కీలక దశలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆర్సీబీని చావుదెబ్బ కొట్టింది. ఈ ఓటమితో క్వాలిఫయర్ వన్కి అర్హత సాధించాలని భావించిన ఆర్సీబీకి చుక్కెదురైంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది.
నిన్న లక్నో సూపర్ జెయింట్స్, సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య హోరాహోరీ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో పాట్ కమ్మిన్స్ నాయకత్వంలోని SRH 6 వికెట్ల తేడాతో విజయం సాధించి, లక్నోని ప్లేఆప్స్ నుంచి బయటకు వెళ్లగొట్టింది. అయితే ఈ మ్యాచ్ లో లక్నో బౌలర్ కాస్త అతి చేశాడు. ఏకంగా యువరాజ్ సింగ్ శిష్యుడు అభిషేక్ శర్మతోనే పెట్టుకున్నాడు. దిగ్వేష్ రాఠి వేసిన ఎనిమిదో ఓవర్ మూడో బంతిని అభిషేక్ శర్మ కవర్ మీదుగా షాట్ కు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) లో సన్రైజర్స్ హైదరాబాద్, లక్నో మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు లక్నోను 6 వికెట్ల తేడాతో ఓడించి, ప్లేఆఫ్స్కు చేరుకునే లక్నో ఆశలను కూడా దెబ్బతీసింది. ఈ మ్యాచ్ జరుగుతున్నప్పుడు అభిషేక్ శర్మ, దిగ్వేష్ రాఠి మధ్య గొడవ జరిగింది. దిగ్వేష్ ఓవరాక్షన్ తో గందరగోళ పరిస్థితి తలెత్తింది. దిగ్వేష్ సింగ్ రాఠి, అభిషేక్ శర్మ మధ్య తీవ్ర వాదన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో భాగంగా జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ (GT) సన్రైజర్స్ హైదరాబాద్ (SRH)ను 38 పరుగుల తేడాతో ఓడించింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో, సన్రైజర్స్ హైదరాబాద్ కు 225 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేదించే క్రమంలో సన్రైజర్స్ ఆరు వికెట్లు కోల్పోయి 186 పరుగులు మాత్రమే చేసింది. సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున అభిషేక్ శర్మ అర్ధ సెంచరీతో చెలరేగినా పోరాటం వృథా అయ్యింది. Also Read:Viral…
Surya Kumar Yadav: ఐపీఎల్ 2025 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ (SRH), ముంబై ఇండియన్స్ (MI) మధ్య బుధవారం జరిగిన మ్యాచ్లో ఒక ఆసక్తికర సంఘటన అభిమానులను నవ్వించింది. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు అభిషేక్ శర్మ మధ్య జరిగిన ఓ సరదా సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది వరకు పంజాబ్ మ్యాచ్ లో వీరబాదుడు బాదిన…
సొంతగడ్డపై బంతితో, బ్యాటుతో అదరగొట్టిన ముంబై ఇండియన్స్ మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఐపీఎల్ 2025లో భాగంగా గురువారం వాంఖడే స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో ముంబై 4 వికెట్ల తేడాతో గెలిచింది. 163 పరుగుల లక్ష్యాన్ని 18.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్ల్లో మూడో విజయాన్ని అందుకుని ప్లేఆఫ్స్ రేసులో ఉంది. మరోవైపు ఆడిన 7 మ్యాచ్ల్లో రెండే విజయాలు సాధించిన సన్రైజర్స్ ప్లేఆఫ్స్ చేరడం…
ఐపీఎల్ 2025లో 33వ మ్యాచ్ గురువారం ముంబై ఇండియన్స్ - సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య జరుగుతోంది. వాంఖడే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ మ్యాచ్లో ఇరు జట్లు ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగాయి. మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.
తమ ప్రణాళికలు ఎప్పుడూ ఒకేలా ఉంటాయని, పాజిటివ్ క్రికెట్ ఆడతాం అని సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) సహాయక కోచ్ సైమన్ హెల్మోట్ తెలిపారు. తమ దూకుడైన ఆటతీరును కొనసాగిస్తామని చెప్పారు. గతంలో విజయం సాధించినా, ఓడినా సరే దానిని పక్కన పెట్టేయాలన్నారు. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని సైమన్ చెప్పుకొచ్చారు. సొంతగడ్డపై ఎస్ఆర్హెచ్ మరో సవాల్కు సిద్ధమైంది. ఆదివారం రాత్రి 7.30కు ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో గుజరాత్…
ఐపీఎల్ 2025 లో భాగంగా 18వ సీజన్ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. 18వ సీజన్కి ఐకానిక్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ (KKR) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. అలాగే రెండో మ్యాచ్ లో సన్రైజర్స్ హైదరాబాద్ , రాజస్థాన్ రాయల్స్ జట్లు ఉప్పల్ స్టేడియంలో తలపడనున్నాయి.
మరో రెండ్రోజుల్లో ఐపీఎల్ మహా సంగ్రామం మొదలవబోతుంది. అందుకోసం అన్నీ జట్లు తమ హోంగ్రౌండ్లలో కఠినంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. అందులో భాగంగా.. సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాటర్, ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా ప్రాక్టీస్లో పాల్గొన్నాడు. ఈ క్రమంలో.. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్న అభిషేక్ శర్మ.. తన అద్భుత షాట్లతో చెప్పి మరీ స్టేడియంలోని అద్దాలను పగలగొట్టాడు.