Monty Panesar: విరాట్ కోహ్లీ సెంచరీతో అదరగొడతాడు.. టీ20 ప్రపంచకప్ భారత్దే..
- మ్యాచ్ భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్
- విరాట్ కోహ్లి ఫైనల్లో సెంచరీ సాధించడంపై భారీ అంచనాలు
- భారత్ ప్రపంచకప్ గెలుస్తుందని అంచనాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Monty Panesar: మరికొన్ని గంటల్లోనే టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. బార్బడోస్లోని కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు భారత్, దక్షిణాఫ్రికా మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. భారత స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీపై ఇంగ్లండ్ మాజీ లెఫ్టార్మ్ స్పిన్నర్ మాంటీ పనేసర్ భారీ అంచనాలు వేశాడు. 2024 టీ20 వరల్డ్కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తాడని మాంటీ చెప్పాడు. ఈ పోరులో కచ్చితంగా టీమిండియా గెలుస్తుందని పనేసర్ అంచనా వేశాడు.
ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్లో విరాట్ కోహ్లీ పేలవ ఫామ్తో ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పటివరకు విరాట్ ఏడు ఇన్నింగ్స్ల్లో 10.71 సగటుతో 75 పరుగులు మాత్రమే చేశాడు. ఇంగ్లండ్తో జరిగిన సెమీ ఫైనల్లో 9 బంతుల్లో ఒక పరుగు మాత్రమే నమోదైంది. ఈ టోర్నీలో విరాట్ రెండుసార్లు సున్నాతో ఔటయ్యాడు. ఏఎన్ఐతో మాంటీ పనేసర్ మాట్లాడుతూ.. టీ20 ప్రపంచకప్ను భారత్ గెలుస్తుందని, విరాట్ కోహ్లి సెంచరీ సాధిస్తాడని అన్నారు.
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
Read Also: IND vs SA: చరిత్ర సృష్టించే దశలో రోహిత్.. టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో రికార్డు ఎలా ఉందంటే?
‘భారత్ ప్రపంచకప్ గెలుస్తుంది’
సెమీ ఫైనల్లో రీస్ టాప్లీ బౌలింగ్లో విరాట్ కోహ్లి మిడ్ వికెట్ మీదుగా అద్భుతమైన సిక్సర్ కొట్టాడు. అయితే ఆ తర్వాతి బంతికే భారీ షాట్ ఆడేందుకు విరాట్ కోహ్లి వికెట్ కోల్పోయాడు. కోహ్లీ పేలవమైన ఫామ్ను రోహిత్ శర్మ కూడా సమర్థించాడు. సెమీ-ఫైనల్ గెలిచిన తర్వాత, విరాట్ త్వరలో ఫామ్లోకి వస్తాడని రోహిత్ ఊహించాడు. రోహిత్ కూడా విరాట్ను సమర్థించాడు. సెమీఫైనల్లో విజయం సాధించిన అనంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ, విరాట్ కోహ్లీ ఫామ్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అతను పెద్ద మ్యాచ్ ప్లేయర్. ఆఖరి మ్యాచ్లో విరాట్ కోహ్లీ రాణిస్తాడని రోహిత్ చెప్పాడు. 15 ఏళ్ల పాటు క్రికెట్ ఆడితే ఫామ్ సమస్య కాదని రోహిత్ చెప్పాడు. భారీ మ్యాచ్లలో విరాట్ కోహ్లీ భారత్ను కష్టాల నుంచి గట్టెక్కించాడని చెప్పాడు.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!