్సెస్ టీడీపీ పాత నేతలు..! అనంతపురం జిల్లా టీడీపీలో కొన్నిరోజులుగా వర్గ విబేధాలు ఒక రేంజ్లో సాగుతున్నాయి. గతంలో నియోజకవర్గాల మధ్య ఆధిపత్యపోరు ఉండేది.…
ముహూర్తం దగ్గర పడుతోంది. అలాగే ఆశావహుల్లో టెన్షన్ కూడా పెరిగిపోతోంది. జిల్లాకు ఎన్ని పదవులు వస్తాయో ఏమో కానీ.. వాటికోసం ఎదురుచూస్తున్న వారి సంఖ్య మాత్రం చాలానే ఉంది. అయితే సీనియారిటీ, సామాజిక కోణాల్లో అధినేత వేటికి ప్రాధాన్యం ఇస్తారో అర్థంకాక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు ఆశావహులు. అనంతలో మంత్రి పదవి కోసం ఐదుగురు పోటీ..! ప్రస్తుతం అనంతపురం అధికారపార్టీలో వినిపిస్తున్నది ఒక్కటే మాట. నెక్ట్స్ మంత్రిగా ఎవరికి ఛాన్స్ వస్తుంది. త్వరలోనే కొత్త మంత్రివర్గం ఏర్పాటుకు అవకాశాలు…