Team India: టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ.. శ్రీలంక టెస్టు సిరీస్కు స్టార్ ప్లేయర్ డౌటే!
- శ్రీలంకతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్
- నివేదిక తర్వాతే బీసీసీఐ జట్టును ప్రకటించే అవకాశాలు
- శ్రీలంక టెస్టు సిరీస్కు స్టార్ ప్లేయర్ డౌటే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలంకతో జరిగే రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్కు ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయి. స్టార్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం భారత జట్టు సెలెక్షన్ కమిటీని ఆందోళనకు గురిచేస్తోంది. ఇంగ్లండ్తో జరిగిన మూడో వన్డేకు హ్యామ్స్ట్రింగ్ గాయం కారణంగా దూరమైన సుందర్ ఫిట్నెస్పై ఇంకా స్పష్టత రాలేదు. అందుకే శ్రీలంక టెస్టు సిరీస్కు జట్టును ప్రకటించడాన్ని బీసీసీఐ సెలెక్టర్లు వాయిదా వేసినట్లు సమాచారం. సుందర్ గాయం తీవ్రతపై పూర్తి నివేదిక వచ్చిన తర్వాతే బీసీసీఐ జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నాయని జాతీయ మీడియా తమ కథనంలో పేర్కొంది.
వాషింగ్టన్ సుందర్ ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)లో వైద్య పరీక్షలు చేయించుకోనున్నాడు. హ్యామ్స్ట్రింగ్ గాయానికి స్కానింగ్ నిర్వహించనుండగా.. అది గ్రేడ్-1 హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ అయ్యే అవకాశం ఉందని ఓ నివేదిక పేర్కొంది. గాయం తీవ్రతను బట్టి శ్రీలంక టెస్టు సిరీస్లో అతని భాగస్వామ్యంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. శుభ్మన్ గిల్ సారథ్యంలో భారత జట్టు ఆగస్టు 4న శ్రీలంకలోని కొలంబోకు చేరుకోనుంది. ప్రధాన టెస్టు సిరీస్కు ముందు స్థానిక పరిస్థితులకు అలవాటు పడేందుకు ఆగస్టు 7 నుంచి 10 వరకు కొలంబోలోని నాన్డిస్క్రిప్ట్స్ క్రికెట్ క్లబ్ మైదానంలో నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ ఆటగాళ్లకు శ్రీలంక పిచ్లు, వాతావరణానికి అలవాటు పడేందుకు ఎంతో ఉపయోగపడుతుందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
Also Read
- IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!
- Indian Cricketers: ధావన్ నుంచి బుమ్రా వరకు.. భర్త కంటే భార్యే పెద్ద.. భారత క్రికెట్లో ఈ స్టార్ జంటల ప్రేమకథలు తెలుసా?
- IND vs SL 1st Test: తొలి టెస్టుకు శ్రీలంక జట్టు ప్రకటన.. ఊహించని ఆటగాళ్లకు చోటు.. టీమిండియాకు చుక్కలే!
- Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
వార్మప్ మ్యాచ్ అనంతరం భారత జట్టు గాలేకు వెళ్లనుంది. తొలి టెస్టు ఆగస్టు 15 నుంచి 19 వరకు గాలే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. రెండో టెస్టు ఆగస్టు 23 నుంచి 27 వరకు కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో నిర్వహించనున్నారు. రెండు టెస్టులు కూడా స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పరంగా ఈ సిరీస్ ఇరు జట్లకు ఎంతో కీలకం. ప్రస్తుతం భారత్ 9 టెస్టుల్లో 48.15 పాయింట్ల శాతంతో ఐదో స్థానంలో ఉండగా.. శ్రీలంక 44.44 పాయింట్ల శాతంతో ఆరో స్థానంలో ఉంది. ఈ సిరీస్లో విజయం సాధించిన జట్టుకు ఛాంపియన్షిప్ ఫైనల్ రేసులో కీలక ఆధిక్యం లభించే అవకాశం ఉంది. భారత్ చివరిసారిగా 2017లో విరాట్ కోహ్లీ నాయకత్వంలో శ్రీలంకలో టెస్టు సిరీస్ ఆడి 3-0తో క్లీన్స్వీప్ చేసింది. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత శ్రీలంకలో టెస్టు సిరీస్ ఆడనున్న భారత జట్టు.. మరోసారి విజయంతో పర్యటనను ముగించాలని చూస్తోంది.
తాజావార్తలు
-
Moon Mission Explained: చంద్రునిపై ప్రపంచ మహాశక్తుల మధ్య ఒక నిశ్శబ్ద సమరం..ఈ మహా పోరులో భారత్ వైపు అమెరికా?
-
40 గంటల బ్యాటరీ, 3,000 నిట్స్ స్క్రీన్.. Google Pixel Watch 5 ధర, ఫీచర్లు ఇవే!
-
Theatre Releases: ఇండిపెండెన్స్ డే వీకెండ్లో కొత్త సినిమాల జాతర… ఆగస్టు 14న సందడి చేసే సినిమాల లిస్ట్ ఇదే!
-
PM SVANidhi Scheme: కేంద్రం గుడ్న్యూస్.. ఆధార్ ఉంటే చాలు రూ.90 వేల వరకు హామీలేని రుణాలు..
-
Vishwanath & Sons pre-release business : విశ్వనాథ్ అండ్ సన్స్’ ప్రీ-రిలీజ్ బిజినెస్.. రిలీజ్కు ముందే లాభాలు
ట్రెండింగ్
-
IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!
-
నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) మరింత స్మార్ట్గా.. కొత్త ఫీచర్లు, Olive కలర్లో Google Pixel Buds 2a, Pro 2..!
-
ఏడాదికి పైగా బ్యాటరీ లైఫ్.. UWB, IP67తో AirTagకు పోటీగా Google Pixel Tag లాంచ్..!
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!