Gujarat: గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం..డ్రైవర్కు గుండెపోటు..9 మంది దుర్మరణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gujarat Bus Crashes Into SUV After Driver Suffers Heart Attack, 9 Dead: గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. టయోటా ఫార్చూనర్ కారును బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో 9 మంది మరణించారు. 28 మంది గాయపడ్డారు. ప్రస్తుతం 11 మందిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. శనివారం తెల్లవారుజామున గుజరాత్ నవ్ సారి నుంచి వల్సాద్ వెళ్తున్న బస్సు, టయోటా ఫార్చునర్ ని ఢీకొట్టింది. బస్సు డ్రైవర్ కు గుండెపోటు రావడంతో బస్సుపై నియంత్రణ కోల్పోయి ఎదురుగా వస్తున్న కారును ఢీకొంది. నేషనల్ హైవే-8పై వెస్మా గ్రామం వద్ద జరిగింది.
Read Also: Karimnagar: అంతుచిక్కని వ్యాధితో కుటుంబం బలి.. గంగాధరలో మిస్టరీ డెత్స్
Also Read
- TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
- Import Duty Charges increased: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
సూరత్ లో జరిగిన ప్రముఖ్ స్వామి మహరాజ్ శతాబ్ది మహోత్సవ్ కార్యక్రమానికి హాజరై ఫార్చూనర్ లో తిరుగు ప్రయాణం అయ్యారు. ఇదే సమయంలో బస్సు నవ్ సారి నుంచి వల్సాద్ వెళ్తోంది. ఇరు వాహనాలు ఎదురెదురుగా ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. మృతులంతా గుజరాత్ లోని అంకాలేశ్వర్ నివాసితులని నవ్ సారి ఎస్పీ రుషికేష్ ఉపాధ్యాయ తెలిపారు. మృతులకు సంతాపాన్ని తెలిపారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. ‘‘గుజరాత్లోని నవ్సారిలో జరిగిన రోడ్డు ప్రమాదం హృదయ విదారకంగా ఉంది. ఈ విషాదంలో వారి కుటుంబాలను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి. దేవుడు వారికి బాధను భరించే శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను. స్థానిక యంత్రాంగం క్షతగాత్రులకు వెంటనే చికిత్స అందిస్తోంది, వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’’ అంటూ అమిత్ షా ట్వీట్ చేశారు.
ప్రమాదం కారణంగా హైవేపై ట్రాఫిక్ జాం ఏర్పడింది. పోలీసులు క్రేన్ల సహాయంతో బస్సును రోడ్డు పై నుంచి తొలగించారు. దీంతో యాథావిధిగా వాహనాల రాకపోకలు జరుగుతున్నాయి. ఈ నెల 14న అహ్మదాబాద్లో జరిగిన ప్రముఖ్ స్వామి మహరాజ్ శతాబ్ది మహోత్సవ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు.
తాజావార్తలు
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Import Duty Charges increased: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Akshay Kumar: దిల్ రాజు – అక్షయ్ కుమార్ మూవీ రిలీజ్ డేట్ ఖరారు..
-
Shubman Gill: “మా ప్లాన్ వర్కవుట్ అయింది”.. హైదరాబాద్పై భారీ విజయం తర్వాత గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Ramayana: ‘రామాయణ’లో..సాయి పల్లవిపై మేకర్స్ కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!