Air India Plane Crash: విమాన ప్రమాదంపై వరల్డ్ లీడర్స్ స్పందన.. ఎవరేమన్నారంటే?
- అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం
- విమాన ప్రమాదంపై వరల్డ్ లీడర్స్ స్పందన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుజరాత్లోని అహ్మదాబాద్లో గురువారం జరిగిన ఘోర విమాన ప్రమాదంపై యునైటెడ్ కింగ్డమ్ విచారం వ్యక్తం చేసింది. 242 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్కు వెళుతుండగా బయలుదేరిన కొద్దిసేపటికే కూలిపోయింది. యునైటెడ్ కింగ్డమ్ ప్రధాన మంత్రి కైర్ స్టార్మర్ బాధిత కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. కైర్ స్టార్మర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. “చాలా మంది బ్రిటిష్ జాతీయులతో లండన్ వెళ్తున్న విమానం భారత్ లోని అహ్మదాబాద్ నగరంలో కూలిపోతున్న దృశ్యాలు వినాశకరమైనవి” అని రాసుకొచ్చారు. విమానంలో ప్రయాణించిన వారి కుటుంబాలకు ఆయన సానుభూతిని వ్యక్తం చేశారు.
Also Read
- CM Chandrababu: సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. పొదుపు చర్యలపై సంచలన నిర్ణయాలు తప్పవా..?
- 8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
- Crude Oil Prices: ప్రభుత్వ చమురు సంస్థలకు రోజూ రూ.1,000 కోట్ల నష్టం!.. పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు తప్పదా?
- Rangasamy: ఐదవసారి పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా రంగస్వామి ప్రమాణ స్వీకారం..!
న్యూఢిల్లీలోని బ్రిటన్ హైకమిషన్
అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న విమానం అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో కూలిపోయిన సమాచారం తెలుసుకున్నాము. “వాస్తవాలను తక్షణమే నిర్ధారించడానికి, మద్దతు అందించడానికి మేము స్థానిక అధికారులతో కలిసి పని చేస్తున్నాము” అని బ్రిటిష్ హైకమిషన్ Xలో పోస్ట్ చేసింది.
Also Read:Air India Plane Crash: ప్రమాద సమయంలో 80-90 టన్నుల ఇంధనం.. ‘‘ఫ్యూయల్ డంప్’’ సమయం కూడా లేదు..
ఈ ప్రమాదంలో బాధితులకు బ్రిటన్ విదేశాంగ, కామన్వెల్త్, అభివృద్ధి వ్యవహారాల విదేశాంగ కార్యదర్శి డేవిడ్ లామీ సంతాపం తెలిపారు. “భారత్ లోని అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం వార్త నన్ను తీవ్రంగా బాధించిందన్నారు. భారత్ లోని రష్యా రాయబారి ఈ ఘటన “హృదయ విదారకం” అని అన్నారు. బాధిత కుటుంబాలకు, భారత ప్రజలకు సానుభూతి తెలిపారు. “అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంపై ఫ్రాన్స్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ క్లిష్ట సమయంలో మేము మా పూర్తి సంఘీభావాన్ని తెలియజేస్తున్నాము” అని ఫ్రెంచ్ రాయబారి థియరీ మాథౌ తెలిపారు.
Also Read:Akhanda 2: బాలయ్య సినిమాకి 80 కోట్ల ఓటీటీ డీల్!
యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ ఈ ప్రమాదంపై విచారం వ్యక్తం చేస్తూ, “ఈ దుఃఖ సమయంలో యూరప్ మీకు, భారత ప్రజలకు సంఘీభావంగా నిలుస్తుంది” అని అన్నారు. ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియన్ సర్, విమాన ప్రమాదం గురించి విని తాను “తీవ్ర బాధపడ్డాను” అని అన్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu: సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. పొదుపు చర్యలపై సంచలన నిర్ణయాలు తప్పవా..?
-
Team India Selection: బీసీసీఐ కీలక మీటింగ్.. యువ పేసర్లకు ఛాన్స్, సీనియర్లకు షాక్ తప్పదా?
-
KKR Playoffs Scenario: ఇకపై కేకేఆర్కు చావోరేవో.. ప్లేఆఫ్స్కు చేరాలంటే చివరి వరకు పోరాడాల్సిందే!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
iBomma : ఐబొమ్మ మళ్లీ యాక్టివ్.. కొత్త సినిమాలతో సడెన్ ఎంట్రీ!
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!