Bird Hit: పక్షి ఢీకొనడం వల్లే ఎయిరిండియా ప్రమాదం జరిగిందా..? నిపుణుల విశ్లేషణ..
- అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్పై నిపుణుల విశ్లేషణ..
- పక్షి ఢీ కొనడం వల్లే ఇంజన్లు ఫెయిల్యూర్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bird Hit: అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే కుప్పకూలింది. ఇందులో ప్రయాణిస్తున్న 242 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఇంకా అధికారిక ధ్రువీకరణ రావాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే, ఇప్పుడు విమాన ప్రమాదానికి కారణాలు ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే ఇలా ఎలా కూలిపోయిందనే దానిపై పలువురు వైమానిక రంగ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Read Also: Air India Flight Crash Live Updates : కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమానం.. 242 మంది మృతి!
Also Read
- August New Rules 2026: రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు.. ప్రతి ఇంటి బడ్జెట్పై ప్రభావం చూపే 10 మార్పులు..
- Cauvery Dispute: కావేరీ వివాదం మళ్లీ వేడెక్కింది.. సీఎం విజయ్తో డీకే శివకుమార్ భేటీ వాయిదా
- Kulgam: కుల్గామ్లో ఉగ్ర దాడి.. వలస కార్మికుడు మృతి
- Saayoni Ghosh: పార్లమెంట్ను అడ్డుకోవడం భావ్యం కాదు.. టీఎంసీ రెబల్ సాయోని ఘోష్ ఆగ్రహం
మాజీ సీనియర్ పైటల్ కెప్టెన్ సౌరభ్ భట్నాగర్ ప్రకారం, ప్రాథమికి పక్షులు ఢీకొట్టడం వల్ల రెండు ఇంజన్లు శక్తిని కోల్పోయినట్లు కనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. టేకాఫ్ బాగానే ఉంది, ల్యాండింగ్ గేర్ పైకి లేపడానికి ముందే, విమానం కిందకు దిగుతున్నట్లు కనిపించింది. ఇది ఇంజన్ ఫెయిల్యూర్ని సూచిస్తోంది. విమానానికి లిఫ్ట్కు కావాల్సిన శక్తి లేకపోవడం వల్లే ఇది జరిగినట్లు తెలుస్తోంది. అయితే, దర్యాప్తు తర్వాతే స్పష్టమైన కారణాలు తెలుస్తాయని అన్నారు. వైరల్ అవుతున్న ఫుటేజ్ ప్రకారం, టేకాఫ్ అసమానంగా జరిగినట్లు కనిపిస్తోంది. విమానం అనియంత్రితంగా కిందకు వచ్చింది, దీంతో పైలట్ మేడే కాల్ చేసినట్లు తెలుస్తోందని ఆయన చెప్పారు.
విమానయాన నిపుణుడు సంజయ్ లాజర్ కూడా ఇదే విషయాన్ని అంగీకరించారు. విమానం టేకాఫ్ అయ్యే శక్తి లేకపోవడం ప్రమాదానికి కారణంగా కనిపిస్తోందని, టేకాఫ్ సమయంలో పక్షలు ఢీకొట్టి ఉంటే, ఇదే జరిగితే 6-7 నిమిషాల తర్వాత పడిపోవడం ప్రారంభమై ఉండొచ్చని అంచనా వేశారు. ఇది చాలా కొత్త విమానం అని చెబుతూనే, 11 ఏళ్ల విమానం కాబట్టి సాంకేతిక సమస్యలు ఉండే అవకాశాలు తక్కువగా అని చెప్పారు.
తాజావార్తలు
-
Off The Record: సొంత పార్టీ నేతలకు కేతిరెడ్డి బ్యాడ్ మార్నింగ్?
-
West Indies: వ్యక్తిగత కారణాలతోనే దూరం.. క్రికెట్ వెస్టిండీస్ ప్రకటనను గుర్తుచేసిన పేసర్..
-
August New Rules 2026: రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు.. ప్రతి ఇంటి బడ్జెట్పై ప్రభావం చూపే 10 మార్పులు..
-
Tablet Launched: 10,100mAh బ్యాటరీ, కాగితం లాంటి డిస్ప్లే.. అదిరిపోయిన ఫీచర్స్..
-
Cauvery Dispute: కావేరీ వివాదం మళ్లీ వేడెక్కింది.. సీఎం విజయ్తో డీకే శివకుమార్ భేటీ వాయిదా
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!