దేశంలో ఒమిక్రాన్ విస్తరిస్తున్న వేళ అనంతపురం జిల్లా వైద్య శాఖ అప్రమత్తం అవుతుంది. ఇప్పటికే కరోనాకు సంబంధించిన అన్ని జాగ్రత్తలను వైద్య శాఖ అధికారులు తీసుకుంటున్నారు. మరోసారి కరోనా ముప్పు రాకుండా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. తాజాగా అనంతపురం జిల్లాలో విదేశాల నుంచి వచ్చిన వారిపై ఆరోగ్య శాఖ నిఘా పెట్టింది. విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన వారిపై నిఘా పెట్టడంతో పాటు వారిని గుర్తించి పరీక్షలు చేస్తున్నారు. ఇప్పటికే వివిధ దేశాల నుంచి వచ్చిన 471…
అనంతపురం జిల్లాలో రికార్డులు బద్ధలయ్యాయి. కరువుసీమలో వందేళ్లలో లేనంత భారీ స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఏడాదంతా కురిసే వర్షం నెలరోజుల్లోనే 40 శాతం కురిసింది. భారీ స్థాయిలో వానలు కురవడంతో నష్టం కూడా బాగా పెరిగింది. నిత్యం కరువుతో వుండే ప్రాంతంలో వానలే వానలు. మంచి నీటి కోసం ఇబ్బందులు పడ్డవారు ఇప్పుడు వాటర్ పైప్ లైన్లు పాడయిపోయాయి. ఎడతెరిపి లేని వానలతో కనీవీనీ ఎరుగని రీతిలో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ప్రాణాలు కూడా పోయాయి. 150…
వంద అడుగుల్లో నీరు పడుతుందంటే.. 99 అడుగులు తవ్వాక పనులు ఆపేస్తే ఎలా? ఇన్ని రోజులూ ఫ్యాక్షన్, రాజకీయ కక్షలు రూపుమాపేందుకు చేసిన ప్రయత్నం ఇలాంటిదే. మిగిలిన ఆ ఒక్క అడుగు తవ్వాలి. అందుకే తాను వచ్చానంటున్నారా? ఆ యువనేతది ఇదే ఆలోచనా? మార్పు మొదలైందా లేక ఇంకేదైనా వ్యూహం ఉందా? అప్పట్లో జేసీ.. పరిటాల కుటుంబాల మధ్య రాజకీయ వైరం..! ఫ్యాక్షన్కు పుట్టినిల్లులాంటి అనంతపురం జిల్లాలో రెండు కుటుంబాల మధ్య దశాబ్దాల వైరం ఉంది. అందులో…
ఒకవైపు ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న రాష్ట్రంపై భారీవర్షాలు తీరని భారం మోపాయి. భారీ వర్షాలు.. వరదలతో నాలుగు జిల్లాల్లో తీరని నష్టం సంభవించింది. నెల్లూరు, చిత్తూరు, అనంత, కడప జిల్లాలకు భారీ నష్టం వాటిల్లింది. ఇప్పటి వరకు 24 మంది వర్షాలు, వరదల వల్ల చనిపోయినట్టు అధికారిక ప్రకటన వెలువడింది. కడపలో 13, అనంతలో 7, చిత్తూరులో 4 మంది జల విలయానికి బలయ్యారు. 17 మంది గల్లంతైనట్టు ప్రకటించింది ప్రభుత్వం. కడపలో 11, చిత్తూరులో…
అనంతపురం జిల్లాలో రాత్రి నుంచి కుండపోతగా వర్షం కురుస్తోంది. జిల్లా కేంద్రమైన అనంతపురంలో రాత్రి నుంచి వర్షం కురుస్తున్నది. అనంతపురంతో పాటుగా కదిరి, పుట్టపర్తిలో కూడా భారీగా వర్షం కురుస్తున్నది. జిల్లాలోని చిత్రావతి, బుక్కపట్నం చెరువుకు భారీగా వరదనీరు చేరుతున్నది. చెరుపులు పూర్తిస్తాయిలో నిండిపోవడంతో అటువైపు ఎవరూ వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. చిత్రావతికి భారీగా వరదనీరు చేరడంతో పుట్టపర్తి బ్రిడ్జిపైన ప్రవహిస్తోంది. Read: స్మార్ట్ పోలీసింగ్లో ఏపీకీ నెంబర్ వన్ ర్యాంకు దీంతో పుట్టపర్తి-కర్ణాటక నాగేపల్లికి…
