Virat Kohli: ఏదైనా ప్రత్యేకంగా చేయాలనుకున్నా.. ఐయామ్ ఫుల్ హ్యాపీ, సిద్ధంగా ఉన్నా!
- 2-3 ఏళ్లుగా నేను ఇలా ఆడలేదు
- మునుపటి స్థాయి ఫామ్ అందుకున్నా
- జట్టు కోసం ఏదైనా చేయడనికి సిద్ధంగా ఉన్నా
- దేన్నైనా ఎదుర్కొనే సత్తా నాలో ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్రికెట్లో తన మునుపటి స్థాయికి మరలా చేరుకున్నానని భారత స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ ఆనందం వ్యక్తం చేశాడు. దక్షిణాఫ్రికా సిరీస్లో తాను ఆడిన విధానం చాలా సంతృప్తిని ఇచ్చిందని చెప్పాడు. గత 2–3 ఏళ్లలో తాను ఇలా ఆడలేదని, ఈ సిరీస్లోని ఆటతీరు తనకు తిరిగి ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని చెప్పాడు. చాలా కాలం తర్వాత తన ఆట ఎంతో సంతృప్తిని ఇచ్చిందని వెల్లడించాడు. సిరీస్ 1-1తో సమం అయినప్పుడు జట్టు కోసం ఏదైనా ప్రత్యేకంగా చేయాలని నేను, రోహిత్ శర్మ అనుకున్నాం అని.. జట్టు విజయంలో భాగమైనందుకు ఆనందంగా ఉందని కోహ్లీ చెప్పుకొచ్చాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో కోహ్లీ (65 నాటౌట్; 45 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లు) హాఫ్ సెంచరీ చేశాడు.
దక్షిణాఫ్రికా వన్డే సిరీస్లో 302 పరుగులు చేసిన విరాట్ కోహ్లీకి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు దక్కింది. అవార్డు అందుకున్న అనంతరం కోహ్లీ మాట్లాడుతూ… ‘సిరీస్ మొత్తం నా మైండ్ చాలా ప్రశాంతంగా ఉంది. నేను ఇలాంటి ఇన్నింగ్స్లు ఆడగలిగితే జట్టుకు కూడా మంచి సహకారం అందించగలననే నమ్మకం పెరుగుతుంది. నేను బ్యాటింగ్కు దిగినప్పుడు ఏ పరిస్థితి వచ్చినా.. ఎదుర్కొనే సత్తా నాలో ఉంది. అలాంటి నమ్మకంతో ఆడితే జట్టుకు ఉపయోగం ఉంటుంది. నేను ఎక్కువ సేపు క్రీజులో నిలబడగలను, మ్యాచ్ పరిస్థితిని బట్టి షాట్లు ఆడగలను. ఒక్క తప్పిదం మీ ఇన్నింగ్స్ను ముగించేస్తుంది. అలాంటప్పుడు భయం, ఆందోళన సహజం. కొన్ని సార్లు నేను ఇంకా ఆడగలనా? అనే భావన వస్తుంది. అదే క్రీడ ప్రత్యేకత. ప్రతీ బంతిని ఎదుర్కొంటూ ఆ భయాన్ని జయించాలి. దీర్ఘ ఇన్నింగ్స్ ఆడినప్పుడు మళ్లీ మీరు మీ మునుపటి ఫామ్ అందుకుంటారు’ అని అన్నాడు.
Also Read
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
- IPL 2026 Playoff Tickets: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ టిక్కెట్స్ షెడ్యూల్ వచ్చేసింది.. ఇక్కడ బుక్ చేసుకోండిలా..
- CSK vs SRH: ధోని లేకుండానే బరిలోకి CSK.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే.!
- IPL: ‘నన్ను అస్సలు పట్టించుకోలేదు’.. కేకేఆర్పై బంగ్లాదేశ్ స్టార్ లిటన్ దాస్ సంచలన వ్యాఖ్యలు..
Also Read: What’s Today: ఈరోజు ఏమున్నాయంటే?
‘ఏళ్ల తరబడి ఆడుతున్నా. చాలా కాలంగా ఆడుతున్నపుడు మనిషిగా కూడా మెరుగుపడతారు. ఆస్ట్రేలియా టూర్ తర్వాత ఇదే నా మొదటి మ్యాచ్. మొదటి నుంచే బంతి బాగా వస్తుందన్న భావన వచ్చింది. ఆ రోజు నాకు వచ్చిన ఎనర్జీ వేరే స్థాయిలో ఉంది. రిస్క్లు తీసుకునే ధైర్యం వచ్చింది. డిసైడర్ మ్యాచ్లే మాలోని అసలైన ఆటను బయటకు తెప్పిస్తాయి. ఈరోజు మ్యాచ్లో నేను టీమ్ కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయాలనుకున్నా. ఇదే విషయంపై రోహిత్ శర్మతో మాట్లాడా. జట్టు విజయంలో భాగమైనందుకు ఆనందంగా ఉంది. జట్టు అవసరాలకే నేను ప్రాధాన్యం ఇస్తాను. ఈ మూడు మ్యాచ్లు నాకు చాలా సంతృప్తిని ఇచ్చాయి. జట్టుకు ఇంకా నా వంతు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాను’ అని కింగ్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
Rishikesh Train Accident: రిషికేశ్లో తృటిలో తప్పిన ఘోర ప్రమాదం.. దేవుడిలా కాపాడిన ఆ ఒక్క కారణం ఏంటో తెలుసా?
-
Petrol and Diesel Prices Hike: వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రో ధరలు
-
Astrology: మే 19 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!