Virat Kohli: కోహ్లీ ఫ్యాన్స్కు శుభవార్త.. ఇక దూసుకెళ్లుడే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గాయం నుండి వేగంగా కోలుకుంటూ, ఇంగ్లాండ్తో జరగబోయే వన్డే సిరీస్ ద్వారా మళ్లీ జట్టులోకి పునరాగమనం చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. హ్యామ్స్ట్రింగ్ గాయం కారణంగా కోహ్లీ ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన వన్డే సిరీస్కు దూరమయ్యాడు. అయితే.. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం ప్రస్తుతం అతని గాయం వేగంగా నయమవుతోంది. అతను ఇప్పటికే పునరావాస (రీహాబిలిటేషన్) ప్రక్రియను ప్రారంభించాడు.
త్వరలోనే కోహ్లీ తన ఫిట్నెస్ పరీక్ష, క్లియరెన్స్ కోసం బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కు నివేదించనున్నాడు. అనుకున్న ప్రణాళిక ప్రకారం కోలుకుంటే.. ఇంగ్లాండ్ సిరీస్లోనే అతను తిరిగి జట్టులోకి వస్తాడని సమాచారం. ఇంగ్లాండ్ పర్యటనకు సంబంధించిన వన్డే జట్టును ఎంపిక చేయడానికి రాబోయే మూడు, నాలుగు రోజుల్లో సెలక్షన్ కమిటీ సమావేశం కానుందని బిసిసిఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపారు. భారత్, ఇంగ్లాండ్ మధ్య వన్డే సిరీస్ జూలై 14 నుండి 19 వరకు జరగనుంది.
Also Read
- Rashid Khan Creates ODI History: వన్డేల్లో అరుదైన రికార్డు.. తొలి స్పిన్నర్గా చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్..
- Dharmendrasinh Jadeja: 609 వికెట్ల వీరుడు.. టీమ్ ఇండియాలో చోటు లేదు.. ధర్మేంద్రసింగ్ జడేజా కథ ఇదే!
- Mrunal Thakur-Yashasvi Jaiswal Dating: యశస్వితో రిలేషన్షిప్.. మృణాల్ ఠాకూర్ కామెంట్స్ వైరల్.. నిజమెంత?
- Rishabh Pant: అర్ధరాత్రి సీఎం సాయం కోరిన రిషబ్ పంత్.. స్పందించిన పుష్కర్ సింగ్ ధామి
మరోవైపు.. మోకాలి గాయం నుండి కోలుకున్న యువ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా, ఆఫ్ఘనిస్తాన్తో జరగబోయే మూడో మరియు చివరి వన్డే కోసం భారత జట్టుతో చేరాడు. టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్లో రాణా కుడి మోకాలికి గాయం కావడంతో ఫిబ్రవరిలో అతనికి శస్త్రచికిత్స జరిగింది. ఈ గాయం కారణంగా అతను టీ20 ప్రపంచకప్ మరియు ఐపీఎల్ రెండింటికీ దూరమయ్యాడు. ప్రస్తుతం బిసిసిఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో పునరావాసం పూర్తి చేసుకున్న రాణా, చెన్నైలో వన్డే జట్టుతో కలిశాడు. కాగా, ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను భారత్ ఇప్పటికే 2-0తో కైవసం చేసుకుంది. కోహ్లీ రాకతో ఇంగ్లాండ్ సిరీస్ నాటికి భారత బ్యాటింగ్ లైన్అప్ మరింత బలోపేతం కానుంది.
- Tags
- bcci
- icc
- VIRAT KOHLI
తాజావార్తలు
-
UPI Charges: UPI ఛార్జీలపై కీలక అప్డేట్.. కిరాణా దుకాణాలు, చిన్న వ్యాపారులకు గుడ్న్యూస్
-
Jharkhand: జార్ఖండ్లో పేపర్ లీక్ నిరసనలు.. ప్రభుత్వంతో చర్చలు విఫలం
-
Rashid Khan Creates ODI History: వన్డేల్లో అరుదైన రికార్డు.. తొలి స్పిన్నర్గా చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్..
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
Bengaluru: బాత్రూమ్లో మహిళ అస్థిపంజరం లభ్యం.. ట్విస్ట్ ఏంటంటే..!
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!