World Most Polluted Cities: కాలుష్య కోరల్లో భారతీయులు.. మొదటి 20 నగరాల్లో 13 భారత్ లోనే
- కాలుష్య కోరల్లో ఇండియన్స్.
- ప్రపంచ మొదటి 20 నగరాల లిస్ట్ లో 13 భారత్ లోని నగరాలే.
- అస్సాంలోని బర్నిహాట్ నగరం భారత్ లోనే అత్యంత కాలుష్య నగరంగా గుర్తింపు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
World Most Polluted Cities: ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్య స్థాయిలను పరిశీలించే స్విస్ వాయు నాణ్యత టెక్నాలజీ సంస్థ (IQAir) ఇటీవల విడుదల చేసిన 2024 ప్రపంచ వాయు నాణ్యత నివేదిక ప్రకారం.. అస్సాంలోని బర్నిహాట్ (Byrnihat) నగరం భారత్ లోనే అత్యంత కాలుష్య నగరంగా గుర్తింపు పొందింది. ఈ నివేదిక ప్రకారం.. భారతదేశం ప్రపంచంలో ఐదవ అత్యంత కాలుష్య దేశంగా నిలిచింది. ముఖ్యంగా, భారతదేశంలోని నగరాల్లో సూక్ష్మ ధూళి రేణువుల స్థాయి PM2.5లు చాలా అధికంగా నమోదయ్యాయి. అయితే, 2024లో భారతదేశంలో ఈ PM2.5 స్థాయిలు 7% తగ్గాయి. 2023లో 54.4 మైక్రోగ్రామ్లు ఉన్న ఈ స్థాయి, 2024లో 50.6 మైక్రోగ్రామ్లకు తగ్గింది.
Read Also: Champions Trophy 2025: అతడే అసలైన హీరో.. ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ ఇవ్వాల్సింది: అశ్విన్
Also Read
- Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
- Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలపై వైద్యశాఖ భారీ కసరత్తు.. 1,110 వైద్య శిబిరాలు, 30 ఫీల్డ్ ఆస్పత్రులు..
- Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
- Vijayawada Crime: స్నాప్లో పరిచయం.. చనిపోతానంటూ బెదిరింపులు.. యువతి నుంచి రూ.1.38 కోట్లు వసూలు
IQAir నివేదిక ప్రకారం, 2024లో ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల్లో భారతదేశం 5వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో చాడ్, రెండవ స్థానంలో బంగ్లాదేశ్, మూడవ స్థానంలో పాకిస్తాన్, నాల్గవ స్థానంలో కాంగో ఉన్నాయి. అలాగే భారతదేశ రాజధాని న్యూఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధాని నగరంగా మరోసారి నిలిచింది. ఢిల్లీలో 2024లో సగటు వార్షిక PM2.5 స్థాయి 91.6 మైక్రోగ్రామ్లుగా నమోదైంది. ఇది 2023లో నమోదైన 92.7 మైక్రోగ్రామ్లతో పోలిస్తే కాస్త మెరుగైంది. ఇకపోతే, ప్రపంచవ్యాప్తంగా అత్యంత కాలుష్య నగరాల్లో టాప్ 20 నగరాల్లో 13 భారతదేశ నగరాలు ఉన్నాయి. వీటిలో బర్నిహాట్, ఢిల్లీ, ముల్లన్పూర్ (పంజాబ్), ఫరీదాబాద్, లోని, న్యూఢిల్లీ, గురుగ్రామ్, గంగానగర్, గ్రేటర్ నోయిడా, భివాడి, ముజఫర్నగర్, హనుమాన్గఢ్, నోయిడా లు ఉన్నాయి.
Read Also: JioHotstar: 90 రోజులకు కేవలం రూ.100కే జియో హాట్స్టార్ ప్లాన్..
భారతదేశంలో 35% నగరాలు WHO పరిమితికి (5 మైక్రోగ్రామ్లు) కంటే 10 రెట్లు ఎక్కువ PM2.5 స్థాయిలను నమోదు చేశాయి. వాయు కాలుష్యం కారణంగా భారతదేశ ప్రజల జీవితకాలం సగటున 5.2 సంవత్సరాలు తగ్గుతోందని నివేదిక వెల్లడించింది. 2009 నుండి 2019 వరకు ప్రతి ఏడాదికి 15 లక్షల మరణాలు PM2.5 కాలుష్య ప్రభావంతో సంభవించాయని ఓ పత్రిక అధ్యయనంలో పేర్కొంది. వాహనాల ఎమిషన్లు, పరిశ్రమల పొగలు, చెరకు లేదా గడ్డి దహనం వంటి అంశాలు PM2.5 స్థాయిలను పెంచుతున్నాయని నివేదిక చెబుతోంది.
తాజావార్తలు
-
Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
-
Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలపై వైద్యశాఖ భారీ కసరత్తు.. 1,110 వైద్య శిబిరాలు, 30 ఫీల్డ్ ఆస్పత్రులు..
-
Pluto OTT: తాగుడుకు బానిస అయ్యే ఏలియన్.. ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సైన్స్ ఫిక్షన్ మూవీ
-
BethlehemKudumbaUnit : తెలుగులో విడుదలవుతున్న నివిన్ పౌలి లేటెస్ట్ బ్లాక్బస్టర్ ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
ట్రెండింగ్
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!