అక్కినేని నాగార్జున ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా గోవాలో జరుగుతుండగా దానికి హాజరయ్యారు. అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకల సందర్భంగా ఈ ఫిలిం ఫెస్టివల్ లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కుమారుడిగా అక్కినేని నాగార్జున పాలు ప్యానల్ డిస్కషన్స్ లో పాల్గొన్నారు. ఇక ఈ ఇంటరాక్షన్స్ లో భాగంగా నాగార్జున తన తండ్రి గురించి తన తండ్రి క్రమశిక్షణ గురించి కొన్ని విషయాలు పంచుకున్నారు. అంతే కాదు ఒకానొక సందర్భంలో…
SS Rajamouli participated in the Akkineni Nageswararao Centenary Celebrations: తెలుగు సినిమాపై చెరదని ముద్ర వేసిన దిగ్గజ నటుడు ‘అక్కినేని నాగేశ్వరరావు’ శత జయంతి వేడుకలు నేడు హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో జరుగుతున్నాయి. ఏఎన్ఆర్ వందో పుట్టినరోజు సందర్భంగా ఆయన విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ వేడుకలకు అక్కినేని కుటుంబ సభ్యులతో పాటు సినీ, రాజకీయ, పారిశ్రామిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకలలో…
అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.అక్కినేని ఫ్యామిలీ సినిమా మనం లో గెస్ట్ రోల్ అదరగొట్టిన అఖిల్.ఆ తర్వాత అఖిల్ అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు..కానీ ఆ సినిమా పెద్ద డిజాస్టర్ గా నిలిచింది.తర్వాత విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో హలో సినిమాలో నటించాడు. ఈ సినిమా కొంత మెప్పించిందని చెప్పాలి. ఆ తర్వాత మిస్టర్ మజ్ను సినిమాలో నటిస్తే ఆ సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేదు.తరువాత వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్…
Bangaru Babu: మహానటుడు నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుకు, జగపతి ఆర్ట్ పిక్చర్స్ సంస్థకూ ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది. జగపతి సంస్థ అధినేత వి.బి.రాజేంద్రప్రసాద్ దర్శకత్వం వహించడానికీ కారకులు ఏయన్నారే!
Brahmachari:నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, జయలలిత జంటగా నటించిన చిత్రం 'బ్రహ్మచారి'. ఏయన్నార్ కు అతి సన్నిహితులు, తరువాత ఆయనకు వియ్యంకుడు అయిన ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ అధినేత ఎ.వి. సుబ్బారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎ.వి.సుబ్బారావు అంటే జయలలితకు కూడా ఎంతో గౌరవం.
మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు నటజీవితంలో మరపురాని చిత్రాలెన్నో! వాటిలో 1962 ఏప్రిల్ 11న విడుదలైన ‘మంచి మనసులు’ మరపురానిది. అంతకు ముందు తమ అన్నపూర్ణ పిక్చర్స్ పతాకంపై నిర్మితమైన చిత్రాలలో అక్కినేని, ఆదుర్తి సుబ్బారావు కాంబినేషన్ విజయ దుందుభి మోగించింది. ఆ తరువాత ‘బాబూ మూవీస్’లోనూ ఏయన్నార్, ఆదుర్తి విజయఢంకా మోగించడానికి నాంది పలికిన చిత్రం ‘మంచిమనసులు’. సావిత్రి, కృష్ణకుమారి నాయికలు నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ‘మంచి మనసులు’ చిత్రంతోనే కేవీ మహదేవన్…
ఏదైనా శుభకార్యం ఆరంభించే ముందు ‘శ్రీరామజయం’ అని రాయడం తెలుగువారికి ఓ సంప్రదాయం. అదే తీరున తెలుగు చిత్రసీమలోనూ శ్రీరామనామమే విజయగీతం పాడించింది. మన భారతదేశంలో రూపొందిన తొలి టాకీ చిత్రంగా ‘ఆలమ్ ఆరా’ నిలచింది. ఈ సినిమా 1931 మార్చి 14న విడుదలయింది. మంచి విజయం సాధించింది. అందువల్ల ఆ చిత్ర నిర్మాత, దర్శకుడు దక్షిణాదిన కూడా ఓ సినిమా నిర్మించాలని సంకల్పించారు. ఆ సంకల్పానికి ఆయన అసోసియేట్ గా ఉన్న తెలుగువారయిన హెచ్.ఎమ్.రెడ్డి కూడా…
(ఏప్రిల్ 2తో ‘బంగారు కానుక’కు 40 ఏళ్ళు) నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, శ్రీదేవి జంటగా నటించిన చిత్రాలలో ఎవర్ గ్రీన్ అంటే ‘ప్రేమాభిషేకం’ చిత్రమే! ఆ సినిమా ఘనవిజయం సాధించిన తరువాత ఏయన్నార్, శ్రీదేవి కాంబోలో మరికొన్ని చిత్రాలు వెలుగు చూశాయి. అయితే అవేవీ ‘ప్రేమాభిషేకం’ స్థాయిలో అలరించలేక పోయాయి. ‘ప్రేమాభిషేకం’ తరువాత ఏయన్నార్, శ్రీదేవి నటించిన చిత్రాలు వచ్చాయి. కానీ, వాటిలో వారిద్దరూ జంటగా నటించిన చిత్రం ‘ప్రేమకానుక’. ఆ సినిమా తరువాత వచ్చిన చిత్రం…