World Most Polluted Cities: కాలుష్య కోరల్లో భారతీయులు.. మొదటి 20 నగరాల్లో 13 భారత్ లోనే
- కాలుష్య కోరల్లో ఇండియన్స్.
- ప్రపంచ మొదటి 20 నగరాల లిస్ట్ లో 13 భారత్ లోని నగరాలే.
- అస్సాంలోని బర్నిహాట్ నగరం భారత్ లోనే అత్యంత కాలుష్య నగరంగా గుర్తింపు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
World Most Polluted Cities: ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్య స్థాయిలను పరిశీలించే స్విస్ వాయు నాణ్యత టెక్నాలజీ సంస్థ (IQAir) ఇటీవల విడుదల చేసిన 2024 ప్రపంచ వాయు నాణ్యత నివేదిక ప్రకారం.. అస్సాంలోని బర్నిహాట్ (Byrnihat) నగరం భారత్ లోనే అత్యంత కాలుష్య నగరంగా గుర్తింపు పొందింది. ఈ నివేదిక ప్రకారం.. భారతదేశం ప్రపంచంలో ఐదవ అత్యంత కాలుష్య దేశంగా నిలిచింది. ముఖ్యంగా, భారతదేశంలోని నగరాల్లో సూక్ష్మ ధూళి రేణువుల స్థాయి PM2.5లు చాలా అధికంగా నమోదయ్యాయి. అయితే, 2024లో భారతదేశంలో ఈ PM2.5 స్థాయిలు 7% తగ్గాయి. 2023లో 54.4 మైక్రోగ్రామ్లు ఉన్న ఈ స్థాయి, 2024లో 50.6 మైక్రోగ్రామ్లకు తగ్గింది.
Read Also: Champions Trophy 2025: అతడే అసలైన హీరో.. ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ ఇవ్వాల్సింది: అశ్విన్
Also Read
- 600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
- Raj Kachori Recipe: ఇంట్లోనే హల్వాయి స్టైల్ రాజ్ కచోరీ.. కరకరలాడే రుచితో నోరూరించే స్పెషల్ చాట్!
- IPL 2026 Celebration: బిగ్ షాక్.. ఆటలో పేపర్ ముక్క తీసి చూపించే ట్రెండ్కు ఫుల్ స్టాప్..?
- Virat Kohli: "నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు".. వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిపడేశాడుగా.!
IQAir నివేదిక ప్రకారం, 2024లో ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల్లో భారతదేశం 5వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో చాడ్, రెండవ స్థానంలో బంగ్లాదేశ్, మూడవ స్థానంలో పాకిస్తాన్, నాల్గవ స్థానంలో కాంగో ఉన్నాయి. అలాగే భారతదేశ రాజధాని న్యూఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధాని నగరంగా మరోసారి నిలిచింది. ఢిల్లీలో 2024లో సగటు వార్షిక PM2.5 స్థాయి 91.6 మైక్రోగ్రామ్లుగా నమోదైంది. ఇది 2023లో నమోదైన 92.7 మైక్రోగ్రామ్లతో పోలిస్తే కాస్త మెరుగైంది. ఇకపోతే, ప్రపంచవ్యాప్తంగా అత్యంత కాలుష్య నగరాల్లో టాప్ 20 నగరాల్లో 13 భారతదేశ నగరాలు ఉన్నాయి. వీటిలో బర్నిహాట్, ఢిల్లీ, ముల్లన్పూర్ (పంజాబ్), ఫరీదాబాద్, లోని, న్యూఢిల్లీ, గురుగ్రామ్, గంగానగర్, గ్రేటర్ నోయిడా, భివాడి, ముజఫర్నగర్, హనుమాన్గఢ్, నోయిడా లు ఉన్నాయి.
Read Also: JioHotstar: 90 రోజులకు కేవలం రూ.100కే జియో హాట్స్టార్ ప్లాన్..
భారతదేశంలో 35% నగరాలు WHO పరిమితికి (5 మైక్రోగ్రామ్లు) కంటే 10 రెట్లు ఎక్కువ PM2.5 స్థాయిలను నమోదు చేశాయి. వాయు కాలుష్యం కారణంగా భారతదేశ ప్రజల జీవితకాలం సగటున 5.2 సంవత్సరాలు తగ్గుతోందని నివేదిక వెల్లడించింది. 2009 నుండి 2019 వరకు ప్రతి ఏడాదికి 15 లక్షల మరణాలు PM2.5 కాలుష్య ప్రభావంతో సంభవించాయని ఓ పత్రిక అధ్యయనంలో పేర్కొంది. వాహనాల ఎమిషన్లు, పరిశ్రమల పొగలు, చెరకు లేదా గడ్డి దహనం వంటి అంశాలు PM2.5 స్థాయిలను పెంచుతున్నాయని నివేదిక చెబుతోంది.
తాజావార్తలు
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Raj Kachori Recipe: ఇంట్లోనే హల్వాయి స్టైల్ రాజ్ కచోరీ.. కరకరలాడే రుచితో నోరూరించే స్పెషల్ చాట్!
-
IPL 2026 Celebration: బిగ్ షాక్.. ఆటలో పేపర్ ముక్క తీసి చూపించే ట్రెండ్కు ఫుల్ స్టాప్..?
-
‘DC’ : క్రిమినల్స్ లవ్ స్టోరీతో వస్తున్న లోకేష్ కనగరాజ్..‘DC’ ట్రైలర్ వైరల్
-
Pradeep :తల్లిదండ్రులకు తెలియకుండా పదేళ్ల పోరాటం.. ‘తిమ్మరాజుపల్లి టీవీ’ రాజప్ప రియల్ స్టోరీ ఇదే!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..