Team India: టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ.. శ్రీలంక టెస్టు సిరీస్కు స్టార్ ప్లేయర్ డౌటే!
- శ్రీలంకతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్
- నివేదిక తర్వాతే బీసీసీఐ జట్టును ప్రకటించే అవకాశాలు
- శ్రీలంక టెస్టు సిరీస్కు స్టార్ ప్లేయర్ డౌటే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలంకతో జరిగే రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్కు ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయి. స్టార్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం భారత జట్టు సెలెక్షన్ కమిటీని ఆందోళనకు గురిచేస్తోంది. ఇంగ్లండ్తో జరిగిన మూడో వన్డేకు హ్యామ్స్ట్రింగ్ గాయం కారణంగా దూరమైన సుందర్ ఫిట్నెస్పై ఇంకా స్పష్టత రాలేదు. అందుకే శ్రీలంక టెస్టు సిరీస్కు జట్టును ప్రకటించడాన్ని బీసీసీఐ సెలెక్టర్లు వాయిదా వేసినట్లు సమాచారం. సుందర్ గాయం తీవ్రతపై పూర్తి నివేదిక వచ్చిన తర్వాతే బీసీసీఐ జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నాయని జాతీయ మీడియా తమ కథనంలో పేర్కొంది.
వాషింగ్టన్ సుందర్ ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)లో వైద్య పరీక్షలు చేయించుకోనున్నాడు. హ్యామ్స్ట్రింగ్ గాయానికి స్కానింగ్ నిర్వహించనుండగా.. అది గ్రేడ్-1 హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ అయ్యే అవకాశం ఉందని ఓ నివేదిక పేర్కొంది. గాయం తీవ్రతను బట్టి శ్రీలంక టెస్టు సిరీస్లో అతని భాగస్వామ్యంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. శుభ్మన్ గిల్ సారథ్యంలో భారత జట్టు ఆగస్టు 4న శ్రీలంకలోని కొలంబోకు చేరుకోనుంది. ప్రధాన టెస్టు సిరీస్కు ముందు స్థానిక పరిస్థితులకు అలవాటు పడేందుకు ఆగస్టు 7 నుంచి 10 వరకు కొలంబోలోని నాన్డిస్క్రిప్ట్స్ క్రికెట్ క్లబ్ మైదానంలో నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ ఆటగాళ్లకు శ్రీలంక పిచ్లు, వాతావరణానికి అలవాటు పడేందుకు ఎంతో ఉపయోగపడుతుందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
Also Read
- Suryakumar Yadav: తప్పంతా నాదే.. వన్డే కెరీర్పై సూర్యకుమార్ సంచలన వ్యాఖ్యలు!
- Fit India Ambassador: గౌతమ్ గంభీర్కు భావోద్వేగ క్షణం.. కుమార్తె ఆజీన్కు అరుదైన గౌరవం
- Asia Cup 2026: పాకిస్థాన్తో హ్యాండ్షేక్ ఉంటుందా?.. టీమిండియా కోచ్ ఏం చెప్పాడంటే?
- BCCI-Team India: ఉన్నపళంగా బెంగళూరుకు టీమిండియా స్టార్ క్రికెటర్లు.. ఎందుకో తెలుసా?
వార్మప్ మ్యాచ్ అనంతరం భారత జట్టు గాలేకు వెళ్లనుంది. తొలి టెస్టు ఆగస్టు 15 నుంచి 19 వరకు గాలే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. రెండో టెస్టు ఆగస్టు 23 నుంచి 27 వరకు కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో నిర్వహించనున్నారు. రెండు టెస్టులు కూడా స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పరంగా ఈ సిరీస్ ఇరు జట్లకు ఎంతో కీలకం. ప్రస్తుతం భారత్ 9 టెస్టుల్లో 48.15 పాయింట్ల శాతంతో ఐదో స్థానంలో ఉండగా.. శ్రీలంక 44.44 పాయింట్ల శాతంతో ఆరో స్థానంలో ఉంది. ఈ సిరీస్లో విజయం సాధించిన జట్టుకు ఛాంపియన్షిప్ ఫైనల్ రేసులో కీలక ఆధిక్యం లభించే అవకాశం ఉంది. భారత్ చివరిసారిగా 2017లో విరాట్ కోహ్లీ నాయకత్వంలో శ్రీలంకలో టెస్టు సిరీస్ ఆడి 3-0తో క్లీన్స్వీప్ చేసింది. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత శ్రీలంకలో టెస్టు సిరీస్ ఆడనున్న భారత జట్టు.. మరోసారి విజయంతో పర్యటనను ముగించాలని చూస్తోంది.
తాజావార్తలు
-
Theatrical Releases: సెప్టెంబర్ లో సౌత్ సినిమాల జోరు… లవ్ స్టోరీల నుండి యాక్షన్ థ్రిల్లర్ల వరకు
-
Venus Enters Libra: సెప్టెంబర్ 2 నుంచి ఈ 4 రాశుల వారికి అదృష్టమే అదృష్టం.. ఉద్యోగం, డబ్బు, వాహనం కొనుగోలు యోగం!
-
Skincare Tips: బ్యూటీ పార్లర్కు బై బై చెప్పండి!.. ఇంట్లోనే సహజంగా ముఖానికి మెరుపు తెచ్చే 3 టిప్స్ ఇవే..
-
Spy Action Thriller: థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
ట్రెండింగ్
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!