పలు జిల్లాలో ఈనెల 21వ తేదీ వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కాగా.. బుధవారం నాడు రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తూ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాథమిక హెచ్చరిక జారీ చేసింది. తూర్పు, మధ్య బంగాళఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు రెండు రోజుల్లో ప్రవేశించే అవకాశం ఉందని పేర్కొన్నది.…
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)… తన ఖాతాదారులకు కీలక సమాచారాన్ని చేరవేసింది… డిజిటల్ లావాదేవీలకే ఎక్కువగా మొగ్గుచూపుతోన్న తరుణంలో.. తాత్కాలికంగా ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్, యోనో బిజినెస్ సేవలు నిలిచిపోయాయని సూచించింది.. వార్షిక ఆర్థిక కార్యకలాపాల ముగింపు సందర్భంగా.. ఈ రోజు (ఏప్రిల్ 1 శుక్రవారం) మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో ఆధారిత సేవలు అందుబాటులో ఉండవని…
ఈనెల 26న జరగనున్న భారత గణతంత్ర వేడుకలను టార్గెట్గా చేసుకుని ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలకు హెచ్చరికలు అందాయి. ఈ వేడుకలకు ప్రధాని మోదీ సహా ఇతర దేశాల నుంచి వచ్చే అతిథులపైనా ఉగ్రవాదులు దాడి చేసేందుకు ప్లాన్ చేసినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం వచ్చింది. ప్రసిద్ధ కట్టడాలు, జనాలు రద్దీగా ఉన్న ప్రాంతాలను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకునే అవకాశముందని ఇంటెలిజెన్స్ వర్గాలు నివేదించాయి. డ్రోన్ల ద్వారా ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని భద్రతా…
పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని అటవీ గ్రామాలలో పులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. ఫారెస్ట్ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు.. కొయ్యూరు అటవీ ప్రాంతం నుండి మంథని మండలంలోని అడవి సోమనపల్లి గ్రామ పరిధిలో గల అటవీ ప్రాంతానికి పులి వచ్చినట్లు వారు తెలిపారు.అడవి సోమనపల్లి, వెంకటపూర్, అరేంద, ఖానాపూర్, కాన్సాయి పేట గ్రామస్తులు, ఎడ్ల, గొర్ల, బర్ల కాపరులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు. పులి సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ గ్రామ…
రోజురోజుకీ టెక్నాలజీ పెరిగిపోతోంది.. కొత్త కొత్త మోడల్స్లో వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి.. ఇప్పటికే డ్రైవర్ అవసరం లేకుండానే పార్కింగ్ చేసుకొనే కార్లు, డ్రైవింగ్ సీట్లో ఉన్నవాళ్లకు నిద్ర వస్తుంటే హెచ్చరించే కార్లు.. లైన్ తప్పితే వార్నింగ్ ఇచ్చే కార్లు.. లాంగ్రూట్ కాకుండా షాట్ రూట్స్ చూపించే కార్లు.. ఒక్కటేంటి.. ఇలా ఎన్నో మార్పులు జరుగుతున్నాయి.. కొత్తగా వచ్చే మోడల్లో ఏదో కొత్త టెక్నాలజీని పరిచయం చేస్తూ.. వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి కంపెనీలు.. తాజాగా జపాన్ కంపెనీ…
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాలను అనుకుని అల్పపీడనం కొనసాగుతోంది.. దాని ప్రభావంతో ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది.. ఇక, కోస్తాలో మోస్తరు వానలు కురిసే అవకాశం ఉండగా.. తీరం వెంబడి గంటకు గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారుల వేటపై నిషేధం విధించినట్టు అధికారులు వెల్లడించారు. మరోవైపు ఈ అల్పపీడన ప్రభావంతో తూర్పు గోదావరి జిల్లా యంత్రాంగం అలెర్ట్ అయ్యింది.. జిల్లాలోని 13…
వైసీపీ అధికారంలోకి వచ్చి దాదాపు రెండున్నరేళ్లు పూర్తవుతోంది. మరో రెండున్నరేళ్లు ఆపార్టీనే అధికారంలో ఉండనుంది. అయితే వచ్చే ఎన్నికలను సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో వైసీపీ ముందుస్తు వ్యూహాలను సిద్ధం చేసుకుంటోంది. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల నుంచి ఎదురయ్యే సవాళ్లపై దృష్టిసారించింది. దీనిలో భాగంగానే టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో ఇవ్వబోయే హామీలను ముందుగానే తెలుసుకొని అమలు చేసేందుకు వైసీపీ ప్రయత్నం చేస్తోంది. దీని ద్వారా ముందుగానే ఆపార్టీకి చెక్ పెట్టే ప్రయత్నం…
కరోనా ఉధృతి నేపథ్యంలో తెలంగాణ వైద్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇప్పుడున్న కరోనా బెడ్లకు అదనంగా, 25 శాతం పెంచాలని నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎలెక్టీవ్ ఆపరేషన్లను పోస్ట్ పోన్ చెయ్యాలని ప్రైవేటు ఆస్పత్రుల్లో మరిన్ని బెడ్స్ కరోనా కోసం పెంచాలని నిర్ణయం తీసుకుంది. కరోనా రోగులను ఆస్పత్రిలో చేర్చేందుకు ప్రత్యేక ప్రోటోకాల్ కూడా సిద్ధం చేసింది. ఇక తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కేసులు భారీ స్థాయిలో…