ఈ కారు గుండె నొప్పిని కూడా గుర్తిస్తుంది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోజురోజుకీ టెక్నాలజీ పెరిగిపోతోంది.. కొత్త కొత్త మోడల్స్లో వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి.. ఇప్పటికే డ్రైవర్ అవసరం లేకుండానే పార్కింగ్ చేసుకొనే కార్లు, డ్రైవింగ్ సీట్లో ఉన్నవాళ్లకు నిద్ర వస్తుంటే హెచ్చరించే కార్లు.. లైన్ తప్పితే వార్నింగ్ ఇచ్చే కార్లు.. లాంగ్రూట్ కాకుండా షాట్ రూట్స్ చూపించే కార్లు.. ఒక్కటేంటి.. ఇలా ఎన్నో మార్పులు జరుగుతున్నాయి.. కొత్తగా వచ్చే మోడల్లో ఏదో కొత్త టెక్నాలజీని పరిచయం చేస్తూ.. వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి కంపెనీలు.. తాజాగా జపాన్ కంపెనీ మజాద్ కొత్త కారును తయారు చేస్తోంది.. డ్రైవింగ్ సీట్లో ఉన్నవారు గుండెపోటు లాంటి తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదురైనప్పుడు కోపైలట్ మోడ్లో.. కారు దానంతట అదే వెళ్లి ఆగిపోతాయని కార్ల తయారీ సంస్థ చెబుతోంది.
Read Also: యోగి ఆసక్తికర వ్యాఖ్యలు… బీజేపీ నిర్ణయం తర్వాతే బరిలోకి..!
Also Read
- Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
- Stock Market: ట్రంప్ దెబ్బ.. స్టాక్ మార్కెట్లో బ్లడ్బాత్
- EPFO EPF Interest: పీఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్.. జూలై 15 నాటికి వడ్డీ జమ.. రూ.1.44 లక్షల కోట్లు క్రెడిట్!
- Stock Market Crash: రక్తసిక్తమైన దలాల్ స్ట్రీట్.. స్టాక్ మార్కెట్లో నిమిషాల్లోనే తుడిచిపెట్టుకుపోయిన వేల కోట్లు!
అయితే, తాము తయారు చేస్తున్న ఈ కార్లు 2025 నాటికి అందుబాటులోకి వస్తుందని మజ్దా ప్రకటించింది.. కాసేపట్లో గుండె నొప్పి రాబోతోందని హెచ్చరించే విధంగా కూడా తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించింది.. కారులో ఏర్పాటు చేసే కెమెరాలు మనిషిలో వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు పసిగడతాయని.. ఆ మార్పులను విశ్లేషించి గుండెపోటు లేదా ఇతర అనారోగ్య సమస్యల సంకేతాలను గుర్తిస్థాయని.. డ్రైవర్కు అనారోగ్య లక్షణాలు కనిపించగానే కారులోని కోపైలట్ వ్యవస్థ డ్రైవింగ్ బాధ్యతలు స్వీకరిస్తుందని.. ఆ తర్వాత జాగ్రత్తగా సురక్షిత ప్రాంతానికి వెళ్లిన తర్వాత కారును రోడ్డు పక్కన ఆపేస్తుందని చెబుతున్నారు.. అంతేకాదు.. ఆ సమయంలో.. పెద్ద శబ్ధం చేయడం.. ఆటోమెటిక్గా లైట్లు రావడం, పోవడం చేస్తే.. పక్కవాళ్లను అప్రమత్తం చేస్తుందని.. ఈ పరిస్థితిని ఎవరైనా గమనించి వారికి సహాయపడేట్లు సిగ్నల్స్ ఇస్తుందని వెల్లడించారు. ఇక, పోలీసులకు, అంబులెన్స్కు ఫోన్ చేసే వ్యవస్థను కూడా అందులో ఏర్పాటు చేస్తామని చెబుతోంది మజాద్. వాహనాలను నడుపుతూ గుండెపోటుతో డ్రైవర్లు మరణించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.. దీంతో.. ఆ వాహనాల్లో ఉన్నవారు కూడా మరణించిన ఘటనలు చాలానే ఉన్నాయి.. ఇలాంటి ప్రమాదాలకు చెక్ పడనుంది.
తాజావార్తలు
-
Vaibhav Vs Archer: చెప్పినట్లే వైభవ్ను బోల్తా కొట్టిస్తున్న ఆర్చర్.. మరోసారి దొరికిపోయిన సూర్యవంశీ..
-
Mohan Naik : మాజీ ఇంజనీర్ మోహన్ నాయక్ కేసులో బిగ్ ట్విస్ట్
-
IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమ్లో రెండు మార్పులు..
-
OTR: కేంద్ర మంత్రి ముందే ప్రశ్నల వర్షం.. బిల్డప్ కోసమేనా..?
-
OTR: తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!