గుజరాత్లోని అహ్మదాబాద్లో గురువారం జరిగిన ఘోర విమాన ప్రమాదంపై యునైటెడ్ కింగ్డమ్ విచారం వ్యక్తం చేసింది. 242 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్కు వెళుతుండగా బయలుదేరిన కొద్దిసేపటికే కూలిపోయింది. యునైటెడ్ కింగ్డమ్ ప్రధాన మంత్రి కైర్ స్టార్మర్ బాధిత కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. కైర్ స్టార్మర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. “చాలా మంది బ్రిటిష్ జాతీయులతో లండన్ వెళ్తున్న విమానం భారత్ లోని అహ్మదాబాద్…
Black Box: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చాలా మరణాలు సంభవించే అవకాశం ఉందని ప్రభుత్వం వెల్లడించింది. లండన్కి వెళ్తున్న ఎయిర్ ఇండియా 787-8 డ్రీమ్ లైనర్ విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే కుప్పకూలింది. వేగంగా నేలను ఢీకొట్టడంతో విమానంలో పేలుడు సంభవించి, మంటలు అంటుకున్నాయి. అయితే, ఇప్పుడు ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు ప్రారంభమైంది.
Air India Flight Crash Live Updates : అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో గురువారం మధ్యాహ్నం ఘోరమైన విమాన ప్రమాదం చోటుచేసుకుంది. అహ్మదాబాద్ నుంచి లండన్కు వెళ్లే ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే తక్కువ ఎత్తులో విహరించి, మేఘానీనగర్లోని ఘోడాసర్ క్యాంప్ సమీపంలో నివాస ప్రాంతాల్లో కూలిపోయింది. విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు పేర్కొంటున్నారు. అందులో పలువురు వీఐపీలు కూడా ఉన్నట్లు సమాచారం. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి…
చరిత్రలో మరిచిపోలేని విషాదకరమైన రోజు. 242 ప్రయాణికులతో గాల్లోకి ఎగిరిన ఎయిర్ ఇండియా విమానం నిమిషాల్లోనే కుప్పకూలిపోయింది. ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే కూలిపోయింది. మేఘనినగర్ సమీపంలో ఓ మెడికల్ కాలేజీ భవనంపై క్రాష్ అయ్యింది. క్షణాల్లోనే మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 242 మంది మృతి చెందినట్లు సమాచారం. విమానంలో ప్రయాణిస్తున్న వారంతా మృతి చెందారని.. విమానంలో ఉన్నవారెవరూ బతికిఉండే అవకాశమే లేదని అహ్మదాబాద్ సీపీ జ్ఞానేంద్ర…
Air India Plane Crash: ఎయిరిండియా 787-8 డ్రీమ్ లైనర్ విమాన ప్రమాదం అందరిని కలచివేస్తోంది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఈ విమానంలో నిమిషాల్లోనే కుప్పకూలింది. ఒక్కసారిగా నేలను ఢీ కొట్టడంతో విమానం అగ్నిగుండాన్ని తలపించింది. ఈ ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ఉన్నారు. వీరిలో 100కు పైగా మరణించినట్లు తెలుస్తోంది. అయితే, మరణాల వివరాలను ఇంకా అధికారులు ధ్రువీకరించలేదు.
Ahmedabad plane crash: ఎయిరిండియా నడుపుతున్న బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ అహ్మదాబాద్ విమానాశ్రయానికి సమీపంలో కుప్పకూలింది. అహ్మదాబాద్ నుంచి లండన్కి బయలుదేరిన ఈ విమానంలో 242 మంది ఉన్నారు. టేకాఫ్ అయిన నిమిషాల్లోనే ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో వందకు పైగా ప్రయాణికులు మరణించినట్లు తెలుస్తోంది. విమానం కుప్పకూలే ముందు సమీపంలోని డాక్టర్స్ హాస్టల్ని ఢీకొట్టింది.
అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికరం అని డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారు. అహ్మదాబాద్ లో చోటు చేసుకున్న విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. 242 మందితో లండన్ బయలుదేరిన విమానం – టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోవడాన్ని ఊహించలేకున్నాము. వైద్య కళాశాల వసతి భవనాలపై కూలడంతో ఒక మహా విషాదంగా మిగిలింది. ఈ దుర్ఘటనలో మృతులకు దేశం బాసటగా ఉండాల్సిన సమయం ఇది అని పవన్ కళ్యాణ్ ఒక…
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం భారత్ తో పాటు ప్రపంచ దేశాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. 242 మంది ప్రయాణిస్తున్న విమానం క్షణాల్లోనే క్రాష్ అయి మంటల్లో చిక్కుకుని కాలిబూదిదైపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటికే 130 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. కొందరు ఘటనా స్థలంలోనే సజీవ దహనమయ్యారు. ప్రమాద సమయంలో భారతీయులతో పాటు విదేశీయులు సైతం భారీగానే ఉన్నారు. ఈ విమానంలో దాదాపు 53 మంది బ్రిటిష్ జాతీయులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో…
Aircraft Crashes: ఎయిరిండియా విమాన ప్రమాదం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిరిండియా 787-8 డ్రీమ్ లైనర్ విమానం కుప్పకూలింది. ప్రమాదం సమయంలో 242 మంది విమానంలో ఉన్నారు. ఈ ప్రమాదంలో వందలాది మంది చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.
Boeing: ఎయిరిండియా 787-8 డ్రీమ్ లైనర్ కుప్పకూలింది. ప్రయాణికులు, సిబ్బందితో కలిపిన 242 మందితో అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే కూలిపోయింది. ఈ ప్రమాదం తర్వాత మరోసారి బోయింగ్ విమానాల భద్రతలపై ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ భద్రత, నాణ్యత, నియంత్రణ సమస్యలపై మరోసారి వివాదం మొదలైంది.