Eknath Shinde : అవసరమైతే సుప్రీంకోర్టుకు పోతాం.. కానీ ఒక్క అంగుళం కూడా వదులుకోం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Eknath Shinde : మహారాష్ట్ర, కర్ణాటక మధ్య సరిహద్దు వివాదం రసవత్తరంగా నడుస్తోంది. రాష్ట్రానికి చెందిన ఒక్క అంగుళం భూమిని వదులుకోబోమని అవసరమైతే సుప్రీంకోర్టును, కేంద్రప్రభుత్వాన్ని ఆశ్రయిస్తానని ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అన్నారు. మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దు వివాదంపై మహారాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానాన్ని ప్రవేశపెట్టిన ఒక రోజు తర్వాత షిండే ఈ ప్రకటన చేశారు. కర్ణాటకలోని మరాఠీ మాట్లాడే 865 గ్రామాలను మహారాష్ట్రలోకి విలీనం చేయాలని ఈ తీర్మానం కోరుతోంది. బుధవారం మహారాష్ట్ర శాసన మండలిలో షిండే ప్రసంగిస్తూ.. ‘కర్ణాటక మమ్మల్ని సవాలు చేయకూడదని, బెల్గాం, నిపాని, కార్వార్, బీదర్, భాల్కీ సహా 865 గ్రామాల్లో అంగుళం భూమిని వదులుకోబోం’ అని అన్నారు. మరాఠీ మాట్లాడే ప్రజలకు అన్యాయం జరగకుండా చట్టపరంగా ఎలాంటి చర్యలనైనా తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టును అవసరమైతే కేంద్రప్రభుత్వాన్ని కోరుతామని ఏక్ నాథ్ షిండే అన్నారు. శాసనసభ తీర్మానం ప్రకారం, మహారాష్ట్ర ప్రభుత్వం సరిహద్దు ప్రాంతాల్లోని మరాఠీలకు మద్దతుగా నిలుస్తుంది. ఈ ప్రాంతాలు మహారాష్ట్రలో భాగమయ్యేలా సుప్రీంకోర్టులో న్యాయ పోరాటానికి వెళ్తుంది.
Read Also : Cobra Fight : తుపాకీ కాల్పులకు ఎదురుతిరిగిన పాము
Also Read
- Asian Games 2026: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
- 200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
- Girls Hair Cutting: నిద్రలో ఉండగా జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
ఈ వివాదంపై కర్ణాటక శాసన సభ ఇటీవల ఓ తీర్మానాన్ని ఆమోదించింది. మహారాష్ట్ర ప్రభుత్వం సృష్టించిన సరిహద్దు వివాదాన్ని ఖండించింది. కర్ణాటక భూమి, నీరు, భాష, కన్నడిగుల ప్రయోజనాలకు సంబంధించిన అంశాల్లో ఎటువంటి రాజీ లేదని స్పష్టం చేసింది. ఈ విషయంలో కర్ణాటక ప్రజలు, ఎమ్మెల్యేల భావాలు ఒకటేనని పేర్కొంది. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటం కోసం ఐకమత్యంగా రాజ్యాంగపరమైన, న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి కట్టుబడి ఉన్నట్లు పేర్కొంది. ఈ వివాదంపై సుప్రీంకోర్టు తీర్పును ప్రకటించే వరకు ఇరు రాష్ట్రాలు ఎలాంటి వాదనలు చేయబోవని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై మధ్య శాంతి నెలకొల్పేందుకు జోక్యం చేసుకోవద్దన్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన చిన్నచిన్న సమస్యలను కర్ణాటకకు చెందిన ముగ్గురు, మహారాష్ట్రకు చెందిన ముగ్గురు మంత్రులు కూర్చుని పరిష్కరిస్తారని కూడా షా చెప్పారు. రెండు రాష్ట్రాల్లో శాంతిభద్రతలను సీనియర్ ఐపీఎస్ అధికారి పర్యవేక్షిస్తారని కేంద్ర మంత్రి తెలిపారు.
తాజావార్తలు
-
Asian Games 2026: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
Raptee.HV T30: రాప్టీ.హెచ్వి T30 ఎలక్ట్రిక్ బైక్.. 150KM రియల్ రేంజ్, కారు ఛార్జర్తో ఛార్జింగ్!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
-
Sangeet First Single: ఏఆర్ రెహమాన్ చేతుల మీదుగా ‘నీ వల్లే’ సాంగ్ రిలీజ్.. సిద్ శ్రీరామ్ మెలోడీకి ఫిదా అవుతున్న ఫ్యాన్స్!
ట్రెండింగ్
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!