మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణించిన చార్టర్డ్ విమానం ‘లియర్ జెట్ 45’ (Learjet 45) బొంబార్డియర్ సంస్థకు చెందినది. ఈ సంస్థ తయారుచేసే గ్లోబల్ సిరీస్, ఛాలెంజర్ సిరీస్ విమానాలు ప్రపంచవ్యాప్తంగా విలాసానికి, వేగానికి మారుపేరు. అందుకే ప్రపంచంలోని అత్యంత ధనవంతులు తమ ప్రయాణాల కోసం ఈ జెట్లనే ఎంచుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వ్యాపారవేత్తలు, సినీ తారలు , రాజకీయ నాయకులు బొంబార్డియర్ విమానాలను సొంతంగా కలిగి ఉన్నారు లేదా లీజుకు తీసుకుని వాడుతుంటారు.
ఎవరెవరి దగ్గర ఈ విమానాలు ఉన్నాయి?
బొంబార్డియర్ విమానాల ప్రత్యేకతలేంటి?
లియర్ జెట్ 45 , భద్రత
అజిత్ పవార్ ప్రయాణించిన లియర్ జెట్ 45 అనేది బొంబార్డియర్ గ్రూపులోనే అత్యంత పాపులర్ అయిన బిజినెస్ జెట్. ఇది సాధారణంగా చిన్న రన్వేలపై కూడా ల్యాండ్ అవ్వగలదు. అయితే, బారామతిలో జరిగిన ప్రమాదానికి సాంకేతిక లోపమే కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటన తర్వాత వివిఐపిలు వాడే ప్రైవేట్ జెట్ల భద్రతా ప్రమాణాలపై మరోసారి చర్చ మొదలైంది.