Eknath Shinde : మహారాష్ట్ర, కర్ణాటక మధ్య సరిహద్దు వివాదం రసవత్తరంగా నడుస్తోంది. రాష్ట్రానికి చెందిన ఒక్క అంగుళం భూమిని వదులుకోబోమని అవసరమైతే సుప్రీంకోర్టును, కేంద్రప్రభుత్వాన్ని ఆశ్రయిస్తానని ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అన్నారు.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ ఈరోజు ఢిల్లీ వెళ్లారు. కొద్ది సమయంలో ఆమె ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ పర్యటనలో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు ఇతర కేంద్ర మంత్రులతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది.
India-China border clash, China's response: అరుణాచల్ ప్రదేశ్లోని ఎల్ఏసీ వెంబడి భారత్, చైనా దళాలు ఘర్షణకు దిగాయి. ఈ ఘటనలో ఇరు దేశాల సైనికులు గాయపడ్డారు. అయితే ఈ ఘటనపై తొలిసారిగా చైనా స్పందించింది. చైనా విదేశాంగశాఖ ప్రతినిధఇ వాంగ్ వెన్బిన్ మాట్లాడుతూ.. సరిహద్దుల్లో ప్రస్తుతం పరిస్థితి స్థిరంగా ఉందని ఆయన అన్నారు. డిసెంబర్ 9 అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సెక్టార్ లో భారత్, చైనా దళాల మధ్య ఘర్షణ నెలకొంది. అయితే సరిహద్దు సమస్యను…
గుజరాత్లో మరోసారి తిరుగులేని విజయాన్ని అందుకుంది భారతీయ జనతా పార్టీ… ఎప్పుడూ లేని విధంగా అసెంబ్లీ స్థానాలను పెంచుకుంది.. 1995లో 121 స్థానాలు గెలిచిన బీజేపీ, 1998లో 117 స్థానాల్లో విజయం సాధించింది.. 2002లో 127 సీట్లు కైవసం చేసుకోగా.. 2007లో 117 స్థానలు.. 2012లో 115 స్థానాలు, 2017లో 99 స్థానాలకే పరిమితం అయ్యింది.. ఇప్పుడు 150 స్థానాలను దాటేసి 160 వైపు సాగుతుంది.. దీంతో, కమలం పార్టీ శిబిరంలో జోష్ పెరిగింది.. ఇక, మరోసారి…
Congress objects to Modi’s ‘roadshow’, questions ECI’s silence: గుజరాత్ ఎన్నికలకు సంబంధించి రెండో విడత పోలింగ్ ఈరోజు జరుగుతోంది. ఈనెల 8న గుజరాత్ తో పాటు హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇదిలా ఉంటే ఈ రోజు జరిగిన ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మదాబాద్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు ప్రధాని మోదీ. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అహ్మదాబాద్లోని రాణిప్లోని…
దేశవ్యాప్తంగా ఉత్కంఠరేపుతోన్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. ఇవాళ ఉదయం 8 గంటలకు 14 జిల్లాల పరిధిలోని 93 నియోజకవర్గాల్లో తుది విడత ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రారంభమైంది.. ఆయా స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ఆద్మీ పార్టీల మధ్య త్రిముఖ పోరు జరుగుతుండడం ఆసక్తి రేపుతోంది.. మూడు దశాబ్దాలుగా గుజరాత్ను ఏలుతోన్న బీజేపీ.. ఈ సారి అత్యధికంగా ఓట్లు, సీట్లు గెలిచి చరిత్ర తిరగరాయాలని చూస్తోంది.. పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తుంటే.. తొలిసారే…