Virat Kohli: ఏదైనా ప్రత్యేకంగా చేయాలనుకున్నా.. ఐయామ్ ఫుల్ హ్యాపీ, సిద్ధంగా ఉన్నా!
- 2-3 ఏళ్లుగా నేను ఇలా ఆడలేదు
- మునుపటి స్థాయి ఫామ్ అందుకున్నా
- జట్టు కోసం ఏదైనా చేయడనికి సిద్ధంగా ఉన్నా
- దేన్నైనా ఎదుర్కొనే సత్తా నాలో ఉంది
క్రికెట్లో తన మునుపటి స్థాయికి మరలా చేరుకున్నానని భారత స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ ఆనందం వ్యక్తం చేశాడు. దక్షిణాఫ్రికా సిరీస్లో తాను ఆడిన విధానం చాలా సంతృప్తిని ఇచ్చిందని చెప్పాడు. గత 2–3 ఏళ్లలో తాను ఇలా ఆడలేదని, ఈ సిరీస్లోని ఆటతీరు తనకు తిరిగి ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని చెప్పాడు. చాలా కాలం తర్వాత తన ఆట ఎంతో సంతృప్తిని ఇచ్చిందని వెల్లడించాడు. సిరీస్ 1-1తో సమం అయినప్పుడు జట్టు కోసం ఏదైనా ప్రత్యేకంగా చేయాలని నేను, రోహిత్ శర్మ అనుకున్నాం అని.. జట్టు విజయంలో భాగమైనందుకు ఆనందంగా ఉందని కోహ్లీ చెప్పుకొచ్చాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో కోహ్లీ (65 నాటౌట్; 45 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లు) హాఫ్ సెంచరీ చేశాడు.
దక్షిణాఫ్రికా వన్డే సిరీస్లో 302 పరుగులు చేసిన విరాట్ కోహ్లీకి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు దక్కింది. అవార్డు అందుకున్న అనంతరం కోహ్లీ మాట్లాడుతూ… ‘సిరీస్ మొత్తం నా మైండ్ చాలా ప్రశాంతంగా ఉంది. నేను ఇలాంటి ఇన్నింగ్స్లు ఆడగలిగితే జట్టుకు కూడా మంచి సహకారం అందించగలననే నమ్మకం పెరుగుతుంది. నేను బ్యాటింగ్కు దిగినప్పుడు ఏ పరిస్థితి వచ్చినా.. ఎదుర్కొనే సత్తా నాలో ఉంది. అలాంటి నమ్మకంతో ఆడితే జట్టుకు ఉపయోగం ఉంటుంది. నేను ఎక్కువ సేపు క్రీజులో నిలబడగలను, మ్యాచ్ పరిస్థితిని బట్టి షాట్లు ఆడగలను. ఒక్క తప్పిదం మీ ఇన్నింగ్స్ను ముగించేస్తుంది. అలాంటప్పుడు భయం, ఆందోళన సహజం. కొన్ని సార్లు నేను ఇంకా ఆడగలనా? అనే భావన వస్తుంది. అదే క్రీడ ప్రత్యేకత. ప్రతీ బంతిని ఎదుర్కొంటూ ఆ భయాన్ని జయించాలి. దీర్ఘ ఇన్నింగ్స్ ఆడినప్పుడు మళ్లీ మీరు మీ మునుపటి ఫామ్ అందుకుంటారు’ అని అన్నాడు.
Also Read
- Shreyas Iyer: "నీ వల్ల కాదు అంటే తట్టుకోలేను".. విమర్శకులకు శ్రేయస్ అయ్యర్ స్ట్రాంగ్ కౌంటర్..
- Bhuvneshwar Kumar: విమర్శకులకు వికెట్లతో సమాధానం.. భువనేశ్వర్ గణాంకాలు చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే..
- Virat Kohli: ఆకాశమే హద్దుగా కోహ్లీ రికార్డుల వేట.. ఐపీఎల్లో ఈ ఘనత సాధించిన ఏకైక ప్లేయర్ విరాట్..
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
Also Read: What’s Today: ఈరోజు ఏమున్నాయంటే?
‘ఏళ్ల తరబడి ఆడుతున్నా. చాలా కాలంగా ఆడుతున్నపుడు మనిషిగా కూడా మెరుగుపడతారు. ఆస్ట్రేలియా టూర్ తర్వాత ఇదే నా మొదటి మ్యాచ్. మొదటి నుంచే బంతి బాగా వస్తుందన్న భావన వచ్చింది. ఆ రోజు నాకు వచ్చిన ఎనర్జీ వేరే స్థాయిలో ఉంది. రిస్క్లు తీసుకునే ధైర్యం వచ్చింది. డిసైడర్ మ్యాచ్లే మాలోని అసలైన ఆటను బయటకు తెప్పిస్తాయి. ఈరోజు మ్యాచ్లో నేను టీమ్ కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయాలనుకున్నా. ఇదే విషయంపై రోహిత్ శర్మతో మాట్లాడా. జట్టు విజయంలో భాగమైనందుకు ఆనందంగా ఉంది. జట్టు అవసరాలకే నేను ప్రాధాన్యం ఇస్తాను. ఈ మూడు మ్యాచ్లు నాకు చాలా సంతృప్తిని ఇచ్చాయి. జట్టుకు ఇంకా నా వంతు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాను’ అని కింగ్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
Telangana Government: లొంగిపోయిన మావోయిస్టులకు సర్కార్ బంపర్ ఆఫర్.. ‘గిరిదర్శక్’గా ఉద్యోగాలు!
-
Ajay Pal Sharma: బెంగాల్ ఎన్నికల్లో హాట్ టాపిక్గా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ‘‘అజయ్ పాల్ శర్మ’’
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
Ashu Reddy: డబ్బు అడిగితే ఆత్మహత్య చేసుకుంటానంది.. బాదితుడి సంచలనం!
-
The Paradise: ‘ఆయా షేర్’ తర్వాత అనిరుధ్ నుంచి నెక్స్ట్ సెన్సేషన్.. ‘ది ప్యారడైజ్’ సెకండ్ సింగిల్కి డేట్ ఫిక్స్!
ట్రెండింగ్
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!