అనంతపురంలో కొడికొండ చెక్పోస్టు వద్ద టీడీపీ కార్యకర్తలు నారాలోకేష్ను కలిశారు. ఈ సందర్భంగా నారాలోకేష్ వారితో కాసేపు మచ్చటించారు. మనం పోరాటం చేయటమే ముఖ్యమని, ప్రజల మనవైపే ఉన్నారని లోకేష్ అన్నారు. చింతపండు మొదలుకొని నూనె, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు. ప్రజలు అన్ని గమనిస్తు న్నారని, త్వరలోనే వైసీపీకి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజు వస్తుందన్నారు. ప్రజలతో కలిసి ఉంటూ, ప్రజలకు అండగా నిలబడాలన్నారు. ధరలపై పోరాటం చేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రజలు మన…
రాష్ట్ర వ్యాప్తంగా 435 ఎయిడెడ్ హైస్కూళ్ళు ఉన్నాయని, వీటిలో 350 స్కూళ్ళల్లో విద్యార్థుల సంఖ్య వందలోపే ఉన్నారని ఉన్నత విద్యా శాఖ, స్పెషల్ చీఫ్ సెక్రటరీసతీష్ చంద్ర అన్నారు. అలాంటి స్కూ ళ్లకు ప్రభుత్వం ఎందుకు ఎయిడ్ ఇవ్వాలని ఆయన ప్రశ్నిం చారు. అవసరమైతే ఎయిడెడ్ స్కూళ్ళలోని పిల్లలకు ఇబ్బంది కలుగ కుండా కొత్తగా పాఠశాల ఏర్పాటు చేస్తామని సతీష్ చంద్ర పేర్కొ న్నారు. ఈ సందర్భంగా అనంతపురం SSBN కాలేజ్ ఘటనపై ఆయన స్పందించారు. అనంతపురం…
అనంతపురంజిల్లా పెనుకొండలో నగర పంచాయితీ ఎన్నికల రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. టీడీపీ తరఫున కౌన్సిలర్ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వీరి వెంట మాజీ ఎమ్మెల్యే పార్థసారథి తరలివచ్చి ప్రతి కౌన్సిలర్ అభ్యర్థికి తానే అన్నీ చూసుకుంటూ దగ్గరుండి నామినేషన్ లు వేయించారు. ఈ సందర్భంగా పార్థసారధి మాట్లాడుతూ పెనుకొండ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఓడిపోతామనే పక్క జిల్లాల నుంచి కేవలం ఎమ్మెల్యేలను పిలిపించుకుని అధికారం తో గెలవాలని చూస్తుందన్నారు. ఇప్పటికే వాలంటరీ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ…
ఏపీ ప్రభుత్వం ఎయిడెడ్ పాఠశాలల నిర్వహణ పట్ల వ్యవహరిస్తున్న తీరుకి నిరసనగా విద్యార్ధులు ఆందోళన బాట పట్టారు. ఎయిడెడ్ పాఠశాలల పైన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు. అనంతపురం నగరంలోని గిల్దాఫ్ ఎయిడెడ్ బాలికల పాఠశాలలో విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. స్కూల్ యాజమాన్యం బలవంతంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సంతకాలు చేయించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ అంతా పేద విద్యార్థులు పల్లెల నుంచి వచ్చి చదువుకుంటున్నామని,…