Virat Kohli: కోహ్లీ ఫ్యాన్స్కు శుభవార్త.. ఇక దూసుకెళ్లుడే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గాయం నుండి వేగంగా కోలుకుంటూ, ఇంగ్లాండ్తో జరగబోయే వన్డే సిరీస్ ద్వారా మళ్లీ జట్టులోకి పునరాగమనం చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. హ్యామ్స్ట్రింగ్ గాయం కారణంగా కోహ్లీ ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన వన్డే సిరీస్కు దూరమయ్యాడు. అయితే.. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం ప్రస్తుతం అతని గాయం వేగంగా నయమవుతోంది. అతను ఇప్పటికే పునరావాస (రీహాబిలిటేషన్) ప్రక్రియను ప్రారంభించాడు.
త్వరలోనే కోహ్లీ తన ఫిట్నెస్ పరీక్ష, క్లియరెన్స్ కోసం బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కు నివేదించనున్నాడు. అనుకున్న ప్రణాళిక ప్రకారం కోలుకుంటే.. ఇంగ్లాండ్ సిరీస్లోనే అతను తిరిగి జట్టులోకి వస్తాడని సమాచారం. ఇంగ్లాండ్ పర్యటనకు సంబంధించిన వన్డే జట్టును ఎంపిక చేయడానికి రాబోయే మూడు, నాలుగు రోజుల్లో సెలక్షన్ కమిటీ సమావేశం కానుందని బిసిసిఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపారు. భారత్, ఇంగ్లాండ్ మధ్య వన్డే సిరీస్ జూలై 14 నుండి 19 వరకు జరగనుంది.
Also Read
- ICC Women's Champions Trophy 2027: మహిళల క్రికెట్లో కొత్త చరిత్ర.. ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యం.. తేదీలు ఖరారు
- Quinton de Kock: 106 పరుగుల విధ్వంసం.. కోహ్లీ, వార్నర్ సరసన డి కాక్.. టీ20ల్లో అరుదైన రికార్డు
- Ravindra Jadeja: జడేజా చాలా హ్యాండ్సమ్, నా ఫేవరెట్ క్రికెటర్.. ఇంగ్లండ్ దిగ్గజం ఆసక్తికర వ్యాఖ్యలు!
- Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
మరోవైపు.. మోకాలి గాయం నుండి కోలుకున్న యువ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా, ఆఫ్ఘనిస్తాన్తో జరగబోయే మూడో మరియు చివరి వన్డే కోసం భారత జట్టుతో చేరాడు. టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్లో రాణా కుడి మోకాలికి గాయం కావడంతో ఫిబ్రవరిలో అతనికి శస్త్రచికిత్స జరిగింది. ఈ గాయం కారణంగా అతను టీ20 ప్రపంచకప్ మరియు ఐపీఎల్ రెండింటికీ దూరమయ్యాడు. ప్రస్తుతం బిసిసిఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో పునరావాసం పూర్తి చేసుకున్న రాణా, చెన్నైలో వన్డే జట్టుతో కలిశాడు. కాగా, ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను భారత్ ఇప్పటికే 2-0తో కైవసం చేసుకుంది. కోహ్లీ రాకతో ఇంగ్లాండ్ సిరీస్ నాటికి భారత బ్యాటింగ్ లైన్అప్ మరింత బలోపేతం కానుంది.
- Tags
- bcci
- icc
- VIRAT KOHLI
తాజావార్తలు
-
Jeetendra Mishra: ‘రామ మందిర నిర్వహణ అద్భుతం.. జితేంద్ర మిశ్రా కితాబు
-
Ashok Kumar : ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల్లో ట్విస్ట్.. అశోక్ కుమార్ సంచలన ఆరోపణలు
-
ICC Women’s Champions Trophy 2027: మహిళల క్రికెట్లో కొత్త చరిత్ర.. ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యం.. తేదీలు ఖరారు
-
Cyberabad Constable : సోషల్ మీడియాలో పోలీస్ కామెంట్స్.. కానిస్టేబుల్పై సీపీ వేటు
-
UN Warns: ముంబై, కోల్కతా నీట మునిగే ముప్పు ఉంది.. ఐరాస హెచ్చరిక
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!