Gujarat: గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం..డ్రైవర్కు గుండెపోటు..9 మంది దుర్మరణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gujarat Bus Crashes Into SUV After Driver Suffers Heart Attack, 9 Dead: గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. టయోటా ఫార్చూనర్ కారును బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో 9 మంది మరణించారు. 28 మంది గాయపడ్డారు. ప్రస్తుతం 11 మందిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. శనివారం తెల్లవారుజామున గుజరాత్ నవ్ సారి నుంచి వల్సాద్ వెళ్తున్న బస్సు, టయోటా ఫార్చునర్ ని ఢీకొట్టింది. బస్సు డ్రైవర్ కు గుండెపోటు రావడంతో బస్సుపై నియంత్రణ కోల్పోయి ఎదురుగా వస్తున్న కారును ఢీకొంది. నేషనల్ హైవే-8పై వెస్మా గ్రామం వద్ద జరిగింది.
Read Also: Karimnagar: అంతుచిక్కని వ్యాధితో కుటుంబం బలి.. గంగాధరలో మిస్టరీ డెత్స్
Also Read
- Monsoon: తొలకరిపై అన్నదాతలకు ఐఎండీ గుడ్న్యూస్.. 2-3 రోజుల్లో కేరళకు రుతుపవనాలు
- Dk.Shivakumar: రేపు ఖర్గే, రాహుల్గాంధీతో డీకే.శివకుమార్ భేటీ.. మంత్రివర్గ కూర్పుపై చర్చ
- Kapil Sibal: భారత్లో నివసించడానికి సిగ్గుగా ఉంది.. కపిల్ సిబల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎదురుదాడి
- Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్ బై..? సొంత పార్టీ వైపు అడుగులు.. ‘ఆ ఒక్క మాట’తో షేక్ అవుతున్న తమిళ పాలిటిక్స్!
సూరత్ లో జరిగిన ప్రముఖ్ స్వామి మహరాజ్ శతాబ్ది మహోత్సవ్ కార్యక్రమానికి హాజరై ఫార్చూనర్ లో తిరుగు ప్రయాణం అయ్యారు. ఇదే సమయంలో బస్సు నవ్ సారి నుంచి వల్సాద్ వెళ్తోంది. ఇరు వాహనాలు ఎదురెదురుగా ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. మృతులంతా గుజరాత్ లోని అంకాలేశ్వర్ నివాసితులని నవ్ సారి ఎస్పీ రుషికేష్ ఉపాధ్యాయ తెలిపారు. మృతులకు సంతాపాన్ని తెలిపారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. ‘‘గుజరాత్లోని నవ్సారిలో జరిగిన రోడ్డు ప్రమాదం హృదయ విదారకంగా ఉంది. ఈ విషాదంలో వారి కుటుంబాలను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి. దేవుడు వారికి బాధను భరించే శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను. స్థానిక యంత్రాంగం క్షతగాత్రులకు వెంటనే చికిత్స అందిస్తోంది, వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’’ అంటూ అమిత్ షా ట్వీట్ చేశారు.
ప్రమాదం కారణంగా హైవేపై ట్రాఫిక్ జాం ఏర్పడింది. పోలీసులు క్రేన్ల సహాయంతో బస్సును రోడ్డు పై నుంచి తొలగించారు. దీంతో యాథావిధిగా వాహనాల రాకపోకలు జరుగుతున్నాయి. ఈ నెల 14న అహ్మదాబాద్లో జరిగిన ప్రముఖ్ స్వామి మహరాజ్ శతాబ్ది మహోత్సవ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు.
తాజావార్తలు
-
Buchi Babu: “నేను పెద్ది 100 సార్లు చూసి.. ఏడ్చేశా”.. పెద్ది మూవీపై బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు!
-
Ram Charan : మీకోసం రక్తం చిందించడానికైనా సిద్ధమే.. చనిపోయే వరకు ఎంటర్టైన్ చేస్తా!
-
Telangana Traffic Challans: వాహనదారులకు అలర్ట్.. చలాన్లపై తెలంగాణ ప్రభుత్వ కీలక హెచ్చరిక..
-
Ram Charan : ఇలాంటి అద్భుతమైన కథ దొరికినప్పుడు కష్టపడకపోతే ఇంకెప్పుడు కష్టపడతాం?
-
Janhvi Kapoor: ముద్దుముద్దు తెలుగుతో మురిపించిన జాన్వీ కపూర్.. ఫిదా అయిన చరణ్!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!