Virat Kohli: ఏదైనా ప్రత్యేకంగా చేయాలనుకున్నా.. ఐయామ్ ఫుల్ హ్యాపీ, సిద్ధంగా ఉన్నా!
- 2-3 ఏళ్లుగా నేను ఇలా ఆడలేదు
- మునుపటి స్థాయి ఫామ్ అందుకున్నా
- జట్టు కోసం ఏదైనా చేయడనికి సిద్ధంగా ఉన్నా
- దేన్నైనా ఎదుర్కొనే సత్తా నాలో ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్రికెట్లో తన మునుపటి స్థాయికి మరలా చేరుకున్నానని భారత స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ ఆనందం వ్యక్తం చేశాడు. దక్షిణాఫ్రికా సిరీస్లో తాను ఆడిన విధానం చాలా సంతృప్తిని ఇచ్చిందని చెప్పాడు. గత 2–3 ఏళ్లలో తాను ఇలా ఆడలేదని, ఈ సిరీస్లోని ఆటతీరు తనకు తిరిగి ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని చెప్పాడు. చాలా కాలం తర్వాత తన ఆట ఎంతో సంతృప్తిని ఇచ్చిందని వెల్లడించాడు. సిరీస్ 1-1తో సమం అయినప్పుడు జట్టు కోసం ఏదైనా ప్రత్యేకంగా చేయాలని నేను, రోహిత్ శర్మ అనుకున్నాం అని.. జట్టు విజయంలో భాగమైనందుకు ఆనందంగా ఉందని కోహ్లీ చెప్పుకొచ్చాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో కోహ్లీ (65 నాటౌట్; 45 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లు) హాఫ్ సెంచరీ చేశాడు.
దక్షిణాఫ్రికా వన్డే సిరీస్లో 302 పరుగులు చేసిన విరాట్ కోహ్లీకి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు దక్కింది. అవార్డు అందుకున్న అనంతరం కోహ్లీ మాట్లాడుతూ… ‘సిరీస్ మొత్తం నా మైండ్ చాలా ప్రశాంతంగా ఉంది. నేను ఇలాంటి ఇన్నింగ్స్లు ఆడగలిగితే జట్టుకు కూడా మంచి సహకారం అందించగలననే నమ్మకం పెరుగుతుంది. నేను బ్యాటింగ్కు దిగినప్పుడు ఏ పరిస్థితి వచ్చినా.. ఎదుర్కొనే సత్తా నాలో ఉంది. అలాంటి నమ్మకంతో ఆడితే జట్టుకు ఉపయోగం ఉంటుంది. నేను ఎక్కువ సేపు క్రీజులో నిలబడగలను, మ్యాచ్ పరిస్థితిని బట్టి షాట్లు ఆడగలను. ఒక్క తప్పిదం మీ ఇన్నింగ్స్ను ముగించేస్తుంది. అలాంటప్పుడు భయం, ఆందోళన సహజం. కొన్ని సార్లు నేను ఇంకా ఆడగలనా? అనే భావన వస్తుంది. అదే క్రీడ ప్రత్యేకత. ప్రతీ బంతిని ఎదుర్కొంటూ ఆ భయాన్ని జయించాలి. దీర్ఘ ఇన్నింగ్స్ ఆడినప్పుడు మళ్లీ మీరు మీ మునుపటి ఫామ్ అందుకుంటారు’ అని అన్నాడు.
Also Read
- Prasidh Krishna: మేము బాగా బౌలింగ్ చేస్తే సరిపోదు.. ప్రసిద్ధ్ కృష్ణ కీలక వ్యాఖ్యలు!
- IND vs SL 2nd Test: భారత్ ఇన్నింగ్స్ తేడాతో గెలవొచ్చు.. ఎలా అంటే?
- Dhruv Jurel Tattoo: ‘జై జవాన్.. జై కిసాన్’ టాటూ.. అసలు విషయం చెప్పేసిన ధ్రువ్ జురెల్!
- Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ 'మెధావి బిధూరి'.?
Also Read: What’s Today: ఈరోజు ఏమున్నాయంటే?
‘ఏళ్ల తరబడి ఆడుతున్నా. చాలా కాలంగా ఆడుతున్నపుడు మనిషిగా కూడా మెరుగుపడతారు. ఆస్ట్రేలియా టూర్ తర్వాత ఇదే నా మొదటి మ్యాచ్. మొదటి నుంచే బంతి బాగా వస్తుందన్న భావన వచ్చింది. ఆ రోజు నాకు వచ్చిన ఎనర్జీ వేరే స్థాయిలో ఉంది. రిస్క్లు తీసుకునే ధైర్యం వచ్చింది. డిసైడర్ మ్యాచ్లే మాలోని అసలైన ఆటను బయటకు తెప్పిస్తాయి. ఈరోజు మ్యాచ్లో నేను టీమ్ కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయాలనుకున్నా. ఇదే విషయంపై రోహిత్ శర్మతో మాట్లాడా. జట్టు విజయంలో భాగమైనందుకు ఆనందంగా ఉంది. జట్టు అవసరాలకే నేను ప్రాధాన్యం ఇస్తాను. ఈ మూడు మ్యాచ్లు నాకు చాలా సంతృప్తిని ఇచ్చాయి. జట్టుకు ఇంకా నా వంతు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాను’ అని కింగ్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభాలే, స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు!
-
Boltt Ace 5G, Evo: బోల్ట్ ఏస్ 5G, ఇవో రిలీజ్.. 6000mAh బ్యాటరీ, 64MP AI కెమెరా, 8GB ర్యామ్.. ధర, ఫీచర్లు ఇవే
-
US Iran Sanctions: ఇరాన్తో ఆయిల్ డీల్స్.. 4 భారతీయ కంపెనీలపై ట్రంప్ ఆంక్షలు! అసలు కారణం ఇదే
-
Sugar Prices Fall: సామాన్యులకు తీపి కబురు.. భారీగా తగ్గిన చక్కెర ధరలు
-
Toxic Advance Booking: ఒక్క గంటలోనే లక్ష టికెట్లు.. యష్ సినిమాకు మామూలు క్రేజ్ కాదు!
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!