Ajit Pawar : అజిత్ పవార్ విమానాన్ని నడిపిన పైలట్లు వీరే.. కెప్టెన్ సుమిత్ , శాంభవి పాఠక్..!
- అజిత్ పవార్ ప్రయాణించిన విమానం పైలట్లే ఫోకస్
- వివీఐపీ ఫ్లైట్కు సేవలందించిన కెప్టెన్ సుమిత్
- ఫస్ట్ ఆఫీసర్ శాంభవి పాఠక్ ప్రతిభకు ప్రశంసలు
- వైరల్ అవుతున్న అజిత్ పవార్ గ్రూప్ ఫోటోలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబై నుంచి బారామతికి బయలుదేరిన అజిత్ పవార్ విమానం ఉదయం 8:45 – 9:15 గంటల మధ్య ప్రమాదానికి గురైంది. బారామతి విమానాశ్రయ రన్వేపై దిగడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో విమానంలో తీవ్రమైన సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానం రన్వేకు బదులుగా సమీపంలోని పొలాల్లోకి దూసుకెళ్లి భూమిని బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే విమానం ముక్కలుగా విరిగిపోవడంతో పాటు భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘోర ప్రమాదంలో అజిత్ పవార్తో పాటు ఆయన వ్యక్తిగత సహాయకుడు (PA) విదిప్ జాదవ్, ఒక సెక్యూరిటీ ఆఫీసర్, , విమానాన్ని నడిపిన ఇద్దరు పైలట్లు అక్కడికక్కడే మరణించినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) అధికారికంగా ధృవీకరించింది.
ఈ విమానాన్ని అత్యంత అనుభవజ్ఞుడైన కెప్టెన్ సుమిత్ కపూర్ ప్రధాన పైలట్గా నడిపించగా, ఫస్ట్ ఆఫీసర్ శాంభవి పాఠక్ సహా పైలట్గా వ్యవహరించారు. ముంబై విశ్వవిద్యాలయంలో ఏవియేషన్ అభ్యసించిన శాంభవి, న్యూజిలాండ్లో అంతర్జాతీయ శిక్షణ పొంది 2022 నుండి ఈ సంస్థలో పనిచేస్తున్నారు. వీరితో పాటు పింకీ మాలి విమాన సహాయకురాలిగా విధులు నిర్వహించారు. ప్రమాదానికి గురైన ఈ లియర్జెట్ 45 విమానం (VT-SSK) ఢిల్లీకి చెందిన VSR వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు చెందినది. 2011లో స్థాపించబడిన ఈ సంస్థ గతంలో కూడా 2023 సెప్టెంబర్ 14న ముంబైలో ఒక విమాన ప్రమాదాన్ని ఎదుర్కోవడం గమనార్హం.
Also Read
- Nitin Gadkari: E20 పెట్రోల్ వల్ల ఒక్క కారైనా పాడైందా?.. విమర్శకులపై కేంద్ర మంత్రి గడ్కరీ ఫైర్..
- Awiqli Insulin India: మధుమేహ రోగుల కష్టాలు తీరినట్టే.. భారత్లో తొలి ఇన్సులిన్ 'Awiqli' విడుదల.. వారానికి ఒక్కసారి చాలు!
- Daughter Kills Mother: మానవత్వం మరిచిన కూతురు.. ఆస్తి, ప్రభుత్వ ఉద్యోగం కోసం కన్నతల్లినే చంపిన కుమార్తె..
- Explainer: ప్రమాదంలో పశ్చిమ కనుమలు...ఇంతటి విలయానికి అదే కారణమా...?
విమానం కూలిన సమాచారం అందిన వెంటనే స్థానిక అధికారులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. అయితే మంటలు తీవ్రంగా ఉండటంతో విమానం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకోవడానికి DGCA ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. సాంకేతిక లోపం వల్ల ప్రమాదం జరిగిందా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. అజిత్ పవార్ మృతితో మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక శకం ముగిసినట్లయింది, రాష్ట్రవ్యాప్తంగా విషాద ఛాయలు అలముకున్నాయి.
Ajit Pawar: ‘‘రన్ వే కనిపించడం లేదు’’.. అజిత్ పవార్ చివరి క్షణాల్లో నాటకీయ పరిణామాలు..
తాజావార్తలు
-
Polavaram Project: పోలవరం ప్రాజెక్టుకు వరద ఉధృతి.. కొట్టుకుపోయిన పైపులు..
-
Toxic: టాక్సిక్ అంతా ఇంతేనా?
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియలు వాయిదా.. కారణమిదేనా?
-
Chiranjeevi: వయసు 70.. ప్యాషన్ మాత్రం 25.. హ్యాట్సాఫ్ చిరు!
-
Abhishek Sharma: “గర్ల్ఫ్రెండ్” అంటూ ప్రచారం.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన అభిషేక్ శర్మ.. కట్చేస్తే..
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!