Ahmedabad Tragedy: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంతో దేశవ్యాప్తంగా విషాదం నెలకొంది. లండన్ వెళ్తున్న బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం టేకాఫ్ అయిన 35 సెకన్లలోనే కుప్పకూలింది. పటిష్టమైన భద్రతా ప్రమాణాలకు పేరుగాంచిన డ్రీమ్ లైనర్ ఇలా కూలిపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
Lone survivor: ఎయిరిండియా విమానం ప్రమాదం అనేక కుటుంబాల్లో విషాదం నింపింది. ఈ ఘటన పట్ల యావత్ దేశంతో పాటు ప్రపంచ దేశాలు సంతాపాన్ని వ్యక్తం చేశాయి. గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన విమానం, టేకాఫ్ అయిన క్షణాల్లోనే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 242 మందిలో ఒక్కరు మినహా అందరూ మరణించారు. విమానం మెడికల్ కాలేజ్ హస్టల్పై కూలడంతో 24 మంది మెడికోలు చనిపోయారు.
Air India plane crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఘోర విషాదాన్ని నింపింది. లండన్ వెళ్తున్న ఎయిరిండియాకు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం గురువారం మధ్యాహ్నం కుప్పకూలింది. టేకాఫ్ అయిన 33 క్షణాల్లోనే కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 242 మందిలో 241 మంది మరణించారు. ఒక్కరు మాత్రమే ప్రాణాలతో మిగిలారు. ఫ్లైట్ మెడికల్ హాస్టల్ పై కూలిపోవడంతో 24 మంది మెడికోలు మరణించారు. అయితే, క్షణాల్లోనే విమానం ఎలా కూలిపోయిందనే దానిపై…
Air India Plane Crash: అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదాన్ని విచారణ జరిపేందుకు బ్రిటిష్ ఏజెన్సీ భారత్కి రాబోతోంది. సివిల్ విమాన ప్రమాదాలు, తీవ్రమైన సంఘటనలు పరిశోధించే ‘‘ ది ఎయిర్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్(AAIB) ఈ ప్రమాద దర్యాప్తులో పాల్గొనబోతోంది. భారతదేశ నేతృత్వంలోని దర్యాప్తుకు మద్దతు ఇవ్వడానికి ఈ బృందాన్ని పంపిస్తున్నట్లు యూకే చెప్పింది.
లిఫ్ట్ అనేది విమానం రెక్కల ద్వారా ఉత్పన్నమయ్యే శక్తి. ఇది విమానం పైకి వెళ్లేందుకు సహాయపడుతుంది. బరువు అనేది గురుత్వాకర్షణ శక్తి ద్వారా కిందకు లాగబడుతుంది. ఇక థ్రస్ట్ విమానం ఇంజన్ల ద్వారా వస్తుంది. డ్రాగ్ అనేది విమానం గాలిలో ప్రయాణిస్తున్నప్పుడు ఎదుర్కునే నిరోధకత. విమానం గాలిలోకి ఎగరాలంటే బరువు కన్నా లిఫ్ట్ అధికంగా ఉండాలి. డ్రాగ్ కన్నా థ్రస్ట్ అధికంగా ఉండాలి.
Ahmedabad plane crash: ఇటీవల కాలంలో ఎప్పుడూ చూడని ఘోర విమాన ప్రమాదం అహ్మదాబాద్లో సంభవించింది. ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం కూలిపోయింది. గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి లండన్కు బయలుదేరిన విమానం, టేకాఫ్ అయిన వెంటనే ప్రమాదానికి గురైంది.
Vijay Rupani: అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం తీవ్ర విషాదానికి కారణమైంది. గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి లండన్కి బయలుదేరిన ఎయిర్ ఇండియా 787-8 డ్రీమ్ లైనర్ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదం సమయంలో 242 మంది విమానంలో ఉన్నారు. ఒక్కరు మినహా విమానంలో ప్రయాణిస్తున్న వారంతా మరణించారు. మరణించిన వారిలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారు. ఆయన మరణాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్ ధ్రువీకరించారు.
Bird Hit: అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే కుప్పకూలింది. ఇందులో ప్రయాణిస్తున్న 242 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఇంకా అధికారిక ధ్రువీకరణ రావాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే, ఇప్పుడు విమాన ప్రమాదానికి కారణాలు ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే ఇలా ఎలా కూలిపోయిందనే దానిపై పలువురు వైమానిక రంగ విశ్లేషకులు అంచనా…
Black Box: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చాలా మరణాలు సంభవించే అవకాశం ఉందని ప్రభుత్వం వెల్లడించింది. లండన్కి వెళ్తున్న ఎయిర్ ఇండియా 787-8 డ్రీమ్ లైనర్ విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే కుప్పకూలింది. వేగంగా నేలను ఢీకొట్టడంతో విమానంలో పేలుడు సంభవించి, మంటలు అంటుకున్నాయి. అయితే, ఇప్పుడు ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు ప్రారంభమైంది.
Air India Plane Crash: ఎయిరిండియా 787-8 డ్రీమ్ లైనర్ విమాన ప్రమాదం అందరిని కలచివేస్తోంది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఈ విమానంలో నిమిషాల్లోనే కుప్పకూలింది. ఒక్కసారిగా నేలను ఢీ కొట్టడంతో విమానం అగ్నిగుండాన్ని తలపించింది. ఈ ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ఉన్నారు. వీరిలో 100కు పైగా మరణించినట్లు తెలుస్తోంది. అయితే, మరణాల వివరాలను ఇంకా అధికారులు ధ్రువీకరించలేదు.