Team India: టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ.. శ్రీలంక టెస్టు సిరీస్కు స్టార్ ప్లేయర్ డౌటే!
- శ్రీలంకతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్
- నివేదిక తర్వాతే బీసీసీఐ జట్టును ప్రకటించే అవకాశాలు
- శ్రీలంక టెస్టు సిరీస్కు స్టార్ ప్లేయర్ డౌటే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలంకతో జరిగే రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్కు ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయి. స్టార్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం భారత జట్టు సెలెక్షన్ కమిటీని ఆందోళనకు గురిచేస్తోంది. ఇంగ్లండ్తో జరిగిన మూడో వన్డేకు హ్యామ్స్ట్రింగ్ గాయం కారణంగా దూరమైన సుందర్ ఫిట్నెస్పై ఇంకా స్పష్టత రాలేదు. అందుకే శ్రీలంక టెస్టు సిరీస్కు జట్టును ప్రకటించడాన్ని బీసీసీఐ సెలెక్టర్లు వాయిదా వేసినట్లు సమాచారం. సుందర్ గాయం తీవ్రతపై పూర్తి నివేదిక వచ్చిన తర్వాతే బీసీసీఐ జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నాయని జాతీయ మీడియా తమ కథనంలో పేర్కొంది.
వాషింగ్టన్ సుందర్ ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)లో వైద్య పరీక్షలు చేయించుకోనున్నాడు. హ్యామ్స్ట్రింగ్ గాయానికి స్కానింగ్ నిర్వహించనుండగా.. అది గ్రేడ్-1 హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ అయ్యే అవకాశం ఉందని ఓ నివేదిక పేర్కొంది. గాయం తీవ్రతను బట్టి శ్రీలంక టెస్టు సిరీస్లో అతని భాగస్వామ్యంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. శుభ్మన్ గిల్ సారథ్యంలో భారత జట్టు ఆగస్టు 4న శ్రీలంకలోని కొలంబోకు చేరుకోనుంది. ప్రధాన టెస్టు సిరీస్కు ముందు స్థానిక పరిస్థితులకు అలవాటు పడేందుకు ఆగస్టు 7 నుంచి 10 వరకు కొలంబోలోని నాన్డిస్క్రిప్ట్స్ క్రికెట్ క్లబ్ మైదానంలో నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ ఆటగాళ్లకు శ్రీలంక పిచ్లు, వాతావరణానికి అలవాటు పడేందుకు ఎంతో ఉపయోగపడుతుందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
Also Read
- Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
- Cristiano Ronaldo: అర్జెంటీనాపై వివాదాస్పద పోస్ట్ను రొనాల్డో లైక్ చేశారా? సోషల్ మీడియాలో నెటిజన్ల రచ్చ..
- Tilak Varma: నేను బ్యాటింగ్ చేయలేను.. జింబాబ్వే టీ20 మ్యాచ్కు ముందు తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు..
- 2027 World Cup Squad: 2027 వరల్డ్ కప్ టీమిండియాలో సీనియర్లకు నో.. ఆ క్రికెటర్ ఎంచుకున్న 15 మంది ప్లేయర్లు వీరే..
వార్మప్ మ్యాచ్ అనంతరం భారత జట్టు గాలేకు వెళ్లనుంది. తొలి టెస్టు ఆగస్టు 15 నుంచి 19 వరకు గాలే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. రెండో టెస్టు ఆగస్టు 23 నుంచి 27 వరకు కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో నిర్వహించనున్నారు. రెండు టెస్టులు కూడా స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పరంగా ఈ సిరీస్ ఇరు జట్లకు ఎంతో కీలకం. ప్రస్తుతం భారత్ 9 టెస్టుల్లో 48.15 పాయింట్ల శాతంతో ఐదో స్థానంలో ఉండగా.. శ్రీలంక 44.44 పాయింట్ల శాతంతో ఆరో స్థానంలో ఉంది. ఈ సిరీస్లో విజయం సాధించిన జట్టుకు ఛాంపియన్షిప్ ఫైనల్ రేసులో కీలక ఆధిక్యం లభించే అవకాశం ఉంది. భారత్ చివరిసారిగా 2017లో విరాట్ కోహ్లీ నాయకత్వంలో శ్రీలంకలో టెస్టు సిరీస్ ఆడి 3-0తో క్లీన్స్వీప్ చేసింది. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత శ్రీలంకలో టెస్టు సిరీస్ ఆడనున్న భారత జట్టు.. మరోసారి విజయంతో పర్యటనను ముగించాలని చూస్తోంది.
తాజావార్తలు
-
Team India: టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ.. శ్రీలంక టెస్టు సిరీస్కు స్టార్ ప్లేయర్ డౌటే!
-
PM Kisan Yojana: పీఎం కిసాన్ యోజన మొత్తం పెంపుపై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ క్లారిటీ.. 24వ వాయిదాకు ముందు కీలక అప్డేట్
-
Dharmendra Pradhan: నీట్పై చర్చకు సిద్ధం.. విద్యార్థుల పేరుతో రాజకీయాలు వద్దు రాహుల్..
-
CKYC: బ్యాంకు కస్టమర్స్ కు అలర్ట్.. మీ CKYC నంబర్ తెలుసా?.. ఇలా తెలుసుకోండి
-
Jana Nayagan : విజయ్ ముందు భారీ టార్గెట్స్.. ఫస్ట్ డే వసూళ్లలో రజనీకాంత్ డామినేట్
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!