అగ్నిపథ్ స్కీమ్ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నిరుద్యోగులు, ఆర్మీ అభ్యర్థులు నిర్వహిస్తోన్న ఆందోళనలు పలు చోట్ల హింసాత్మకంగా మారాయి. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఆర్మీ అభ్యర్థులు నిర్వహించిన ఆందోళన విధ్వంసానికి దారి తీసింది.. ఒక్కసారిగా రైల్వేస్టేషన్లోకి ఆందోళనకారులు చొచ్చుకురావడంతో పోలీసులు చేతులెత్తేశారు.. మొత్తంగా అగ్నిపథ్ పై ఆందోళనకారులు ఆగ్రహంతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ను రణరంగంగా మార్చేశారు.. రైల్వేస్టేషన్లోని ఫర్నిచర్, సీసీ కెమెరాలు, ఏది కనిపించినా వదలకుండా ధ్వంసం చేశారు.. Read Also: Agneepath Scheme: సికింద్రాబాద్ విధ్వంసంపై స్పందించిన రేవంత్ ఇక,…
సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన’అగ్నిపథ్’ స్కీమ్ కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు మిన్నంటుతున్నాయి. హైదరాబాద్ లోని సికింద్రాబాద్ లోనే కాకుండా..పలు రాష్ట్రాల్లో యువత చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. ఉత్తరప్రదేశ్, బిహార్ లో నిరసనకారులు పలు రైళ్లకు నిప్పు పెట్టారు. యూపీలోని బల్లియాలో నేటి ఉదయం కొంతమంది నిరసనకారులు రైల్వే స్టేషన్లోకి ప్రవేశించి పట్టాలపై ఆగిన రైళ్లకు నిప్పుపెట్టారు. స్టేషన్లోని ఆస్తులను ధ్వంసం చేశారు. అయితే రైళ్లలో ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది.…
అగ్నిపథ్ స్కీంకు సంబంధించి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఉద్రిక్తతలు చోటు చేసుకోవడంతో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. స్టేషన్ నుంచి ఆందోళనకారులు బయటకు వెళ్లకపోవడంతో ముందస్తు జాగ్రత్తగా స్టేషన్ నుంచి బయల్దేరాల్సిన అన్ని రైళ్లను రద్దు చేశారు. సికింద్రాబాద్కు రావాల్సిన కొన్ని రైళ్లను ఇతర స్టేషన్లకు మళ్లించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆందోళనలను అదుపులోకి తీసుకొస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. నిరసనకారులను బయటకు పంపించే ప్రయత్నం జరుగుతోందని, రైల్వే ఆస్తులకు ఎంతమేర నష్టం జరిగిందో ఇప్పుడే చెప్పలేమన్నారు. సికింద్రాబాద్ నుంచి…
దేశంలో ‘ అగ్నిపథ్’ స్కీమ్ ప్రకంపనలు రేపుతోంది. ఆర్మీ ఆశావహులు తీవ్ర ఆందోళన చేస్తున్నారు. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయి. బీహార్, మధ్యప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఆందోళనకారులు హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు. బీహార్ లోని పలు జిల్లాల్లో రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారు. పలు రైళ్లకు నిప్పు పెట్టారు. టైర్లను కాలుస్తూ రైల్వే ట్రాక్స్ పై పడేస్తున్నారు. అగ్నిపథ్ స్కీమ్ పై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు…
అగ్నిపథ్ను రద్దు చేసి ఆర్మీ పరీక్షను యథావిధిగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఆర్మీ అభ్యర్థులు వేల సంఖ్యలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఆందోళనకు దిగారు. బస్సులపై రాళ్లు రువ్వారు. స్టేషన్లో హౌరా ఎక్స్ ప్రెస్ రైలుకు నిప్పంటించారు. మొదటి మూడు ఫ్లాట్ఫాంలను పూర్తిగా ధ్వంసం చేశారు. ఆర్మీ అభ్యర్థులు విధ్వంసంతో ప్రయాణికులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఆర్మీ అభ్యర్థుల నిరసనలతో రైల్వేస్టేషన్ రణరంగంగా మారింది. అగ్నిపథ్ స్కీమ్ రద్దుచేయాలని, యధాతతంగా ఆర్మీ ఎగ్జామ్ పెట్టాల్సిందే అని డిమాండ్…
Agnipath Scheme Protest LIVE Updates: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో పరిస్థితి చేయి దాటింది. ‘అగ్నిపథ్’ రద్దు చేసి, పాత పద్ధతిలో సైనికుల నియామకాలు జరపాలని డిమాండ్ చేస్తున్న వేలాది మంది యువకులు పలు రైళ్లకు నిప్పుపెట్టారు. పోలీసులపై రాళ్లు రువ్వారు.
