T20 World Cup 2026: భారత్ సెమీస్ చేరితే.. ఎదుర్కోబోయే ప్రత్యర్థి ఎవరంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ 2026 ఇప్పుడు ఉత్కంఠభరితమైన స్థాయికి చేరుకుంది. సూపర్ 8 స్టేజ్లో గ్రూప్-1 నుండి దక్షిణాఫ్రికా ఇప్పటికే సెమీ-ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకుంది. మెరుగైన నెట్ రన్ రేట్తో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన దక్షిణాఫ్రికా జట్టు సెమీస్కు దూసుకెళ్లింది. ఇక ఈ గ్రూప్ నుండి రెండో సెమీఫైనలిస్ట్ ఎవరనేది మార్చి 1న కోల్కతా లోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య జరిగే పోరుతో తేలిపోనుంది.
T20 World Cup 2026: పాకిస్తాన్ సెమీస్ ఆశలు సజీవం.. కానీ, ఇలా గెలిస్తేనే..!
Also Read
- T20I Matches: క్రికెట్ అభిమానులకు అలర్ట్.. టీ20 మ్యాచ్ల వేళల్లో మార్పులు.. ఒక గంట ముందుగానే..
- Vaibhav Vs Kohli: యుద్ధానికి సిద్ధం అవుతున్న వైభవ్ సూర్యవంశీ.. ఫస్ట్ టార్గెట్ కోహ్లీ రికార్డే..
- Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
- World Cup: కేవలం 30 సెకన్ల మీటింగ్.. వరల్డ్ కప్ కొట్టిన భారత్.. సంచలన రహస్యం చెప్పిన కెప్టెన్..
భారత్, వెస్టిండీస్ జట్లకు సెమీస్ అవకాశాలను నిర్ణయించే ‘డూ ఆర్ డై’ మ్యాచ్ ఇది. ప్రస్తుతం టీమ్ ఇండియా ఆడిన 2 మ్యాచ్ల్లో ఒక మ్యాచ్ లో ఒడి, మరో మ్యాచ్ లో గెలిచి 2 పాయింట్లతో ఉంది. అటు వెస్టిండీస్ కూడా సమానమైన పాయింట్లతో సెమిస్ పోటీలో ఉంది. భారత్ ఈ మ్యాచ్లో వెస్టిండీస్ను ఓడిస్తే.. 4 పాయింట్లతో గ్రూప్లో రెండో స్థానంలో నిలిచి సెమీఫైనల్ టికెట్ ఖరారు చేసుకుంటుంది. ఒకవేళ భారత్ ఓడిపోతే.. టోర్నీ నుండి నిష్క్రమించాల్సి ఉంటుంది. అందుకే ఈ మ్యాచ్ ఒక క్వార్టర్ ఫైనల్ను తలపిస్తోంది.
ఒకవేళ భారత్ వెస్టిండీస్పై గెలిచి సెమీస్కు అర్హత సాధిస్తే.. తదుపరి ప్రత్యర్థి ఎవరు అనే ఆసక్తి ఇప్పుడు అందరిలోనూ నెలకొంది. ఐసీసీ నిబంధనల ప్రకారం గ్రూప్-1లో రెండో స్థానంలో నిలిచే జట్టు, గ్రూప్-2లో అగ్రస్థానంలో ఉన్న జట్టుతో తలపడాలి. ప్రస్తుతం గ్రూప్-2లో ఇంగ్లాండ్ వరుసగా 3 విజయాలతో అజేయంగా నిలిచి టేబుల్ టాప్లో ఉంది. కాబట్టి, భారత్ గ్రూప్-1 నుండి రెండో జట్టుగా క్వాలిఫై అయితే.. సెమీఫైనల్లో ఇంగ్లాండ్తో తలపడటం ఖాయం.
IPL 2026: ఐపీఎల్ వాయిదా.. ప్రారంభ మ్యాచ్ అప్పుడే..!
ఈ హై-వోల్టేజ్ సెమీ-ఫైనల్ మ్యాచ్ మార్చి 5న ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది. ప్రస్తుతం ఫామ్ లో ఉన్న ఇంగ్లాండ్ జట్టును ఎదుర్కోవడం భారత్ కు సవాలుతో కూడుకున్న పని. ఇదివరకు 2022 టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ లో కూడా భారత్-ఇంగ్లాండ్ జట్లే తలపడ్డాయి. ఆ సమయంలో ఇంగ్లాండ్ ఘనవిజయం సాధించి భారత్ను టోర్నీ నుండి బయటకు పంపింది. ఈసారి భారత్ సెమీస్లో ఇంగ్లాండ్ను ఢీకొని గెలిస్తే.. ఆనాటి పరాజయానికి ప్రతీకారం తీర్చుకునే గొప్ప అవకాశం లభిస్తుంది.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!