Ajit Pawar : అజిత్ పవార్ విమానాన్ని నడిపిన పైలట్లు వీరే.. కెప్టెన్ సుమిత్ , శాంభవి పాఠక్..!
- అజిత్ పవార్ ప్రయాణించిన విమానం పైలట్లే ఫోకస్
- వివీఐపీ ఫ్లైట్కు సేవలందించిన కెప్టెన్ సుమిత్
- ఫస్ట్ ఆఫీసర్ శాంభవి పాఠక్ ప్రతిభకు ప్రశంసలు
- వైరల్ అవుతున్న అజిత్ పవార్ గ్రూప్ ఫోటోలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబై నుంచి బారామతికి బయలుదేరిన అజిత్ పవార్ విమానం ఉదయం 8:45 – 9:15 గంటల మధ్య ప్రమాదానికి గురైంది. బారామతి విమానాశ్రయ రన్వేపై దిగడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో విమానంలో తీవ్రమైన సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానం రన్వేకు బదులుగా సమీపంలోని పొలాల్లోకి దూసుకెళ్లి భూమిని బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే విమానం ముక్కలుగా విరిగిపోవడంతో పాటు భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘోర ప్రమాదంలో అజిత్ పవార్తో పాటు ఆయన వ్యక్తిగత సహాయకుడు (PA) విదిప్ జాదవ్, ఒక సెక్యూరిటీ ఆఫీసర్, , విమానాన్ని నడిపిన ఇద్దరు పైలట్లు అక్కడికక్కడే మరణించినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) అధికారికంగా ధృవీకరించింది.
ఈ విమానాన్ని అత్యంత అనుభవజ్ఞుడైన కెప్టెన్ సుమిత్ కపూర్ ప్రధాన పైలట్గా నడిపించగా, ఫస్ట్ ఆఫీసర్ శాంభవి పాఠక్ సహా పైలట్గా వ్యవహరించారు. ముంబై విశ్వవిద్యాలయంలో ఏవియేషన్ అభ్యసించిన శాంభవి, న్యూజిలాండ్లో అంతర్జాతీయ శిక్షణ పొంది 2022 నుండి ఈ సంస్థలో పనిచేస్తున్నారు. వీరితో పాటు పింకీ మాలి విమాన సహాయకురాలిగా విధులు నిర్వహించారు. ప్రమాదానికి గురైన ఈ లియర్జెట్ 45 విమానం (VT-SSK) ఢిల్లీకి చెందిన VSR వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు చెందినది. 2011లో స్థాపించబడిన ఈ సంస్థ గతంలో కూడా 2023 సెప్టెంబర్ 14న ముంబైలో ఒక విమాన ప్రమాదాన్ని ఎదుర్కోవడం గమనార్హం.
Also Read
- Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
- Siddaramaiah: డీకేకు చెక్ పెట్టాలని సిద్ధరామయ్య ప్లాన్.. హైకమాండ్ షాక్
- Congress: భారత్పై నెతన్యాహూ ప్రశంసలు.. మోడీపై కాంగ్రెస్ విమర్శలు..
- Trinamool Congress: ‘‘ముస్లింల కోసమే పనిచేసింది’’.. టీఎంసీ పార్టీ చీఫ్ రాజీనామా..
విమానం కూలిన సమాచారం అందిన వెంటనే స్థానిక అధికారులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. అయితే మంటలు తీవ్రంగా ఉండటంతో విమానం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకోవడానికి DGCA ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. సాంకేతిక లోపం వల్ల ప్రమాదం జరిగిందా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. అజిత్ పవార్ మృతితో మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక శకం ముగిసినట్లయింది, రాష్ట్రవ్యాప్తంగా విషాద ఛాయలు అలముకున్నాయి.
Ajit Pawar: ‘‘రన్ వే కనిపించడం లేదు’’.. అజిత్ పవార్ చివరి క్షణాల్లో నాటకీయ పరిణామాలు..
తాజావార్తలు
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
-
CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
-
Ravindra Jadeja: రవీంద్ర జడేజాకు ఏమైంది.. మ్యాచ్ మధ్యలో ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది..?
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..