భారతీయ సైనిక దళాల నియామకాల్లో మార్పునకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై ఆర్మీ అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. హైదరాబాద్ లోని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో వద్ద ఆర్మీఅభ్యర్థులు ఆందోళన చేపట్టారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రైల్వే స్టేషన్ బయట ఉన్న ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా రైల్వే స్టేషన్లోకి చొచ్చుకెళ్లిన ఫ్లాట్ఫారమ్ మీద ఉన్న రైళ్లపై కూడా రాళ్లు విసిరారు. ప్రయాణికులు భయంతో పరుగులు పెట్టారు. రైలు పట్టాల మధ్యలో నిప్పుపెట్టి ఆందోళన చేపట్టారు.…
కేంద్ర ప్రభుత్వ ప్రవేశపెట్టిన ‘ అగ్ని పథ్’ స్కీమ్ పై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఆర్మీలో చేరాలనుకుంటున్న యువత కొంతమంది ఈ స్కీమ్ ను వ్యతిరేఖిస్తున్నారు. ప్రస్తుతం బీహర్, మధ్య ప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో ఆర్మీ ఆశావహులు తీవ్ర ఆందోళన నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా బీహార్ లో పలు ప్రాంతాల్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగించారు. రైల్వే ట్రాకులపై టైర్లు వేసి కాల్చారు. మూడు రైళ్ల బోగీలకు నిప్పు పెట్టారు ఆందోళనకారులు. చాప్రా, గోపాల్…
ఆర్మీలో రిక్రూట్మెంట్ కోసం కేంద్రం తీసుకువచ్చిన ‘అగ్నిపథ్’ స్కీమ్ ఆందోళలకు కారణం అవుతోంది. ముఖ్యంగా బీహార్ లో పలు ప్రాంతాల్లో యువత ఆందోళన చేస్తోంది. కొన్ని చోట్ల ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఆర్మీలో చేరాలనుకుంటున్న యువకులు అగ్నిపథ్ స్కీమ్ ను వ్యతిరేఖిస్తున్నారు. ఆర్మీలో చేరడం మా ఆశ అని కేవలం నాలుగేళ్లకే సర్వీస్ పరిమితం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీహార్ లో ‘ఇండియన్ ఆర్మీ లవర్స్’ పేరుతో ఆందోళనలు చేస్తున్నారు ఆర్మీ ఆశావహులు. నిన్నటి నుంచి…
భారత సైన్యాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు, జీతం, పెన్షన్ బిల్లులను తగ్గించడంతో పాటు ఆధునాతన ఆయుధాలను సేకరణ కోసం నిధులను ఖర్చు చేయాలనే లక్ష్యంతో అగ్నిపథ్ పథకాన్ని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, దేశ త్రివిధ దళాల అధిపతులతో కలిసి ప్రకటించారు. రాజ్ నాథ్ సంగ్ ఇది చారిత్రక నిర్ణయం అని అన్నారు. అగ్నిపథ్ పథకంలోని ముఖ్యాంశాలు: పథకం కింద 17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్ల వయసు ఉన్న 45,000 మంది యువతీయువకులను…